పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్..
ఉభయ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్య పుస్తకాల సరఫరా మొదలైంది. విద్యా సంవత్సరం ఆరంభం కాగానే విద్యార్థులకు అందజేసే లక్ష్యంతో విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముందస్తు చర్యలను సెలవులు మొదలైన తర్వాత ఏప్రిల్ నెల నుంచే ఉన్నతాధికారులు ప్రారంభించారు.
ఉభయ జిల్లాలకు సుమారు 3 లక్షలు సరఫరా
పాల్వంచ, న్యూస్టుడే
పాత కొత్తగూడెంలోని గోదాములో దిగుమతి అయిన పుస్తకాలను పరిశీలిస్తున్న
డీఈఓ వెంకటేశ్వరాచారి, ఏఎంఓ నాగరాజశేఖర్, నిర్వాహకుడు రవిప్రతాప్
ఉభయ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్య పుస్తకాల సరఫరా మొదలైంది. విద్యా సంవత్సరం ఆరంభం కాగానే విద్యార్థులకు అందజేసే లక్ష్యంతో విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముందస్తు చర్యలను సెలవులు మొదలైన తర్వాత ఏప్రిల్ నెల నుంచే ఉన్నతాధికారులు ప్రారంభించారు. ముఖ్యంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్లను దశల వారీగా సరఫరా చేస్తున్నారు.
‘2024-2025’ విద్యా సంవత్సరంలో కొత్త ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పుల్లో ముఖ్యమైనది పాఠ్య పుస్తకాల బరువు తగ్గించడం. గతంలో పాఠ్యాంశాలు ముద్రించిన పేపరు బరువు కాస్త ఎక్కువగా ఉండేది. పుస్తకాలు మోసేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఈసారి ఈసమస్య ఉత్పన్నం కాకుండా తక్కువ బరువుండే పేరుతో పుస్తకాలు హైదరాబాద్లో ముద్రిస్తున్నారు. సిద్ధమైన వాటిని ఆలస్యం చేయకుండా, రాత పుస్తకాలతో కలిపి జిల్లా కేంద్రాల్లోని గోదాములకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఉభయ జిల్లాల విద్యార్థులకు కావాల్సిన ఇండెంట్లో అన్ని సబ్జెక్టుల్లో 25 శాతం వరకు పుస్తకాలు చేరుకున్నాయి. జిల్లాకు సుమారు 4 లక్షల చొప్పున నోట్ పుస్తకాలు సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఒకలోడు సరఫరా చేయగా, గోదాముల్లో భద్రపరిచారు. ఈనెల చివరి నాటికి పుస్తకాల సరఫరా వంద శాతం పూర్తవుతుందని విద్యాశాఖ చెబుతోంది. జూన్ రెండోవారం తరగతులు పునః ప్రారంభం అయ్యే నాటికే విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల పుస్తకాలు అందించేలా జిల్లా స్థాయి యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది.
గోదాముల్లో భద్రం..
అన్ని రకాల ప్రభుత్వ యాజమాన్యాల్లోని విద్యాలయాలకు ఉచిత పాఠ్య పుస్తకాల సరఫరా జరుగుతోంది. తరగతుల వారీ ఇండెంట్ను మండల విద్యా శాఖాధికారుల డీఈఓలు నుంచి సేకరించారు. ఆ వివరాలను గతనెల ఆరంభంలోనే రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లా కేంద్రాల్లోని గోదాములకు ప్రస్తుతం పాఠ్యపుస్తకాల లోడ్లు వస్తున్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు తరగతుల వారీగా అందజేయాల్సిన రాత పుస్తకాలకు సంబంధించి ఇప్పటికే ఒక లోడు అందినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు జిల్లా గోదాముల్లో దిగుమతి అవుతున్నాయి. ఇప్పటి వరకు అందిన వాటిని త్వరలో మండలాల వారీగా పంపిణీ చేస్తాం. ప్రభుత్వ, కేజీబీవీ, ఎయిడెడ్, గురుకులాలు, ఆశ్రమ విద్యాలయాలకు సకాలంలో పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటాం’.
వెంకటేశ్వరాచారి, డీఈఓ, భద్రాద్రి కొత్తగూడెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేమేం పాపం చేశాం నాన్నా..!
[ 19-05-2024]
ఆస్తి కోసం ఓ కర్కశకుడు కన్నతల్లి, తన ఇద్దరు కూతుళ్లను హతమార్చిన సంఘటనతో.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో కలకలం రేగింది. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పిట్టల వెంకటేశ్వర్లు మొదటి భార్య మృతితో త్రివేణిని రెండో వివాహం చేసుకోవడం.. -
బాధిత మహిళలకు భరోసా..
[ 19-05-2024]
ప్రస్తుత సమాజంలో మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. లైంగిక వేధింపులు. జరిగే అన్యాయాన్ని పరువు కోసం బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్న వారెందరో ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 55 పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్
[ 19-05-2024]
పూర్వ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. ఉప ఎన్నిక సిబ్బంది నియామకం, ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. -
టీఎస్ఈఏపీ సెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఖమ్మం నగరానికి చెందిన పలు ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. -
ఐటీఐ ప్రవేశాలకు వేళాయె..!
[ 19-05-2024]
పదో తరగతి ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ‘2024-25’ విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పిడుగుపాటుతో రైతు మృతి
[ 19-05-2024]
పిడుగుపాటుకు పొలంలో ఓ రైతు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన సంపసాల కృష్ణ(55) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు: తమ్మినేని
[ 19-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. -
రామయ్యకు బంగారు తులసీ దళార్చన
[ 19-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. క్యూలైన్లతో పాటు ప్రసాదాల కౌంటర్లు కిటకిటలాడాయి. పసిడితో తయారు చేసిన తులసీ దళాలను సీతారాముడి పాదాల చెంత ఉంచి అర్చన చేశారు. -
‘మహస్వి’కి 102వ ర్యాంకు
[ 19-05-2024]
టీఎస్ ఈఏపీసెట్ ఫలితాల్లో ఖమ్మం న్యూవిజన్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని జి.మహస్వి రాష్ట్రస్థాయిలో 102వ ర్యాంకు సాధింది. జేఈఈ మెయిన్స్లో సైతం ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 732వ ర్యాంకు సాధించటం విశేషం. -
ఉపకార వేతనానికి దరఖాస్తుల ఆహ్వానం
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఖమ్మం జిల్లాకు చెందిన విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులు ఈనెల 31 లోపు ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎన్.విజయలక్ష్మి శనివారం తెలిపారు. -
రహదారుల పనులకు అనుమతి ఇవ్వండి: తుమ్మల
[ 19-05-2024]
ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ ఫేజ్-1, 3, ఎల్డబ్ల్యూఈ 2018-19, ఎస్సీఏ స్కీం కింద ప్రారంభించిన రహదారుల పనులకు అనుమతులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటవీశాఖ మంత్రి, పీసీసీఎఫ్లకు విజ్ఞప్తి చేశారు. -
గ్రూప్-1 ప్రిలిమ్స్కు ఏర్పాట్లు
[ 19-05-2024]
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ గౌతమ్ హాజరయ్యారు.