అదనపు సమయం.. ఓటుకు పోటెత్తాలి జనం
ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ సమయం పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తద్వారా పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం: ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ సమయం పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తద్వారా పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈసారి గంట సమయాన్ని ఎన్నికల సంఘం పొడిగించింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్ జరగనుంది.
ఖమ్మం జిల్లాలో ఒకలా.. భద్రాద్రిలో మరోలా..
పెరిగిన పోలింగ్ సమయం కేవలం ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గాలకు మాత్రమే వర్తించనుంది. ఈ నియోజకవర్గాల్లో మాత్రమే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ సాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం భద్రాద్రి జిల్లాలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఈ జిల్లాలోని ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలు మహబూబాబాద్ లోక్సభ స్థానం పరిధిలో, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలు ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయి.
2019లో తగ్గిన పోలింగ్ శాతం
ఓటర్లు స్వీయప్రేరణతో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేలా యంత్రాంగం అవగాహన కల్పించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించటం లేదు. 2014లో ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలో 82.20 శాతం పోలింగ్ నమోదవగా.. 2019లో 75.30 శాతానికి పడిపోయింది. మహబూబాబాద్ స్థానం పరిధిలో 2014లో 81.21 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోగా.. 2019లో 69.06 శాతం పోలింగ్ నమోదైంది.
ఈసారైనా.. మారేనా
సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనిపించటం లేదు. ఓటేసేందుకు కొందరు ప్రజలు సుముఖత చూపటం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన మూడు విడతల్లో పోలింగ్ 70 శాతం దాటకపోవటం గమనార్హం. పోలింగ్ రోజు సెలవు ప్రకటించటంతో కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లటం, ఇంకొందరు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకపోవటం, అభ్యర్థులపై విముఖత వంటివి కారణాలుగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో ఈసారి అదనపు పోలింగ్ సమయం వల్ల ఓటింగ్ శాతం ఏమేరకు పెరుగుతుందో వేచిచూడాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోపిడీ, సామాజిక వివక్షపై ఉద్యమించాలి: తమ్మినేని
[ 20-05-2024]
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీ నిర్మూలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్ సీపీఎం పార్టీ కార్యాలయం సత్యం భవన్లో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. -
ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం
[ 20-05-2024]
కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 20-05-2024]
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
లాభాల లహరి
[ 20-05-2024]
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూనే సంస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ప్రైవేటుతో పోటీపడుతూ అధునాతన సదుపాయాలను తీసుకొస్తోంది. -
భూసార పరీక్షలు కొందరికే
[ 20-05-2024]
ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. -
బతుకుజీవుడా..
[ 20-05-2024]
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా: మంత్రి పొంగులేటి
[ 20-05-2024]
ప్రతి పేదింటి కష్టసుఖాలను పంచుకుంటానని, అభివృద్ధిని చేతల్లో చూపుతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం: శైలజ టీచర్
[ 20-05-2024]
దేశంలో కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే శైలజ టీచర్ అన్నారు. -
మెలికలు తిరుగుతూ.. మెరికలుగా మారుతూ..
[ 20-05-2024]
జిమ్నాస్టిక్స్లో ప్రావీణ్యం సాధించాలంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి రావాల్సిందే. సాధన చేసే క్రీడాకారులపై ఆర్థిక భారం ఉండదు. సాధన కేంద్రమైన జిమ్నాజియం ఏర్పాటు రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్నది. -
రాములోరికి పసిడి పుష్పార్చన
[ 20-05-2024]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
‘భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం’
[ 20-05-2024]
భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం వైరాలోని అమరవీరుల నగర్లో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!