భాజపాకు మాదిగలు ఓటేయొద్దు
అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని, రిజర్వేషన్లు తీసేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్న భాజపాకు మాదిగలు ఓటు వేయవద్దని మాదిగ ఐకాస వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత డా.పిడమర్తి రవి పిలుపునిచ్చారు.
తప్పుదారి పట్టిస్తున్న మందకృష్ణ, మోత్కుపల్లి
ఐకాస వ్యవస్థాపకుడు పిడమర్తి రవి
మాట్లాడుతున్న పిడమర్తి రవి, చిత్రంలో వక్కలగడ్డ సోమచంద్రశేఖర్
ఖమ్మం ఖానాపురం హవేలి, న్యూస్టుడే: అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని, రిజర్వేషన్లు తీసేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్న భాజపాకు మాదిగలు ఓటు వేయవద్దని మాదిగ ఐకాస వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత డా.పిడమర్తి రవి పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్క్లబ్లో విలేకర్ల సమావేశంలో గురువారం మాట్లాడారు. రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ, మోత్కుపల్లి నరసింహులు మాదిగలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు, హక్కులను కల్పించింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. భాజపా అధికారంలోకి వస్తే మొదటి దెబ్బ ముస్లింలపై, రెండో దెబ్బ దళితులపైన పడుతుందన్నారు. మోదీ రామాలయం కట్టి ఓట్లు అడుగుతున్నారని.. ఎస్సీ వర్గీకరణ చేయకుండానే మాదిగలను ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో వర్గీకరణ కేసు రిజర్వు అయిందని, తీర్పు అనుకూలంగా వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని అమలుచేయాల్సి ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి గెలిస్తే మందకృష్ణ ఎక్కడికి పోతార[ని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మాదిగలకు పదవులు ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో రెండుచోట్ల సీటు కేటాయించకపోవడం వల్ల మాదిగలకు వచ్చిన నష్టం ఏమీ లేదని, భాజపా గెలిస్తే భవిష్యత్తే లేకుండా చేస్తారని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా మాదిగలు కాంగ్రెస్కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మాదిగ నేత వక్కలగడ్డ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఖమ్మంలో 3.50 లక్షల మంది మాదిగలు అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు. మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య, మహా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్తపాక నర్సింహారావు, మాదిగ ఐకాస నాయకులు మోదుగు జోగారావు, తెలంగాణ బహుజన సమితి రాష్ట్ర కన్వీనర్ గజ్జెల్లి మల్లికార్జున్, మాదిగ విద్యార్థి ఓయూ ఐకాస అధ్యక్షుడు జోగు గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
[ 20-05-2024]
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
దోపిడీ, సామాజిక వివక్షపై ఉద్యమించాలి: తమ్మినేని
[ 20-05-2024]
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీ నిర్మూలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్ సీపీఎం పార్టీ కార్యాలయం సత్యం భవన్లో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. -
ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం
[ 20-05-2024]
కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 20-05-2024]
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
లాభాల లహరి
[ 20-05-2024]
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూనే సంస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ప్రైవేటుతో పోటీపడుతూ అధునాతన సదుపాయాలను తీసుకొస్తోంది. -
భూసార పరీక్షలు కొందరికే
[ 20-05-2024]
ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. -
బతుకుజీవుడా..
[ 20-05-2024]
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా: మంత్రి పొంగులేటి
[ 20-05-2024]
ప్రతి పేదింటి కష్టసుఖాలను పంచుకుంటానని, అభివృద్ధిని చేతల్లో చూపుతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం: శైలజ టీచర్
[ 20-05-2024]
దేశంలో కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే శైలజ టీచర్ అన్నారు. -
మెలికలు తిరుగుతూ.. మెరికలుగా మారుతూ..
[ 20-05-2024]
జిమ్నాస్టిక్స్లో ప్రావీణ్యం సాధించాలంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి రావాల్సిందే. సాధన చేసే క్రీడాకారులపై ఆర్థిక భారం ఉండదు. సాధన కేంద్రమైన జిమ్నాజియం ఏర్పాటు రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్నది. -
రాములోరికి పసిడి పుష్పార్చన
[ 20-05-2024]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
‘భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం’
[ 20-05-2024]
భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం వైరాలోని అమరవీరుల నగర్లో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక