రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి: భట్టి
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఎర్రుపాలెంలో గురువారం నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు.
ఎర్రుపాలెంలో ప్రజలకు అభివాదం చేస్తున్న భట్టి విక్రమార్క, పొంగులేటి, రఘురాంరెడ్డి
ఎర్రుపాలెం, న్యూస్టుడే: ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఎర్రుపాలెంలో గురువారం నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరు గ్యారంటీలు అమలుచేశామని, మహిళలకు వడ్డీ రాయితీ అందిస్తున్నామని చెప్పారు. సాగునీటిని రెండో జోన్లోకి తెస్తున్నామని తెలిపారు. రైల్వేగేట్ వద్ద ఆర్వోబీ నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో భాజపా పేదలకు చేసిందేమీ లేదని, పదేళ్ల భారాస పాలనలో ఆపార్టీ నాయకులు దోచుకుతిన్నారని ఆరోపించారు. రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే హస్తం గుర్తుపై ఓటు వేసి రఘురాంరెడ్డిని గెలిపించాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పొన్నం వెంకటేశ్వరరావు, ఎ.వెంకటేశ్వరరెడ్డి, కోటా రాంబాబు, వి.సుధాకర్రెడ్డి, ఎంపీపీ డి.శిరీష, బి.నరసింహారావు, ఏవీ.కృష్ణారావు, ఎస్.శ్రీనివాసరెడ్డి, షేక్ ఇస్మాయిల్, ఎం.లక్ష్మణరావు, బాబూరావు, డి.శ్రీనివాస్, తిరుపతమ్మ, రాజీవ్గాంధీ, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలపై రూ.7 లక్షల కోట్ల అప్పుల భారం: రేణుకాచౌదరి
ఖమ్మం కమాన్బజార్: రాష్ట్రంలో పదేళ్లు పాలన సాగించిన కేసీఆర్ ప్రజలపై రూ.7 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఎంపీ రేణుకాచౌదరి విమర్శించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలోని ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్లో వ్యాపారులు, కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. భారాస పనైపోయిందని.. కేంద్రంలో భాజపాకు ఈ ఎన్నికల్లో చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి దిక్సూచిలా ఉన్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ కేంద్రం నుంచి జిల్లాకు నిధులు తీసుకురావడంలో భారాస విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు తుమ్మల యుగంధర్, పొంగులేటి ప్రసాద్రెడ్డి, సీపీఐ నాయకులు భాగం హేమంతరావు మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కన్నా లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మానుకొండ రాధాకిశోర్, టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి, స్వర్ణకుమారి, బాలగంగాధర్ తిలక్, జానీమియా, ముస్తాఫా పాల్గొన్నారు.
తల్లాడ: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. కుర్నవల్లి, కలకొడిమ, పినపాక, తల్లాడ, మల్లారం గ్రామాల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయి, సీపీఎం నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మువ్వా విజయబాబు, స్వర్ణకుమారి, కాపా సుధాకర్, దగ్గుల రఘుపతిరెడి, అయిలూరి వెంకటకోటారెడ్డి, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, తాతా భాస్కరరావు, అయినాల రామలింగేశ్వరరావు, మాచర్ల భారతి, మాదినేని రమేష్, గుర్రం శ్రీను, ఎర్రి నరసింహారావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
[ 20-05-2024]
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
దోపిడీ, సామాజిక వివక్షపై ఉద్యమించాలి: తమ్మినేని
[ 20-05-2024]
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీ నిర్మూలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్ సీపీఎం పార్టీ కార్యాలయం సత్యం భవన్లో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. -
ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం
[ 20-05-2024]
కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 20-05-2024]
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
లాభాల లహరి
[ 20-05-2024]
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూనే సంస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ప్రైవేటుతో పోటీపడుతూ అధునాతన సదుపాయాలను తీసుకొస్తోంది. -
భూసార పరీక్షలు కొందరికే
[ 20-05-2024]
ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. -
బతుకుజీవుడా..
[ 20-05-2024]
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా: మంత్రి పొంగులేటి
[ 20-05-2024]
ప్రతి పేదింటి కష్టసుఖాలను పంచుకుంటానని, అభివృద్ధిని చేతల్లో చూపుతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం: శైలజ టీచర్
[ 20-05-2024]
దేశంలో కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే శైలజ టీచర్ అన్నారు. -
మెలికలు తిరుగుతూ.. మెరికలుగా మారుతూ..
[ 20-05-2024]
జిమ్నాస్టిక్స్లో ప్రావీణ్యం సాధించాలంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి రావాల్సిందే. సాధన చేసే క్రీడాకారులపై ఆర్థిక భారం ఉండదు. సాధన కేంద్రమైన జిమ్నాజియం ఏర్పాటు రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్నది. -
రాములోరికి పసిడి పుష్పార్చన
[ 20-05-2024]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
‘భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం’
[ 20-05-2024]
భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం వైరాలోని అమరవీరుల నగర్లో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల