logo

మెడకు ఉయ్యాలతాడు చుట్టుకొని బాలిక మృతి

మండలంలోని పెద్దదేవళాపురానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి కాత్యాయని మెడకు ఉయ్యాలతాడు చుట్టుకోవడంతో మృతిచెందారు. గ్రామానికి చెందిన సుబ్రహ్మణేశ్వరరావు, లక్ష్మీదేవి దంపతులకు ముగ్గురు సంతానం.

Published : 20 Jan 2022 03:28 IST

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: మండలంలోని పెద్దదేవళాపురానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి కాత్యాయని మెడకు ఉయ్యాలతాడు చుట్టుకోవడంతో మృతిచెందారు. గ్రామానికి చెందిన సుబ్రహ్మణేశ్వరరావు, లక్ష్మీదేవి దంపతులకు ముగ్గురు సంతానం. సాయంత్రం ఇంట్లోని ఉయ్యాలలో సరదాగా ఊగుతుండగా పొరపాటున తాడు మెడకు చుట్టుకొని తిరిగింది. తల్లిదండ్రులు పాప ఎక్కడుందని వెతకుతుండగా, అనుమానం వచ్చి ఊడల వైపు చూశారు. అప్పటికే చిన్నారి అపస్మారకిస్థితిలోకి వెళ్లింది. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బిడ్డ మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని