logo

మోదీ దత్త పుత్రుడు జగన్‌

మోదీ దయాదాక్షిణ్యాలతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మోదీకి దత్తపుత్రుడు అనటంలో ఎలాంటి సందేహం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. పత్తికొండలో శనివారం సీపీఐ కార్యాలయంలో మాట్లాడారు.

Updated : 22 May 2022 06:37 IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ


పత్తికొండ పట్టణంలోని నాలుగు స్తంభాల కూడలి నుంచి కార్యాలయానికి వెళ్తున్న సీపీఐ నాయకులు

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: మోదీ దయాదాక్షిణ్యాలతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మోదీకి దత్తపుత్రుడు అనటంలో ఎలాంటి సందేహం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. పత్తికొండలో శనివారం సీపీఐ కార్యాలయంలో మాట్లాడారు. అటు కేంద్రంలో మోదీ, ఇటు రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ అరాచక పాలన కొనసాగిస్తున్నారన్నారు. దేశంలో నానాటికీ నిరుద్యోగం పెరిగిపోయి యువతకు ఉపాధి అవకాశాలు దక్కటం లేదన్నారు. పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు ఆకాశన్నంటడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో వైకాపా సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ త్వరలో జాతీయ స్థాయిలో అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడాతామన్నారు.

పోలీసు రక్షణ ఉంటేనే..
వైకాపా పాలనలో అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు మాత్రం జగన్‌ సింహం సింగిల్‌గా వస్తారంటారు.. కానీ వేలాది మంది పోలీసుల రక్షణ లేనిదే జగన్‌ కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. గడప గడపకు మన ప్రభుతం కార్యక్రమంలో ఎక్కడికక్కడ మంత్రులను, అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారని, పోలీసుల సహకారంతో ప్రజలను బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. వైకాపా పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని