logo

ఎద్దుల బండి చక్రాల కింద పడి మృతి

ఎద్దులబండి చక్రాల కింద పడి రైతు మృతిచెందిన ఘటన మండలంలోని బాపురం గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు గ్రామానికి చెందిన కురువ ఉసేని(30) గురువారం ఉదయం పొలానికి వెళ్లారు.

Updated : 12 Aug 2022 06:23 IST

కురువ ఉసేని(పాత చిత్రం)

కౌతాళం, న్యూస్‌టుడే: ఎద్దులబండి చక్రాల కింద పడి రైతు మృతిచెందిన ఘటన మండలంలోని బాపురం గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు గ్రామానికి చెందిన కురువ ఉసేని(30) గురువారం ఉదయం పొలానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వస్తూ అదుపతప్పి కిందపడ్డారు. ఈ క్రమంలో అతని పైనుంచి బండి చక్రాలు వెళ్లడంతో తలకు ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే ఆదోనికి తరలించారు. ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని