కదలని దస్త్రం.. వీడని వివాదం
భూ వివాదాల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం జాప్యం లబ్ధిదారులకు శాపంగా మారుతోంది. రెవెన్యూ కోర్టులను ఆశ్రయిస్తే ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉంటున్నాయి.
అధికారుల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణ
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే : భూ వివాదాల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం జాప్యం లబ్ధిదారులకు శాపంగా మారుతోంది. రెవెన్యూ కోర్టులను ఆశ్రయిస్తే ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉంటున్నాయి. కొందరు అధికారులు పూర్తిస్థాయిలో దస్త్రాలు అందించకపోవడమే కారణంగా కనిపిస్తోంది. తహసీల్దార్ల నుంచి వచ్చే నివేదికలే ఈ కేసుల్లో కీలకం. ప్రతి తహసీల్దారు కార్యాలయంలో ఏ1 రిజిస్టర్, అడంగల్, 1బి ఖాతాకు సంబంధించి అన్ని వివరాలు ఉంటాయి. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే సమస్య త్వరితగతిన పరిష్కారమవుతుంది. కొందరు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంతో బాధితులు కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది.
నివేదికల్లో లోపాలు
* ఆర్వోఆర్లో తప్పుగా నమోదైందని.. కుటుంబ సభ్యుల మధ్య భూ తగాదాలు, సర్వే నంబర్లలో సమస్యలు, విస్తీర్ణంలో తేడాలు, తమ భూమిని ఆన్లైన్ అడంగల్లో నమోదు చేయలేదని.. ఇతరులు ఆక్రమించుకున్నారని తదితర వినతులు వస్తుంటాయి. తమ వద్ద ఉన్న దస్త్రాలను పరిశీలించి కచ్చితమైన నివేదికలు ఇస్తే రెవెన్యూ కోర్టుల్లోని కేసులు త్వరగా పరిష్కృతమవుతాయి. వారు తాత్సారం చేయడంతో చాలా కేసులు పెండింగ్లో ఉంటున్నాయి.
* కొన్ని భూవివాదాల కేసులు సీసీఎల్ఏ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వీటికి అబాలిషన్ చట్టం రాకముందు ఉన్న రికార్డులు సమర్పించాలని సూచించినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు.
* తహసీల్దార్లు ఇచ్చిన తీర్పులపై కొందరు ఆర్డీవో, ఆపై జేసీ, సీసీఎల్ఏ కోర్టులను ఆశ్రయిస్తుంటారు. కొన్ని రెవెన్యూ కేసుల్లో క్షేత్రస్థాయి నుంచి ఒకసారి ఒక నివేదిక ఇస్తే.. ఆ అధికారి బదిలీ అయిన తర్వాత మళ్లీ నివేదిక తెప్పించుకుంటే మరోలా ఉంటోందన్న వాదనలున్నాయి.
కనికరించని అధికారులు
కల్లూరు మండలం ఎ.గోకులపాడుకు చెందిన వెంకటగారి వెంకటేశ్వర్లు మూడేళ్ల కిందట చనిపోయారు. తండ్రి నుంచి వారసత్వంగా కుమార్తె వెంకటలక్ష్మికి 7.50 ఎకరాలు రావాల్సి ఉంది. సదరు భూమిని సాగు చేయనీయకుండా దాయాదులు అడ్డుకుంటున్నారు. ఎలాంటి భూతగాదాలు లేవు.. కోర్టు కేసులు లేవు. పట్టాదారైన వెంకటలక్ష్మి మూడేళ్ల నుంచి జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దారు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తండ్రి నుంచి సంక్రమించే భూమి కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా అటు పోలీసులు.. ఇటు రెవెన్యూ యంత్రాంగం కనికరం చూపడం లేదు.
రూ.1.50 లక్షల ఖర్చు
కోడుమూరు మండలం కొండాపురంలో సర్వే నంబరు 784-బిలో 76 సెంట్ల భూమి ఉంది. పెద్ద కోట్లన్న కుమారుడు పెద్ద నగేష్, ఆయన కుమారుడు బోయ అయ్యస్వామికి వారసత్వంగా 19 సెంట్ల భూమి రావాల్సి ఉంది. ఈ సర్వే నంబరుతో సంబంధం లేని వ్యక్తులకు రెవెన్యూ అధికారులు సదరు భూమిని ఆన్లైన్ చేశారు. ఆర్ఎస్ఆర్, మ్యానువల్ అడంగల్, ఆర్హెచ్, రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ అయ్యస్వామి పేరున ఉన్నాయి. వారసత్వంగా 2021 నుంచి సంక్రమించిన భూ దస్త్రాలతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సదరు భూమిని ఆన్లైన్ చేసి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇరువురిని పిలిపించి ఆర్టీవో భూ సమస్య పరిష్కరించాలి. ఆన్లైన్ చేయించుకున్న వ్యక్తుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోయినా రెండు నెలలుగా ఆర్డీవో ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం లేదు. చివరికి లోకాయుక్తను ఆశ్రయించారు.. కోర్టుల చుట్టూ తిరిగేందుకు ఇప్పటి వరకు రూ.1.50 లక్షల ఖర్చైందని బాధితుడు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు.
అధికార పెత్తనం
బేతంచెర్ల మండలం సీతారామపురం పరిధిలో సర్వే నంబరు 723లో ఎస్.సుంకన్న కుటుంబీకులకు 9.60 ఎకరాలు ఉండేది. 30 ఏళ్ల కిందట 5.40 ఎకరాలు భూసేకరణలో పోయింది. మిగిలిన 4.20 ఎకరాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన తెదేపా వర్గీయుడంటూ ఉద్దేశపూర్వకంగా అధికారపార్టీ వారు ఆ భూమిని 2019లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు భూమిని తీసుకునేలా ప్రయత్నాలు చేయగా సుంకన్న హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బాధితుడికి భూ హద్దులు చూపి పాసు పుస్తకాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ భూమి వివాదాస్పదంగా ఉందంటూ రెవెన్యూ అధికారులు హైకోర్టుకే తప్పుడు నివేదికలు ఇచ్చారు. బాధితుడు మరోమారు కోర్టు ధిక్కారం కేసు వేశారు.. లోకాయుక్తను ఆశ్రయించారు. ప్రస్తుత రెవెన్యూ అధికారులు పూర్వ అధికారుల తప్పిదాలను కప్పిపుచ్చేందుకు బాధితుడిని వివిధ రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు రూ.లక్ష వరకు ఖర్చు చేసినా భూ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్ల ‘దారి’ద్ర్యం
[ 27-04-2024]
జగన్ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది. గత జూన్ నుంచి డిసెంబరు వరకు కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీస్తున్నాయి.. -
సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన
[ 27-04-2024]
రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారి బృందావనానికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు. -
28, 29 తేదీల్లో చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్ తెలిపారు. -
అనుమానాలున్నా ఆమోదముద్ర
[ 27-04-2024]
అభ్యర్థుల నామపత్రాల పరిశీలనలో ‘అధికార’ పెత్తనం కొనసాగింది. అధికార పార్టీ నేతలకు చెందిన నామపత్రాలపై పలు అనుమానాలున్నా అధికారులు ఆమోదముద్ర వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇంతులు ఎటో గెలుపు అటే
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పురుష ఓటర్లు 10,13,771, మహిళలు 10,40,435, ఇతరులు 318 కలిపి 20,54,524 మంది ఓటర్లు ఉన్నారు. -
అరాచక పాలన అంతమే లక్ష్యం
[ 27-04-2024]
జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్ చింతా సురేష్ బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ డా.సంజీవ్కుమార్, కర్నూలు పార్లమెంట్ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్తో కలిసి ఎన్డీఏ ఛార్జిషీటును తిక్కారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి సంబంధించి 20 నామినేషన్లను ఆమోదించారు. -
నేతలకు కాసుల పంట.. రైతులకు కడుపు మంట
[ 27-04-2024]
‘‘వ్యవసాయ పంటల మార్కెటింగ్లో కీలకపాత్ర వహించే ఏఎంసీలు (వ్యవసాయ మార్కెట్ యార్డులు) జగన్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. అన్నదాతలకు కనీస సేవలందించలేదు. తెదేపా హయాంలో కళకళలాడిన ఏఎంసీలు ప్రస్తుతం శాఖాపరమైన కార్యకలాపాలతో సరిపెట్టుకుంటున్నాయి. -
రక్షక భటులను దగా చేసిన జగన్
[ 27-04-2024]
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం. వారికి అండగా ఉంటాం. -
ఇసుకాసురుల దారిదోపిడీ
[ 27-04-2024]
అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకను తోడేస్తున్నారు. వందల మెట్రిక్ టన్నుల లోడుతో లారీలను తిప్పుతుండటంతో.. రహదారులు రూపుకోల్పోతున్నాయి. తారు చెదిరి.. వాహనదారులను బెదిరిస్తున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 27-04-2024]
జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఏజీఎం మురళీకృష్ణ, డీన్లు సరళ, బాలాజీ శుక్రవారం తెలిపారు. -
ఓ ప్రజాప్రతినిధి.. ఇదీ దారుల దుస్థితి
[ 27-04-2024]
ఆ దారులు నరకానికి నకళ్లు.. ప్రయాణం సాగించాలంటే సాహసమే.. రాళ్ల దారిలో వెళ్లాలంటే ఒళ్లు హూనమే.. కిందపడితే రక్తధారలే.. తరుచూ ప్రమాదాలతో భయపెడుతున్నాయి. ఐదేళ్లు నిధుల మాటే లేదు. ప్రజాప్రతినిధులు భూమి పూజలతో సరిపెడుతున్నారే తప్ప.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. -
ఆలస్యమైతే.. బుగ్గిపాలే
[ 27-04-2024]
ఎండ తీవ్రత, గ్యాస్ లీకేజీలతో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే. -
జగనొచ్చారు.. పరిశోధన ప్రాణం తీశారు
[ 27-04-2024]
రాష్ట్రంలో వ్యవసాయ విధానాలు మార్చబోతున్నాం.. తన హయాంలోనే రైతులకు ఎనలేని మేలు జరుగుతున్నట్లు పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు అత్యంత ఉపయుక్తమైన వ్యవసాయ పరిశోధనలపై ఉక్కుపాదం మోపారు. -
ఎత్తిపోతలను ఎండబెట్టిన కాటసాని
[ 27-04-2024]
జుర్రేరు వాగుపై 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో దద్దణాల చెరువును నిర్మించారు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద వచ్చి చెరువులో చేరుతోంది. -
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి
[ 27-04-2024]
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. మండలంలోని సాంబవరంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.