logo

ఉర్దూ వర్సిటీ పనులు పూర్తి చేయాలి

ఓర్వకల్లు సమీపంలో తెదేపా హయాంలో చేపట్టిన ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

Published : 28 Mar 2024 03:19 IST

నిరసన తెలుపుతున్న మల్లెల రాజశేఖర్‌

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: ఓర్వకల్లు సమీపంలో తెదేపా హయాంలో చేపట్టిన ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఆయన బుధవారం తన అనుచరులతో కలిసి ఉర్దూ వర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెదేపా అధినేత చంద్రబాబు హయాంలో వచ్చిన పరిశ్రమలు తప్ప వైకాపా హయాంలో ఏ ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాలేదని విమర్శించారు. తెదేపా మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, నాయకులు మహబూబ్‌బాషా, సుధాకర్‌, బజారి, జయకృష్ణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని