logo

వైకాపా ప్రభుత్వంలో పేదలపై పన్నుల మోత: బీవీ

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ పాలనలో పేదలపై పన్నుల భారం మోపిందని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

Published : 16 Apr 2024 06:27 IST

తెదేపాలో చేరిన కలుగట్ల గ్రామ మాజీ సర్పంచి, నాయకులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ పాలనలో పేదలపై పన్నుల భారం మోపిందని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కలుగట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచి రామలింగుడు తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైకాపా పాలనలో గ్రామాభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మురళీకృష్ణరెడ్డి, శంకర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని