రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ప్రారంభంకానుంది. ఎన్నికలకు సంబంధించి నాలుగో విడతలో భాగంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ప్రారంభంకానుంది. ఎన్నికలకు సంబంధించి నాలుగో విడతలో భాగంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఈనెల 18న ప్రకటన విడుదల కానుంది. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి పలు ప్రాంతాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 25వ తేదీ వరకు నామపత్రాలు సమర్పించేందుకు గడువు ఉంది. ప్రభుత్వ కార్యాలయ పనివేళల్లో ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు అభ్యర్థులు తమ నామపత్రాలను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంది. ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో నామినేషన్లు స్వీకరించరు.
ఆన్లైన్లోనూ స్వీకరణ
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆన్లైన్లోనూ నామినేషన్లు సమర్పించే వెసులుబాటును ఎన్నికల కమిషన్ కల్పించింది. సువిధ పోర్టల్లో ఈ.అఫిడవిట్ ద్వారా నామినేషన్లు, ఆన్లైన్లోనే డిపాజిట్ మొత్తం చెల్లించేలా వీలు కల్పించారు. ఆన్లైన్లో నామపత్రాలు సమర్పించినప్పటికీ ఆ పత్రాలను ఫిజికల్గా ఆర్వోకు అందజేయాల్సి ఉంటుంది.
25 తర్వాత తుది ఓటరు జాబితా ప్రకటన
ఓటరు నమోదు ప్రక్రియ సోమవారంతో ముగిసిన నేపథ్యంలో ఈనెల 25 తర్వాత తుది ఓటరు జాబితాల ప్రచురించనున్నారు. తుది ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారందరూ ఓటు హక్కు వినియోగించుకుంటారు.
2,204 పోలింగ్ కేంద్రాలు
సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు అధికారులు సిద్ధమవుతున్నారు.. ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.. ఈ నెల 18న జిల్లా రిటర్నింగ్ అధికారి ప్రకటన జారీ చేయనున్నారు. కర్నూలు జిల్లాలో గతేడాది జనవరి 5వ తేదీ నాటికి 8 నియోజకవర్గాల్లో 2,186 పోలింగ్ కేంద్రాలుండగా.. అదనంగా పాణ్యంలో 17, ఎమ్మిగనూరులో ఒకటి కలిపి మరో 18 కేంద్రాలు పెరిగాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 2,204కు చేరింది. కర్నూలులో 258, పాణ్యం 357, పత్తికొండ 255, కోడుమూరు 275, ఎమ్మిగనూరు 272, మంత్రాలయం 237, ఆదోని 256, ఆలూరులో 294 పోలింగ్ కేంద్రాలున్నాయి.
విధుల్లో 15,869 మంది సిబ్బంది
ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 8 నియోజకవర్గాలకు 213 మంది సెక్టోరల్ అధికారులను నియమించారు. అన్ని నియోజకవర్గాలకు కలిపి ఎంసీసీ బృందాలు 35, ఫ్లయింగ్ స్క్వాడ్ (ఎఫ్ఎస్టీ) బృందాలు 64, స్టాటస్టికల్ సర్వేలెన్స్ (ఎస్ఎస్టీ) బృందాలు 78, వీఎస్టీ బృందాలు 11, వీడియో వీవింగ్ బృందాలు 10, అకౌంటింగ్ బృందాలు 09, సహాయ ఎన్నికల వ్యయ అబ్జర్వర్లు 12 మంది విధులు నిర్వర్తించనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి పీవో, ఏపీవో, నలుగురు ఓపీవోలు కలిపి ఆరుగురు అవసరం కాగా.. జిల్లాలోని మొత్తం పోలింగ్ కేంద్రాలకు 13,224 మంది సిబ్బంది అవసరం. 20 శాతం రిజర్వులో కలిపి మొత్తం 15,869 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించారు.
వృద్ధ ఓటర్లు 10,005 మంది
- 85 ఏళ్లకు పైబడిన వృద్ధ ఓటర్లలో పురుషులు 3,632, మహిళలు 6,373 మంది కలిపి మొత్తం 10,005 మంది ఉన్నారు. ఆదోనిలో అత్యధికంగా 2,307 మంది ఉండగా ఆలూరు 1,478, కోడుమూరు 1,407, పాణ్యం 1,385, కర్నూలు 978, పత్తికొండ 955, మంత్రాలయంలో 662 మంది ఓటర్లుగా ఉన్నారు. 80-85 ఏళ్లలోపు 14,356 మంది ఓటర్లకు ఇంటి వద్దే ఓటేసేందుకు అవకాశం కల్పించేందుకు అధికార యంత్రాంగానికి భారమవుతుందనే ఉద్దేశంతో 85 ఏళ్లకు పైబడినవారు మాత్రమే ఇంటి దగ్గరే ఓటేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయనుంది.
- శారీరక దివ్యాంగులు, వయో వృద్ధ ఓటర్లు ఇంటి నుంచి ఓటేయడంపై ఇప్పటికే బీఎల్వోలు సర్వే చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు రాలేని వారిని గుర్తించి వారికి ఫారం-12 దరఖాస్తులు అందించనున్నారు.
- హోమ్ ఓటింగ్కు సంబంధించి ఏప్రిల్ 18 నుంచి 21వ తేదీ వరకు బీఎల్వోల ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. హోమ్ ఓటింగ్కు అవసరమైన వారిని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) గుర్తిస్తారు. హోమ్ ఓటింగ్కు గుర్తించిన వారికి తమ ఇంటి వద్దే ఓటేసే సదుపాయం అధికారులు కల్పించనున్నారు.
23,827 మంది దివ్యాంగ ఓటర్లు
జిల్లాలో 23,827 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. కర్నూలులో 2,227, పాణ్యం 3,392, పత్తికొండ 2,528 కోడుమూరు 3,509, ఎమ్మిగనూరు 3,182, మంత్రాలయం 2,944, ఆదోని 2,430, ఆలూరులో 3,615 మంది ఉన్నారు. వీరిలో శారీరక వికలత్వంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేయలేని వారికి ఇంటి వద్దే ఓటేసే అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వంతెనలు కూలుతున్నా.. కునుకు వీడరా!
[ 30-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు అని చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. వంకలు, నదులపై నిర్మించిన వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నా జగన్ ఐదేళ్ల పాలనలో కనీసం వాటి మరమ్మతుకు అడుగు ముందుకు పడలేదు. -
జగనన్నా.. న్యాయం ఏదన్నా..
[ 30-04-2024]
మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పారు. వీటిద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. -
ప్రతి ఎకరాకు నీరందిస్తాం
[ 30-04-2024]
తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఎకరాకు నీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి హామీ ఇచ్చారు. -
ఉమ్మడి కూటమితోనే ఏపీలో అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
ఉమ్మడి కూటమితోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో విలేకరి మృతి
[ 30-04-2024]
ఆత్మకూరుకు చెందిన నెత్తికొప్పుల మహేష్(48) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విలేకరిగా పని చేస్తున్న మహేశ్ పట్టణ శివారులోని ఆర్డీటీ కాలనీలో నివాసం ఉంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!