logo

గడప.. గడపకు వెళ్లాల్సిందే

వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు.

Published : 19 Apr 2024 02:38 IST

వాలంటీర్లను ఆదేశించిన బైరెడ్డి
పలువురు విముఖత

నందికొట్కూరు, న్యూస్‌టుడే : వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. నందికొట్కూరు పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అధ్యక్షతన వాలంటీర్లతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు.  ఇబ్బందనిపిస్తే రాజీనామా చేసి ప్రచారం చేయాలని సూచించారు. ఈసారి కూడా వైకాపా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, అప్పుడు మళ్లీ మిమ్మల్ని వాలంటీర్లుగా నియమిస్తామని చెప్పారు. వైకాపా అభ్యర్థి దార సుధీర్‌ విజయం కోసం ప్రతి వాలంటీరు కృషి చేయాలన్నారు. ఇందుకు చాలామంది వాలంటీర్లు విముఖత వ్యక్తం చూసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని