ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు.
పాత విధానంపైనే అందరి ఆసక్తి
సీపీఎస్ రద్దు ఊసేది
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. కానీ తీరా ఆ మాటే మరిచారని కొత్త పథకానికి ఆమోదం తెలుపుతూ.. మోసం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత నెలకొంది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్రంగా మోసం చేశారు. జగన్ వంచనపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులకు తప్పని కష్టాలు
- వి.సురేశ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య
ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని వాగ్దానం చేస్తానన్న మాటలు నమ్మి.. సీపీఎస్ ఉద్యోగులు మోసం పోయారు. ఈ విధానాన్ని రద్దు చేయకపోగా.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వం ఏకపక్షంగా గ్యారంటెడ్ పింఛను పథకం ప్రవేశపెట్టింది. దానికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలు పదవీ విరమణ తర్వాత రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇలాంటి అనాలోచిత చర్యలతో ఉద్యోగులను వేధించడం సరికాదు.
పది శాతం చెల్లిస్తున్నారు..
- సురేష్, సీపీఎస్ ఉద్యోగి
వెల్దుర్తి, న్యూస్టుడే: కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం కింద ప్రతి ఉద్యోగికి 14శాతం ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. తమకు మాత్రం కేవలం 10శాతం మాత్రమే అందిస్తున్నారు. వీటిని సైతం ప్రతి నెలా చెల్లించాలి. 8 నెలలుగా నిధులు కేటాయించకపోవడంతో నష్టపోతున్నాం. ప్రతి నెలా మంజూరు చేయకపోవడంతో వాటిపై వచ్చే వడ్డీని కోల్పోతున్నాం. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్లు పూర్తవుతున్నా వాటిని అమలుచేయలేదు.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి..
- సి.నాగరాజు, ఎస్టీయూ రాష్ట్ర సహాయ అధ్యక్షుడు
ఆదోని విద్య, న్యూస్టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని విస్మరించారు. సీపీఎస్ విధానానికి బదులుగా జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తానన్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు సైతం సరిగా చెప్పడంలేదు. ఇది ఉద్యోగులకు తీరని నష్టాన్ని కలిగిస్తోంది. ఇంతకీ ఎవరు.. ఏ పింఛను పథకం పరిధిలోకి వస్తారో తెలియని పరిస్థితి. ఇందులో చాలా సందేహాలు ఉన్నాయి. వాటి స్పష్టతనివ్వాలి.
మాట మరిచారు..
- నాగరాజు, సీపీఎస్ ఉద్యోగి, ఆలూరు
ఆలూరు, న్యూస్టుడే: అధికారంలో వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తానని 2019 ఎన్నికల ముందు జగన్ బహిరంగగానే హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్లు కొనసాగినా నేటికీ ఆ మాట నెరవేర్చలేకపోయారు. రద్దు చేయలేకపోయారు. ముఖ్యమంత్రి జగన్ మాట ఇవ్వడమే కానీ.. అమలు చేయలేకపోతున్నారు. సీపీఎస్ రద్దు కోసం ఈ ఐదేళ్లలో ఎన్నో సార్లు ఆందోళన చేపట్టారు. అయినా ఎలాంటి స్పందన లేదు. సీపీఎస్ రద్దు చేయలేకపోవడమే కాకుండా డీఏలు, ఇతర వాటిని సక్రమంగా అందించలేకపోయారు. కొన్ని సార్లు వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
నమ్మించి వంచించారు
- ఆస్పరి సాయిబాబా, ఎన్జీవోల సంఘం తాలూకా అధ్యక్షుడు
పత్తికొండ గ్రామీణం, న్యూస్టుడే: అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచినా.. సీపీఎస్ రద్దుపై నోరు మెదపకపోవడం బాధాకరం. అంతేకాక జీఎపీఎస్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఉద్యోగులను అయోమయానికి గురిచేస్తున్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఉద్యోగులకిచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోగా.. నమ్మించి మోసం చేశారు. ఉద్యోగుల హక్కుల కోసం ఉద్యమిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించారు. పీఆర్సీ ద్వారా ప్రతి ఉద్యోగికి పెరగాల్సిన వేతనాలు, అనూహ్యంగా తగ్గించేశారు. గడిచిన ఐదేళ్లలో ఉద్యోగులను, సంఘాల నేతలను అన్ని విధాలా అణిచివేసి ఆవేదనకు గురిచేశారు. జగన్ ప్రభుత్వం చేసిన మోసానికి ప్రతి ఉద్యోగి కుటుంబం మానసింగా కుంగిపోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెన్షన్ కోసం వృద్ధుల అవస్థలు
[ 02-05-2024]
ఆదోని పట్టణంలో పెన్షన్ దారులు బ్యాంకుల వద్ద గురువారం ఇబ్బందులు పడ్డారు. -
బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. -
కూటమి గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 02-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతో రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని తెదేపా ఫ్లోర్ లీడర్ దయాసాగర్ అన్నారు. -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
[ 02-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జేసీ, నంద్యాల ఎన్నికల అధికారి రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. -
అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడి మృతి
[ 02-05-2024]
మండలంలోని కైరవాడి గ్రామంలో అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడు గురువారం మృతి చెందారు. -
సకల జనుల సంక్షేమం
[ 02-05-2024]
ఒక్క రూపాయి కూడా కట్టే పని లేకుండానే.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను.. ఉద్యోగులు, యువత, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు.. ఇలా సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ఉందంటూ క్షేత్రస్థాయిలో ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. -
హామీలు గుప్పించి.. సేవలు వికటించి
[ 02-05-2024]
జగన్ ప్రభుత్వ ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఆసుపత్రి భవనాల నిర్వహణ గాలికొదిలేసింది. -
దారితప్పిన మాటలు.. పుర వాసులకు కష్టాలు
[ 02-05-2024]
-
4న లోకేశ్ రాక
[ 02-05-2024]
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈనెల 4న నంద్యాలలో యువగళం సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ తెలిపారు. -
పింఛను దూరం 90 కి.మీ.
[ 02-05-2024]
జగన్నాటకంలో పండుటాకులు విలవిలలాడుతున్నారు. -
3 ఎమ్మెల్యేలు.. 6కి.మీ..18ఏళ్లు
[ 02-05-2024]
ఈ అంకెలు ఏంటీ అనుకుంటున్నారా..? సి.బెళగల్ మండలం కొండాపురం- ఇనగండ్ల మధ్య 6 కి.మీ. మట్టి రోడ్డును బీటీగా మారుస్తామని గత 18 ఏళ్లలో ముగ్గురు ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. -
మ్యానిఫెస్టోలో అన్నివర్గాలకు ప్రాధాన్యం
[ 02-05-2024]
రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు దర్పణం పట్టేలా తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ఉందని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
గడప.. గడపలో అబద్ధాలు చెప్పండి!
[ 02-05-2024]
అన్ని వర్గాలను అలరించేలా ఉన్న తెదేపా మ్యానిఫెస్టోపై అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేయించేందుకు వైకాపా నాయకులు కుట్రలకు తెర తీశారు. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 02-05-2024]
మండలంలోని నల్లచెలిమల, ఎంకే కొట్టాల, గుండ్లకొండ, గుడిమిరాళ్ల, బంటుపల్లి, బేతపల్లి, బండపల్లి, ఈదులదేవరబండ గ్రామాల్లో తెదేపా కూటమి అభ్యర్థి వీరభద్రగౌడు, జనసేన ఇన్ఛార్జి వెంకప్ప బుధవారం ప్రచారం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై నిరంతర నిఘా
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు, టూరిజం బార్లలో మద్యం అమ్మకాలపై నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ పర్యవేక్షణాధికారి, ఏపీఎస్బీసీఎల్ డిపో మేనేజర్ ఎం.సుధీర్బాబు తెలిపారు. -
అక్రమ మద్యం తరలిస్తూ పట్టుపడ్డ వైకాపా నాయకుడు
[ 02-05-2024]
అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న వైకాపా నాయకుడు శ్రీకాంత్రెడ్డితో పాటు మరో నలుగురిని సెబ్ పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఆలూరులో బుధవారం జరిగింది. -
డోన్లో 45.7 డిగ్రీలు
[ 02-05-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. -
శిశువు అపహరణకు యత్నం
[ 02-05-2024]
కర్నూలు సర్వజన వైద్యశాలలోని గైనిక్ విభాగం నుంచి ప్రమీల అనే మహిళ బుధవారం రాత్రి 7 గంటలకు నవజాత శిశువును ఎత్తుకెళ్తూ సెక్యూరిటీ గార్డుకు పట్టుబడటం సంచలనంగా మారింది. -
హత్యాయత్నం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
[ 02-05-2024]
అనుమానంతో కట్టుకున్న భార్యను చంపేందుకు యత్నించిన నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన రాజుకు పదేళ్ల జైలుశిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ కర్నూలు అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు