నిర్లక్ష్యానికి శిలా సాక్ష్యాలు
వరద నీరు వృధా కాకుండా, కడప జిల్లాలో 91వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకై రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నదిపై 2.95టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మాణానికి 2008లో బీజం పడింది.
తండ్రి, తనయుడు !
2019లో శిలాఫలకం ప్రారంభిస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి (దాచినచిత్రం)
చాగలమర్రి, న్యూస్టుడే : వరద నీరు వృధా కాకుండా, కడప జిల్లాలో 91వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకై రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నదిపై 2.95టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మాణానికి 2008లో బీజం పడింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి రూ.291కోట్లతో 2008లో శంకుస్థాపన చేశారు. నాటి నుంచి పనులు ప్రారంభం కాలేదు. ఏడాదికేడాది ప్రతిపాదనలు పెరుగుతూ నేడు రూ.1357.1కోట్లుగా మారింది. 2019 డిసెంబరు 23న ముఖ్యమంత్రి జగన్ దువ్వూరు మండలంలోని నేలటూరు గ్రామంలో రాజోలి ఆనకట్ట నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఒకసారి తండ్రి, మరోసారి తనయుడు శంకుస్థాపనలు చేసి ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
గాలి కొదిలేశారు
గతేడాది జనవరిలో వంతెన పనుల శిలాఫలకంను ప్రారంభిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, పాల్గొన్న ఎమ్మెల్యేలు, కుడా చైర్మన్
కోడుమూరు గ్రామీణం, న్యూస్టుడే : హంద్రీ నదిపై నిర్మించే గోరంట్ల హైలెవల్ వంతెన రెండు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో అవసరమైనది. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో వంతెన సమస్య ఆయన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి అయిన వెంటనే నిర్మిస్తానని పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల ప్రజలకి హామీ ఇచ్చారు. 2023 జనవరిలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి రూ.21కోట్లతో శిలాఫలకం ప్రారంభించి పనులకు శ్రీకారం చుట్టారు. ఆరంభశూరత్వంగా ఐదారు నెలలు పనులు చేశారు. బిల్లులు సక్రమంగా రాకపోవడంతో పనులు ఆగిపోయాయి. దీంతో పలు గ్రామాల ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. విద్యార్థులు, రైతులు, గ్రామస్థులకు తిప్పలు తప్పటం లేదు.
పనులు మరిచారు
గంజహళ్లి గ్రామశివార్లో రూ.47 కోట్లతో వంతెన పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైకాపా అభ్యర్ధి బుట్టారేణుకా (పాతచిత్రం)
గోనెగండ్ల, న్యూస్టుడే : మండలంలో గాజులదిన్నేలో తెదేపా ప్రభుత్వ హయాంలో 11 గ్రామాలకు తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.13 కోట్లతో తాగునీటి పథకం పనులు చేపట్టారు. తిరిగి అవే పనులకు జలజీవన్ మిషన్, సీపీడబ్ల్యూ స్కీం కింద 14 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.19.50 కోట్లతో 13.3.2024లో వైకాపా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, బుట్టారేణుక పనులను ప్రారంభిస్తూ శంకుస్థాపన చేశారు. తాగునీటి పథకం వద్ద ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు.
గోనెగండ్ల మండలంలోని గంజహళ్లి గ్రామ శివారులో హంద్రీ నదిపై రూ.47 కోట్లతో చేపట్టే వంతెన నిర్మాణం కోసం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, బుట్టారేణుక 2024 మార్చి 12వ తేదీన భూమి పూజ చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ
[ 03-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చేరిన రోగులకు తిప్పలు తప్పడం లేదు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన సొమ్ము గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
జగన్ కుట్ర ఎండలో పండుటాకుల విలవిల
[ 03-05-2024]
నడవలేనివారు.. మంచానికే పరిమితమైనవారు.. దివ్యాంగులకు ఇంటివద్ద సొమ్ము పంపిణీ చేయాలని ఆదేశాలున్నా సుమారు 50 శాతం సచివాలయ సిబ్బంది గ్రామ, వార్డు సచివాలయాల్లో కూర్చొని పంపిణీ చేయడం గమనార్హం. -
ఉమ్మడి జిల్లా ఓటర్లు 34,48,38211
[ 03-05-2024]
ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు 34,48,382 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. అందులో పురుషులు 16,98,607, మహిళలు 17,49,199, ఇతరులు 576 మంది ఉన్నారు. -
విపణి వేదికపై విఫల పాలన
[ 03-05-2024]
అన్నదాతకు అండగా నిలిచి వారికి.. వారికి ఆర్థిక చేయూత ఇచ్చేందుకు మార్కెట్ యార్డులు ఏర్పాటు చేశారు. యార్డుల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. -
జగన్ పాలనలో రైతుల పరిస్థితి దారుణం
[ 03-05-2024]
తెదేపా ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో జనరంజకంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పేర్కొన్నారు. ఆలూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
ప్రచార భేరి
[ 03-05-2024]
ఆదోనిలోని 8, 9 వార్డుల్లో ఆదోని నియోజకవర్గ భాజపా అభ్యర్థి డా.పార్థసారథి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన బాధ్యుడు మల్లప్ప, తెదేపా, ఎమ్మార్పీఎస్, నాయకులు పాల్గొన్నారు. -
జగన్ ఆరాచకం.. తెలుగు గంగకు శోకం
[ 03-05-2024]
నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టుపై ప్రస్తుత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం రైతులకు శాపంగా పరిణమించింది. అయిదేళ్లలో జగనన్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎటువంటి శ్రద్ధ చూపకపోవడంతో తాగు, సాగునీటికి కష్టాలేర్పడ్డాయి. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 03-05-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. -
సైకో పార్టీకి డిపాజిట్ కూడా రాదు
[ 03-05-2024]
ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే ఈసారి సైకో పార్టీకి డిపాజిట్ కూడా రాదని అర్థమవుతోందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని ధ్వజమెత్తారు. -
స్వచ్ఛందంగా తెదేపాలోకి చేరికలు: బీసీ
[ 03-05-2024]
ప్రజలు అభివృద్ధిని కోరి స్వచ్ఛందంగా తెదేపాలోకి వస్తున్నారని తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సంజామల మండలం కానాలకు చెందిన 60 కుటుంబాలు, ఆకుమళ్లకు చెందిన మైనార్టీ నాయకులు పార్టీలో చేరారు. -
తెదేపాలో చేరిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
[ 03-05-2024]
నంద్యాలకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఐఎంఏ యాక్షన్ కమిటీ ఛైర్మన్ డా.గుర్రాల రవికృష్ణ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
కోట్ల, కేఈ కుటుంబాలతోనే అభివృద్ధి
[ 03-05-2024]
డోన్ నియోజకవర్గంలో కోట్ల, కేఈ కుటుంబాల పాలనలోనే అభివృద్ధి జరిగిందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పేర్కొన్నారు. -
5వ తేదీన నీట్
[ 03-05-2024]
వైద్య కళాశాలల్లో ప్రవేశాలకుగాను 5వ తేదీన ఎన్టీఏ ఆధ్వర్యంలో ‘నీట్’ నిర్వహించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?