మల్లన్న గడపన ‘కడప’ పెత్తనం
భక్తుల కొంగుబంగారమైన శ్రీశైల మల్లికార్జునుడి క్షేత్రం చెంత ఐదేళ్లుగా అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. జగన్ గద్దెనెక్కినప్పటి నుంచీ అక్రమాలు, ఆధిపత్య పోకడలు మిన్నంటాయి. భక్తుల సమస్యలు పట్టించుకోకుండా.. అధికార పార్టీ నేతలు, అధికారులు సొంత లాభాలు చూసుకున్నారు.
దేవాలయ వ్యవహారాల్లో జోక్యం
భక్తుల కొంగుబంగారమైన శ్రీశైల మల్లికార్జునుడి క్షేత్రం చెంత ఐదేళ్లుగా అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. జగన్ గద్దెనెక్కినప్పటి నుంచీ అక్రమాలు, ఆధిపత్య పోకడలు మిన్నంటాయి. భక్తుల సమస్యలు పట్టించుకోకుండా.. అధికార పార్టీ నేతలు, అధికారులు సొంత లాభాలు చూసుకున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో అవినీతి, అక్రమాలను పెంచి పోషించారు. భక్తుల సేవ ముసుగులో భారీగా లబ్ధి పొందారు. ఎక్కడి…కక్కడ దేవాలయ వ్యవహారాలను ఏదో ఒకవిధంగా వివాదాస్పదం చేసి భక్తజన విశ్వాసాలతో ఆడుకున్నారు. శ్రీశైలం క్యూకాంప్లెక్స్, సాలు మండపాల నిర్మాణానికి నిరుడు పిలిచిన టెండర్లను సకల శాఖల మంత్రిగా పేరొందిన జగన్ ప్రభుత్వ సలహాదారు రద్దు చేయించారు. రూ.110 కోట్ల విలువైన ఆ పనులు తనకు సన్నిహితులైన గుత్తేదారులకు దక్కే అవకాశం లేదన్న దుగ్ధతోనే ఆయన అందుకు తెగబడ్డారు.
శ్రీశైలం ఆలయం, న్యూస్టుడే
అస్మదీయుడికి ఆలయ బాధ్యతలు
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కడపలో వైకాపా నేతలకు అనుకూలంగా పని చేసిన అధికారి ఈవోగా వాలిపోయారు. కడప మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ ఎస్.లవన్నను 2021 ఆగస్టు 20న శ్రీశైల దేవస్థానం ఈవోగా ప్రభుత్వం నియమించింది. కడప, చిత్తూరు ప్రజాప్రతినిధుల అండదండలతో లవన్న రెండేళ్ల పాటు ఈవోగా పని చేశారు. ఆయన పాలనంతా ఆధిపత్యం, అక్రమాలతో చలామణి అయ్యారని బహిరంగ విమర్శలు ఉన్నాయి. బదిలీ అయినాసరే విధుల నుంచి రిలీవ్ కాకుండా, సీఎస్ ఉత్తర్వులను బేఖాతరు చేసి 20 రోజులు అదనంగా పని చేశారు. దేవస్థానానికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ఈవోగా నియమించాల్సి ఉండగా వైకాపా ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్కే పరిమితం చేసింది.
బదిలీలు, పదోన్నతుల జాతర
వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత దేవాదాయశాఖలో ఉద్యోగులను సాధారణ బదిలీలు చేశారు. శ్రీశైల దేవస్థానం నుంచి 50 మందికి పైగా స్థాన చలనం కలిగించారు. మూడు నెలలు గడవక ముందే ఉద్యోగులను డిప్యుటేషన్ పద్ధతిలో అధికార పార్టీ నేతలు సొంత గూటికి తీసుకొచ్చారు. ఎన్నికలు సమీపించే ముందు హడావుడిగా దేవాదాయశాఖ ఏసీ, డీసీలకు మంత్రి కొట్టు సత్యనారాయణ పదోన్నతి కల్పించారు. ఏసీ చంద్రశేఖర్రెడ్డి శ్రీశైలానికి బదిలీ అయినా విధుల్లో చేరలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ దేవస్థానానికి డిప్యూటీ కార్యనిర్వహణాకారిగా రమణమ్మను నియమించారు. డీఈవోను నియమించారు తప్ప ఆమె నిర్వర్తించాల్సిన విధులపై దేవాదాయశాఖ నుంచి స్పష్టత రాలేదు. దేవస్థానంలో శాశ్వత ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ దేవాదాయశాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు.
ధరలు పెంచి ఏటా రూ.5 కోట్ల దోపిడీ
పడితరం స్టోర్లో అక్రమాలు వెలుగు చూశాయి. అధిక ధరలు చెల్లించడంతో నెలకు రూ.42 లక్షలు సొమ్ము అదనంగా చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఏడాది కాలానికి రూ.5 కోట్లు గండి పడుతోంది. దేవస్థానం వందల క్వింటాళ్ల చొప్పున జీడిపప్పు కొనుగోలు చేస్తున్నందున మార్కెట్ ధరల కంటే ఎక్కువ మొత్తం చెల్లించారు. టెండర్ గడువు ముగిసిన తర్వాత సరకుల నాణ్యత పరీక్షించడానికి ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి కొట్టు సత్యనారాయణ, కమిషనర్ హామీలు అమలు కాలేదు. అదేవిధంగా శ్రీశైల దేవస్థానంలోని పడితరం విభాగంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.నిగ్గు తేల్చడానికి ఈఈ బాలమురళీకృష్ణను విచారణాధికారిగా నియమించి చేతులు దులిపేసుకున్నారు.
నెయ్యి కొనుగోలులోనూ వివాదమే
నంద్యాల పాల ఉత్పత్తుల సహకార సంస్థ విజయ డెయిరీ నుంచి కొన్నేళ్ల నుంచి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఈ నెయ్యి ద్వారా లడ్డూ ప్రసాదాలు తయారు చేసేవారు. వైకాపా పాలనలో విజయ డెయిరీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈవో లవన్న విజయ డెయిరీని కాదని నెల్లూరుకు చెందిన డెయిరీ ద్వారా నెయ్యి కొనుగోలు చేశారు. సదరు నెయ్యి నాణ్యతపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని క్యాన్లకు బ్యాచ్ నంబర్లు లేకుండా నెయ్యి సరఫరా కావడం అనుమానాలకు తావిచ్చింది.
క్యూలైన్లలో కష్టాలను పట్టించుకోలేదు
మూడేళ్ల నుంచి క్యూలైన్ల వద్ద భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈవోగా భరత్గుప్తా ఉన్నప్పుడు రూ.5 వేల గర్భాలయ అభిషేకం టికెట్ ప్రవేశపెట్టారు. ఈ టికెట్ తీసుకున్న భక్తులను గేట్ నం.2 (హరిహరరాయ గోపురం) నుంచి అనుమతించే వారు. లవన్న ఈవోగా వచ్చిన తర్వాత ఆ మార్గం నుంచి భక్తులను అనుమతించడం ఆపేశారు. రూ.5 వేలు, రూ.1500 అభిషేకం టికెట్లు తీసుకున్న వారిని డొనేషన్ కౌంటర్ నుంచి ఒకే క్యూలైన్ ద్వారా అనుమతించడం మొదలుపెట్టారు. వీఐపీ బ్రేక్ దర్శనం భక్తులను కూడా ఈ గేట్ నుంచే పంపించేవారు. ఈ విధానంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దర్శనానికి వచ్చిన దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను భక్తులు నిలదీసి క్యూలైన్ల నిర్వహణ అధ్వానంగా ఉందని మండిపడ్డారు.
సత్రాల్లో చొరబాట్లు
శ్రీశైల క్షేత్రంలో భక్తులకు సేవలు చేయడానికి వివిధ సంఘాలు ఆసక్తి చూపిస్తుంటాయి. సంఘాల తరఫున 50 సెంట్ల స్థలం మంజూరు చేయించుకొని భక్తులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించడంతో పాటు ధార్మిక చింతన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని తలపోస్తున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న వారికే సత్రాలు, ఆశ్రమాలకు స్థలాలు మంజూరు చేశారు. పెద్దల అండదండలు ఉన్న వారికి రింగ్రోడ్డు లోపల, అంతగా పలుకుబడి లేని వారికి బయట స్థలాలు కేటాయించారు. స్థలాల కేటాయింపులు, సత్రాల నిర్మాణాల్లో వైకాపా నేతలు చక్రం తిప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అహోబిలంలో ఘనంగా నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
[ 18-05-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వైశాఖమాస నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. -
నిలిచిన విద్యుత్తు సరఫరా
[ 18-05-2024]
వ్యవసాయం: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. -
వైభవంగా వాసవి దేవి జయంతి పూజలు
[ 18-05-2024]
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని నగరేశ్వర స్వామి ఆలయంలో వాసవి దేవి జయంతి పూజలు శనివారం వైభవంగా జరిగాయి. -
బ్యాంకు ఖాతా నుంచి రూ.5 లక్షలు చోరి
[ 18-05-2024]
మండలంలోని కొటేకల్కు చెందిన ఇబ్రహీం బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.5లక్షలు దొంగలించారు. -
శుకనంపై చిరుత దాడి
[ 18-05-2024]
సున్నిపెంటలోని వెస్ట్రన్ కాలనీలో ఓ ఇంటి ఆవరణలో పెంపుడు శునకంపై చిరుత పులి దాడి చేసి హతమార్చింది. -
ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (పీవో, ఏపీవో), ఇతర పోలింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన పారితోషికాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఉద్యోగులు మండిపడుతున్నారు. -
పత్తి విత్తనం.. నకిలీ పెత్తనం
[ 18-05-2024]
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది.. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. నేల బాగా నానడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. -
కాల్వల్లో మన్ను.. వీధుల్లో మడుగు
[ 18-05-2024]
పురపాలకాల్లో ఏటా ఇంటి పన్ను 15 శాతం పెంచుతున్నారు.. కుళాయి పన్ను చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తున్నారు.. వీధుల్లోకి వరద వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. -
అవసరం 46,98,726 వచ్చింది 5,40,752
[ 18-05-2024]
నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. -
అందని బియ్యం..పేదల ఆగ్రహం
[ 18-05-2024]
హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లిలో 17 రోజులైనా రేషన్ బియ్యం ఇవ్వలేదని గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. రామలింగ, శేఖర్, మంజు, మల్లమ్మ మాట్లాడుతూ 50 కుటుంబాలకు బియ్యం అందలేదన్నారు. -
ఇసుకను తోడేస్తున్నారా? ఫోన్ చేయండి
[ 18-05-2024]
తుంగభద్ర నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ‘‘మా రీచ్లపై కన్నేయండి’’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది.. గనులు, భూగర్భశాఖ అధికారులు స్పందించారు. -
రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు
[ 18-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్కుమార్ తెలిపారు. -
మోహినీ రూపంలో జ్వాలా నృసింహుడు
[ 18-05-2024]
అహోబిలం జ్వాలా నృసింహస్వామి మోహినీ అలంకృతులై భక్తులకు దర్శనమిచ్చారు. వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామికి మోహినీ అలంకారం చేశారు. -
చంద్రబాబును కలిసిన టీజీ భరత్
[ 18-05-2024]
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ శుక్రవారం హైదరాబాద్లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. -
అధునాతన సౌకర్యాలు.. ఆదర్శ ఫలితాలు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. -
శ్రీమఠంలో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి
[ 18-05-2024]
రాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్నూలు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్రెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం మంత్రాలయం వచ్చారు. -
పెద్దాస్పత్రిలో పిచ్చికుక్క స్వైరవిహారం
[ 18-05-2024]
కర్నూలు నగరంలోని సర్వజన వైద్యశాలలో పిచ్చికుక్క శుక్రవారం ఉదయం స్వైరవిహారం చేసింది. దీంతో రోగులు పరుగులు తీశారు. -
బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించండి
[ 18-05-2024]
రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ