‘స్మార్ట్’గా జగన్ బురిడీ
మధ్య తరగతి కుటుంబాల కోసం లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరలో లేఅవుట్లు తీసుకొస్తున్నాం.. ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసి సొంతింటి కలను సాకారం చేయబోతున్నాం.. అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.!
మధ్యతరగతికి సొంతిల్లంటూ వంచన
జగనన్న స్మార్ట్టౌన్షిప్లకు స్థల సేకరణ జరగని వైనం
న్యూస్టుడే, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు
‘‘మధ్య తరగతి కుటుంబాల కోసం లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరలో లేఅవుట్లు తీసుకొస్తున్నాం.. ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసి సొంతింటి కలను సాకారం చేయబోతున్నాం.. అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.!
2022 జనవరి 11న జగనన్న స్మార్ట్ టౌన్షిప్ వెబ్సైట్ ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలివి.’’
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది మధ్య తరగతి ప్రజలు జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలని దరఖాస్తు చేశారు. వారి కలలను కల్లలు చేశారు జగన్. అదిగో.. ఇదిగో అంటూ హడావుడి చేసి ఉసూరుమనిపించారు. ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డలో తప్ప మిగిలిన చోట్ల స్థలసేకరణే చేపట్టలేదు. ఎమ్మిగనూరు మండలం బనవాసి ఫారంలో 110.10 ఎకరాలు సేకరించారు. అక్కడ తారు, సిమెంట్ రోడ్డు కాదు కదా.. కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదు. మట్టిరోడ్డు వేసిన గుత్తేదారులకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో దరఖాస్తు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
కానరాని వసతులు
సాధారణంగా జగనన్న టౌన్షిప్లో 60 అడుగుల వెడల్పుతో తారు రోడ్డు, 40 అడుగుల వెడల్పుతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, నీళ్ల ట్యాంకులు, కుళాయిలు, పార్కులు ఏర్పాటు చేయాలి. బనవాసిలో రూ.58 కోట్లు, ఆళ్లగడ్డలోని టౌన్షిప్లో రూ.8.93 కోట్లతో సదుపాయాల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. టెండర్ల దాఖలుకు ఎవరూ రాలేదు. ‘ఆళ్లగడ్డ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ అభివృద్ధికి నిధులు రావాల్సి ఉంది. కుడా వారు మొదటి విడతగా రూ.8 లక్షలు విడుదల చేయాలి. ఈ డబ్బుతో భూమి చదును చేసి చెట్లు తొలగించాలి.
ఆళ్లగడ్డలో ఒక్కరూ ముందుకు రాలేదు
ఆళ్లగడ్డ స్మార్ట్ టౌన్షిప్నకు కేటాయించిన స్థలాన్ని అభివృద్ధి చేయలేదు. కనీసం ప్లాట్లుగా విభజించి హద్దులు కూడా ఏర్పాటు చేయలేదు. ఆళ్లగడ్డ పట్టణానికి కి.మీ. దూరంలో 14.93 ఎకరాల విస్తీర్ణంలో 154 ప్లాట్లను మూడు భాగాలుగా విభజించి టౌన్షిప్ ఏర్పాటు చేశారు. ఇక్కడ స్థలాల కొనుగోలుకు ఒక్కరూ ముందుకు రాలేదు. ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి ప్లాట్లుగా వేసిన అధికారులు ఇక్కడ సెంటు ధర రూ.3.36 లక్షలుగా నిర్ణయించారు. ఈ ధర ఎక్కువగా ఉందని జనం భావించడం, ఇదే ధరకు పట్టణంలోనే ఇళ్ల స్థలాలు లభ్యమవుతుండటంతో ఆసక్తి చూపలేదు.
ఆశలు కల్పించి... దరఖాస్తులు స్వీకరించి
కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో స్మార్ట్ టౌన్షిప్లలో స్థలాల కోసం 13 వేల మందికిపైగా మధ్య తరగతి ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 150, 250, 300 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రభుత్వం తెలియజేసింది. లేఅవుట్లలో రహదారులకు 30 శాతం, ఖాళీ స్థలాలకు 10 శాతం, మౌలిక వసతులకు ఐదు శాతం, ఆసుపత్రులు, కమ్యూనిటీ భవనాలకు ఒక శాతం చొప్పున స్థలాలు కేటాయిస్తామని గొప్పగా ప్రకటించింది. పాఠశాలలు, ఆసుపత్రులు, నిత్యావసరాలు, బ్యాంకులు, వార్డు సచివాలయం, అంగన్వాడీ కేంద్రాలు, పిల్లలకు ఆట స్థలాలు అందుబాటులో ఉంటాయని నమ్మించింది. వాటికితోడు వీధిదీపాలు, డ్రైనేజీ, విద్యుత్తు, సౌర దీపాలతో పాటు అన్ని వసతులు కల్పిస్తామని, ఉద్యానాలు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో చాలామందిలో ఆశలు చిగురించాయి. ఇంతవరకు స్థలాల సేకరణే జరగలేదు. ఈ పథకం ఉంటుందో లేదో తెలియడం లేదు.
బనవాసిలో బాలేదు
ఎమ్మిగనూరు మండలం బనవాసి ఫారంలో పశు సంవర్ధక శాఖకు చెందిన (సర్వే నంబర్లు 313పీ, 314, 324, 325, 326, 332 (పి), 342) 110.10 ఎకరాల భూమిని జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ కోసం కేటాయించారు. స్థలాన్ని 1,134 ప్లాట్లుగా విభజించారు. ఇందులో 60, 40 అడుగుల రహదారులు, పార్కులు, మైదానాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి 37 ఎకరాలు వినియోగించుకొనేలా ప్రణాళిక రూపొందించారు. స్మార్ట్ టౌన్షిప్లో మూడు సెంట్ల ప్లాట్లు 447, నాలుగు సెంట్లు 460, ఐదు సెంట్లు 199గా విభజించారు. ముందుగా 39 ఎకరాల్లో ముళ్లపొదలు, రాళ్లు తొలగించారు. మట్టి రోడ్లను వేసి వదిలేశారు. వీటికి రూ.22 లక్షల మేర ఖర్చు చేశారు. గుత్తేదారుకు ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. మిగిలిన 70 ఎకరాల్లో ముళ్ల పొదలు, రాళ్లు, గుంతలతో ఉంది. కాలనీలో బీటీ రోడ్లు 1,330 మీటర్లు, సీసీ రోడ్లు 10,300 మీటర్లు, డివైడర్లు 1,330 మీటర్లు, నడకదారులు 23 వేల మీటర్లు, కాల్వలు 23 వేల మీటర్లు, పైపులైన్లు 73 వేల మీటర్లు, యూజీడీ 11 కి.మీ. మేర పనులు చేపట్టాలి. వీటికి రూ.42 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు రూపొందించి టెండర్లు పిలిచారు. గుత్తేదారులు ఎవరూ రాకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు.
స్థలసేకరణ ఊసేదీ?
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది చోట్ల స్మార్ట్ టౌన్షిప్లకు సుమారు 500 ఎకరాల స్థలాన్ని సేకరించాల్సి ఉంది. కర్నూలు నగరపాలక సంస్థతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ పురపాలక సంఘాల శివారు ప్రాంతాల్లో అధికారులు భూముల్ని పరిశీలించారు. కొన్నింటిని గుర్తించిన అధికారులు సంబంధిత రైతులతో సమావేశాలు నిర్వహించారు. భూములు తీసుకుంటే తమ జీవనం ఎలా అని కొందరు రైతులు ప్రశ్నించడంతో అడుగులు ముందుకుపడలేదు. కర్నూలు, నంద్యాల వంటి పట్టణాల్లో ఎకరం ధర కనిష్ఠంగా రూ.5 కోట్ల వరకు ఉంది. ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ వంటి పట్టణాల్లో ఎకరం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు, మిగతా మున్సిపాల్టీలో రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ధరలు ఉన్నాయి. ఈ ధరలతో కొనుగోలు చేయడానికి ఏడాదిన్నరగా అధికారులు అన్ని ప్రయత్నాలు చేసి ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపించారు. పట్టణాలకు 5 కి.మీల దూరంలో స్థల సేకరణకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా, నంద్యాల, ఆత్మకూరు, డోన్, ఆదోనిలోని భూములపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడంతో అన్నీ తిరస్కరణకు గురయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శుకనంపై చిరుత దాడి
[ 18-05-2024]
సున్నిపెంటలోని వెస్ట్రన్ కాలనీలో ఓ ఇంటి ఆవరణలో పెంపుడు శునకంపై చిరుత పులి దాడి చేసి హతమార్చింది. -
ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (పీవో, ఏపీవో), ఇతర పోలింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన పారితోషికాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఉద్యోగులు మండిపడుతున్నారు. -
పత్తి విత్తనం.. నకిలీ పెత్తనం
[ 18-05-2024]
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది.. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. నేల బాగా నానడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. -
కాల్వల్లో మన్ను.. వీధుల్లో మడుగు
[ 18-05-2024]
పురపాలకాల్లో ఏటా ఇంటి పన్ను 15 శాతం పెంచుతున్నారు.. కుళాయి పన్ను చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తున్నారు.. వీధుల్లోకి వరద వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. -
అవసరం 46,98,726 వచ్చింది 5,40,752
[ 18-05-2024]
నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. -
అందని బియ్యం..పేదల ఆగ్రహం
[ 18-05-2024]
హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లిలో 17 రోజులైనా రేషన్ బియ్యం ఇవ్వలేదని గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. రామలింగ, శేఖర్, మంజు, మల్లమ్మ మాట్లాడుతూ 50 కుటుంబాలకు బియ్యం అందలేదన్నారు. -
ఇసుకను తోడేస్తున్నారా? ఫోన్ చేయండి
[ 18-05-2024]
తుంగభద్ర నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ‘‘మా రీచ్లపై కన్నేయండి’’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది.. గనులు, భూగర్భశాఖ అధికారులు స్పందించారు. -
రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు
[ 18-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్కుమార్ తెలిపారు. -
మోహినీ రూపంలో జ్వాలా నృసింహుడు
[ 18-05-2024]
అహోబిలం జ్వాలా నృసింహస్వామి మోహినీ అలంకృతులై భక్తులకు దర్శనమిచ్చారు. వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామికి మోహినీ అలంకారం చేశారు. -
చంద్రబాబును కలిసిన టీజీ భరత్
[ 18-05-2024]
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ శుక్రవారం హైదరాబాద్లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. -
అధునాతన సౌకర్యాలు.. ఆదర్శ ఫలితాలు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. -
శ్రీమఠంలో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి
[ 18-05-2024]
రాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్నూలు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్రెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం మంత్రాలయం వచ్చారు. -
పెద్దాస్పత్రిలో పిచ్చికుక్క స్వైరవిహారం
[ 18-05-2024]
కర్నూలు నగరంలోని సర్వజన వైద్యశాలలో పిచ్చికుక్క శుక్రవారం ఉదయం స్వైరవిహారం చేసింది. దీంతో రోగులు పరుగులు తీశారు. -
బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించండి
[ 18-05-2024]
రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
-
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి