logo

జగన్‌ పాలనలో అన్ని రంగాలు నాశనం

వైకాపా ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేసిందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, నంద్యాల తెదేపా జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు

Published : 10 May 2024 02:50 IST

మాట్లాడుతున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి
ఓర్వకల్లు, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేసిందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, నంద్యాల తెదేపా జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు. మండలంలోని హుసేనాపురంలో వారు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ఐదేళ్లుగా రాష్ట్రంలో రౌడీలు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. తెదేపా అధికారంలోకి వస్తే తప్ప ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యం కాదన్నారు. తెదేపా నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డికి ఓట్లేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్ర పెద్దస్వామి, మహబూబ్‌బాషా, బజారి, జయక్రిష్ణ, రామగోవిందు, సుధాకర్‌, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు