అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామి
దేశంలో అభివృద్ధిలో తెలంగాణ పరుగులు పెడుతూ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జడ్పీ మైదానం
ఫ్రీడం రన్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్గౌడ్
ఫ్రీడమ్ రన్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తదితరులు
మహబూబ్నగర్ క్రీడలు, న్యూస్టుడే : దేశంలో అభివృద్ధిలో తెలంగాణ పరుగులు పెడుతూ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జడ్పీ మైదానం నుంచి బీఈడీ కళాశాల మైదానం వరకు వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, క్రీడాకారులు, యవతీ యువకులు, పోలీసు సిబ్బందితో నిర్వహించిన ‘ఫ్రీడం రన్’ను మంత్రి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు తేజస్ నంద్లాల్ పవర్, సీతారామారావు, అదనపు ఎస్పీ రాములు తదితరులతో కలిసి జాతీయ జెండా పట్టుకొని ముందు పరిగెత్తారు. ఉత్సాహంగా సాగిన పరుగు నేతాజీ కూడలి, న్యూటన్, జనరల్ ఆస్పత్రి, మెట్టుగడ్డ మీదుగా బీఈడీ కళాశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ ఫలాలు ఎందరో మహనీయుల త్యాగఫలమని గుర్తుచేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. కామన్వెల్త్ క్రీడా పోటీల్లో దేశం సాధించిన పతకాల పరంగా చూస్తే తెలంగాణ క్రీడాకారులు రెండో స్థానంలో నిలవటం క్రీడల మంత్రిగా గర్వంగా ఉందన్నారు. సమాజంలో అసమానతలు, కులమత భేదాలు పూర్తిగా తొలగిపోయి మనుషులంతా ఒకటేనన్న భావన రావాలని, అప్పుడే జాతి సమైక్యత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పుర ఛైర్మన్ కేసీ నర్సింహులు, ముడా ఛైర్మన్ గంజి వెంకన్న, పుర వైస్ ఛైర్మన్ గణేశ్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం