పట్టాలెక్కని పర్యాటకం
పాలమూరులో పర్యాటకం పట్టాలు ఎక్కడం లేదు. ఉమ్మడి జిల్లాలో 34 ప్రాంతాలు పర్యాటకానికి అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ గుర్తించింది. నల్లమల్ల, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, చారిత్రక, వారసత్వ సంపద, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవుగా ఉన్న పాలమూరును పర్యాటక సమూహంగా
వసతులు లేక ముందుకెళ్లని ప్రణాళికలు
నేడు ప్రపంచ టూరిజం దినోత్సవం
- ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్
నల్లమల్లలో పర్యాటకుల మనసు దోచే ఆక్టోపస్ వ్యూ పాయింట్
పాలమూరులో పర్యాటకం పట్టాలు ఎక్కడం లేదు. ఉమ్మడి జిల్లాలో 34 ప్రాంతాలు పర్యాటకానికి అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ గుర్తించింది. నల్లమల్ల, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, చారిత్రక, వారసత్వ సంపద, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవుగా ఉన్న పాలమూరును పర్యాటక సమూహంగా ఏర్పాటుచేయాలని 2019లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో ఎకో, రివర్, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని, ఇందుకు ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తామని ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చకపోవటంతో నిరాశే మిగిలింది. మహబూబ్నగర్లో మాత్రం కొన్ని అడుగులు పడ్డాయి. రూ. 8 కోట్లతో మినీ శిల్పారామాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంకుబండ్ అభివృద్ధిలో భాగంగా మినీ ఐల్యాండ్, తీగల వంతెన ఏర్పాటు చేస్తున్నారు.
నల్లమలలో నత్తనడక..
నల్లమల్ల ప్రాంతంలో ఎకో, రివర్ టూరిజం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. సోమశిల నుంచి ఈగలపెంట వరకు(శ్రీశైలానికి) కృష్ణానదిలో లాంచీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసింది. మధ్యలో అక్క మహాదేవి గుహలు, అక్టోపస్ వంటి ప్రాంతాలను చూసేలా, తర్వాత శ్రీశైలంలో మల్లికార్జునస్వామి దర్శనం, వసతికి ప్రణాళిక ఏర్పాటు చేశారు. సోమశిల వద్ద రూ. 2 కోట్లతో ఏర్పాటు చేసిన ఆధునాత లాంచీని గతేడాది ఐదారు ట్రిప్పులకే పరిమితమైంది. ఎకో టూరిజం అభివృద్ధికి నల్లమల్లలో రూ. 91.62 కోట్లతో పనులు పూర్తయినా ప్రచారం లేక పర్యటకులు అనుకున్న స్థాయిలో రావడం లేదు. మహబూబ్నగర్ సమీపంలోని మయూరి పార్కు ఎకో టూరిజంకు అనుకూలంగా ఉంటుందని గతేడాది గుర్తించారు. ఆ దిశగా పర్యాటలకు కావాల్సిన ప్రత్యేక ఏర్పాట్లు మాత్రం ఇంకా చేయలేదు. 700 ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రి సంరక్షణకు చర్యలు చేపట్టినా అక్కడ సౌకర్యాలు లేవు. కోయిల్కొండ కోట, జడ్చర్ల మండలంలోని గొల్లత్తగుడి నిర్లక్ష్యం నీడలోనే మగ్గుతున్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఆలయాల అనుసంధానమేదీ?
ఉమ్మడి జిల్లాలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అలంపూర్, జమ్మిచేడు, మల్దకల్, బీచుపల్లి, శ్రీరంగాపూర్, సోమశిల, ఉమామహేశ్వరం, సలేశ్వరం, సింగోటం, గంగాపురం, మన్యంకొండ, శ్రీకురుమూర్తి ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సమూహాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళికలు రూపుదిద్దుకోలేదు.
అనుకున్నట్లు అమలైతే : ఎకో, రివర్, టెంపుల్ టూరిజం సమూహాల ఏర్పాటు అనుకున్నట్లు జరిగితే పాలమూరు పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. మౌలిక వసతులు కల్పించి ప్రణాళికలు అభివృద్ధి చేస్తే రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు పాలమూరు బాటపడతారు. అయిదు జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాలను రెండు రోజుల్లో సందర్శించేలా బస్సు, వసతి, భోజనం సదుపాయాలను పర్యటక శాఖనే కల్పించి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాల్సి ఉంది. వీరికి గైడ్ను కూడా నియమించాలి. ఉపాధి అవకాశాలు, వ్యాపారం వృద్ధి చెందుతాయి.
అభివృద్ధి చేస్తున్నాం..
పాలమూరులో ఎకో, రివర్, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నాం. సోమశిల నుంచి శ్రీశైలంకు ఏర్పాటు చేసిన లాంచీని పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తీసుకొస్తాం. దేవాలయాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాం. దేవాలయాల్లో వసతుల కల్పనకూ చర్యలు చేపడతాం.
- మనోహర్, ఎండీ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్