శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
శ్రీశైలమహాక్షేత్రంలో ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా, దేవస్థానం అధికారులను నంద్యాల కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు.
సమావేశంలో నంద్యాల కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, ఎస్పీ రఘువీర్రెడ్డి,
ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్.లవన్న
శ్రీశైలం ఆలయం, న్యూస్టుడే : శ్రీశైలమహాక్షేత్రంలో ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా, దేవస్థానం అధికారులను నంద్యాల కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు. మంగళవారం సీసీ కంట్రోల్రూంలో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్తోపాటు ఎస్పీ రఘువీర్రెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్.లవన్న, నంద్యాల, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూలు అధికారులు, దేవస్థానం అధికారులతో సమావేశమయ్యారు. ఏర్పాట్లపై మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. శ్రీశైల క్షేత్రాన్ని 10 జోన్లుగా, 40 సెక్టార్లుగా విభజించి జిల్లాస్థాయి అధికారులను ఇన్ఛార్జిలుగా నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. పార్కింగ్ ప్రదేశాల్లో దాదాపు 3 వేల వాహనాలు నిలపడానికి అవకాశం ఉందన్నారు.ఈవో మాట్లాడుతూ.. భక్తులకు సులభంగా స్వామివారి దర్శనమయ్యేలా నాలుగు రకాల క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు. 30 లక్షల లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందిస్తామన్నారు.
శాఖలవారీగా ఆదేశాలు..: ఆంధ్రప్రదేశ్ నుంచి 650, తెలంగాణ రాష్ట్రం నుంచి 180 బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఆర్ఎంను కలెక్టర్ ఆదేశించారు.
* దేవస్థానం గదులు, ప్రైవేటు సత్రాల్లో 35 శాతం గదులను స్వాధీనం చేసుకోవాలని ఆత్మకూరు డీఆర్వోను ఆదేశించారు.
* పారిశుద్ధ్య లోపం లేకుండా అవసరమైన సిబ్బందిని కేటాయించుకొని దేవస్థానం పారిశుద్ధ్య సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని డీపీవోనుఆదేశించారు.
* తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రదేశాలను గుర్తించి ట్యాంకర్లు, కుళాయిలు ఏర్పాటుచేయాలన్నారు.
* కల్తీ ఆహారపదార్థాలు నియంత్రించేందుకు లేబర్ కమిషనర్, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లను బృందాలుగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
* రద్దీ ప్రాంతాల్లో ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, వైద్యనిపుణులు, మందులను సిద్ధం చేసుకోవాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. శ్రీశైలంలోని పీహెచ్సీ, దేవస్థానం ఆసుపత్రి, సున్నిపెంటలోని వైద్యశాల, శ్రీశైలంలో ఏర్పాటు చేసే తాత్కాలిక 30 పడకల ఆసుపత్రి 24 గంటలు నిర్వహించేలా వైద్య సిబ్బందిని కేటాయించాలన్నారు. ఏడు అంబులెన్స్లు, పాదయాత్ర మార్గంలో ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేయాలన్నారు.
* పాతాళగంగ, లింగాలగట్టు ప్రాంతాల్లో పుణ్యస్నానాలు చేసేందుకు అనుమతిస్తున్నామని, 240 మంది గజఈతగాళ్లు, అవసరమైన లైఫ్ జాకెట్లు, పుట్టీలు, తాత్కాలిక మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ డీడీని ఆదేశించారు.
* 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో దాదాపు 8 లక్షల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున మొబైల్ నెట్వర్క్ సరిపోయే విధంగా బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో, ఐడియా సంస్థలతో మైక్రోటవర్లను ఏర్పాటు చేయాలని ఈవోకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం