ఆస్పత్రిలో వాహనాల రద్దీ
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చే వాహనాలు రోడ్డుపైనే ఇష్టానుసారం నిలిపేస్తున్నారు.
రాకపోకలకు తీవ్ర అంతరాయం
న్యూస్టుడే, మహబూబ్నగర్ నేరవిభాగం
కొవిడ్ చికిత్స భవనం వద్ద అడ్డంగా నిలిపిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చే వాహనాలు రోడ్డుపైనే ఇష్టానుసారం నిలిపేస్తున్నారు. దీంతో అత్యవసర సేవల కోసం వాహనాల ద్వారా వచ్చే రోగులు ఆస్పత్రిలోకి వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. విశాలమైన ప్రాంగణం ఉన్నా అక్కడ వరస క్రమంలో నిలుపుకోకుండా రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలుపుతుండటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఆసుపత్రికి నిత్యం 2 వేలకు పైగా వాహనాల్లో వివిధ రకాల వైద్య సేవల కోసం రోగులు వస్తున్నారు. ఎలాంటి వాహనాలు లేని వారు ఆటోల్లో వస్తుండటంతో వాటి సంఖ్య కూడా ఎక్కువ అయ్యాయి. రోగులను తీసుకొచ్చిన ఆటోలు వెళ్లే˜్లటప్పుడు కూడా కిరాయి కోసం వేచి చూస్తుండటంతో ఆస్పత్రి పరిసరాల్లో రద్దీ పెరుగుతుంది. ద్విచక్ర వాహనాలు ఎక్కడ పడితే అక్కడే ఆపేసి ఆస్పత్రి లోపలికి వెళ్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.
అక్కడ రద్దీ ఎక్కువ .. : ఆస్పత్రిలో మాతా శిశు భవనం వద్ద ఆటోల రద్దీ ఎక్కువగా ఉంటోంది. గర్భిణులు, బాలింతలు వారి సహాయకుల రాకపోకలతో ఇక్కడ నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. రోగులను ఇక్కడ దించిన తర్వాత రహదారికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేయడం లేదు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి అత్యవసర సేవల కోసం వచ్చే అంబులెన్స్లకు ఒక్కోసారి దారి ఉండటం లేదు. రోజు సుమారు 150-200 ఆటోలు, 2 వేల వరకు ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన బస్సులు, వైద్యులు, ఉద్యోగులకు చెందిన కార్లు, ఆయా ఠాణాలో నమోదైన కేసుల కోసం వచ్చే పోలీసుల వాహనాలు, అంబులెన్స్లు, మందులను సరఫరా చేసే లారీలు, డీసీఎంలు, ఇతర వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి అక్కడే వాహనాలు నిలిపేలా చర్యలు తీసుకుంటే ట్రాఫిక్ సమస్య నివారించవచ్చు.
* వాహనాలను సక్రమంగా నిలపడానికి చర్యలు తీసుకోవాలని గుత్తేదారుకి సూచించాం. నేను కూడా పరిస్థితిని పరిశీలిస్తాను. దవాఖానా ప్రాంగణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా నివారించడానికి కృషి చేస్తాను.
-డా.రాంకిషన్, సూపరింటెండెంట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్