సమన్వయం.. గ్రామీణ విద్యార్థులకు వరం
డిగ్రీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి కళాశాల విద్యాశాఖ నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. కళాశాలల మధ్య సమన్వయం చేసుకోవడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది.
న్యూస్టుడే, మహబూబ్నగర్ విద్యావిభాగం
ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాఠం వింటున్న విద్యార్థులు
డిగ్రీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి కళాశాల విద్యాశాఖ నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. కళాశాలల మధ్య సమన్వయం చేసుకోవడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తుండగా.. ఉమ్మడి జిల్లాలో అనుకున్న స్థాయిలో అడుగులు పడటం లేదు. పీయూ పరిధిలో ఉమ్మడి జిల్లాలోని 20 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఐదు క్లస్టర్లుగా గుర్తించింది. అధ్యాపకుల సేవలు, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, వసతులను సద్వినియోగం చేయడం, ఇతర కళాశాలలు వాటిని వినియోగించుకోవడానికి వీలుగా ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన బోధన అంశాల్లో కళాశాలల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణికి తెరతీసింది. ఆధునిక సాంకేతిక వనరులు లేని కళాశాలలు క్లస్టర్ సేవలను వినియోగిస్తూ తమ విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఈ విధానంతో వీలుపడుతుంది.
విద్యార్థులకు ప్రయోజనం.. : డిగ్రీతో పాటే ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఈ విధానం ఉపయుక్తం. పరిశోధనల ఆవిష్కరణలు, అధ్యాపకులు, విద్యార్థుల కోసం క్లస్టర్ కళాశాలల్లో ప్రయోగాత్మకంగా పరిశోధన కేంద్రాలు నెలకొల్పి ప్రాంగణ నియామకాలు, శిక్షణ కార్యక్రమాలన్నింటినీ ఒక యూనిట్గా భావించి అమలు చేస్తారు. పట్టణ విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్ని వనరులు సమకూరుతాయి. ప్రథమ నుంచి తృతీయ సంవత్సరం వరకు ప్రణాళికతో బోధన, ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ, రెగ్యులర్ కోర్సులతో పాటు ఉపయుక్తమైన సర్టిఫికెట్ కోర్సులూ నిర్వహిస్తారు. చదువులు పూర్తయిన తర్వాత విద్యార్థులకున్న నైపుణ్యాలతో కొలువు సాధనే లక్ష్యంగా సన్నద్ధం చేస్తారు. టాస్క్ తెలంగాణ సాఫ్ట్ స్కిల్ కేంద్రాల ద్వారా శిక్షణ అందించి ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించడంలో తోడ్పాటునందిస్తారు.
వర్చువల్ పద్ధతిలో తరగతులు.. : కళాశాలల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి వల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఆధునిక సౌకర్యాలతో ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఇతర వనరులున్న కళాశాలల్లో చదివే వారికి ఆ వనరుల ద్వారా ఉత్తమ బోధన లభిస్తుంది. కానీ అవిలేని విద్యార్థులకు ఉన్నత బోధన దూరమవుతోంది. పరస్పర సహకారంతో విద్యాపరమైన మౌలిక వనరులను పంచుకోవడం వల్ల సమానమైన విద్య అందడంతో పాటు విద్యార్థులందరికీ మేలు చేకూరనుంది. క్లస్టర్ పరిధిలో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించడం వల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయి. ప్రత్యేకంగా సైన్స్, మ్యాథ్స్, కామర్స్, పొలిటికల్, ఇతర కోర్సుల్లో నిపుణులైన అధ్యాపకులతో వర్చువల్ పద్ధతిలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులతో పాటు వివిధ రకాలైన సబ్జెక్టులపై విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతారు. అకాడమిక్ అంశాలకు సంబంధించి ఆన్లైన్ లెక్చర్లు, వీడియోలు, లెర్నింగ్ మెటీరియల్లు, ఎల్ఎంఎస్ (లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్)లలోనూ ఇచ్చి పుచ్చుకోవచ్చు. అధ్యాపకుల శిక్షణ, ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు.
క్లస్టర్ వారీగా కళాశాలలు : మహబూబ్నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల క్లస్టర్ పరిధిలో ఆర్ట్స్, కామర్స్ కళాశాల, సైన్స్ కళాశాల నాగర్కర్నూల్, కొల్లాపూర్, కొడంగల్ డిగ్రీ కళాశాలలు ఉండగా, మహబూబ్నగర్ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల క్లస్టర్లో కొండనాగుల (నాగర్కర్నూల్), కల్వకుర్తి, నారాయణపేట కళాశాలలు ఉన్నాయి. జడ్చర్ల బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల క్లస్టర్లో పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (నాగర్కర్నూల్), షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వనపర్తి క్లస్టర్ పరిధిలో మహిళా డిగ్రీ కళాశాల వనపర్తి, ఆత్మకూర్, పెబ్బేరు, అమ్రాబాద్ కళాశాలలు ఉన్నాయి. గద్వాల ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లస్టర్లో శాంతినగర్, గద్వాల మహిళా డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
సద్వినియోగం చేసుకుంటే మేలు : క్లస్టర్ విధానంతో విద్యా నైపుణ్యాలు పెంపొందుతాయి. పరిశోధన, విస్తరణ, శాస్త్ర సాంకేతిక అంశాలపై సదస్సులు నిర్వహించడంతో విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. కళాశాలలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే మేలు జరుగుతుంది.
డా.పద్మావతి, ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, మహబూబ్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం