స్టాంపుల విక్రయాల్లో అక్రమాలకు చెక్
స్టాంపుల విక్రయాల్లో అక్రమాలకు చెక్ పడనుంది. బహిరంగ మార్కెట్లో స్టాంపు వెండర్లు ఇక నుంచి మాన్యువల్గా అమ్మడానికి వీలు లేదు.
అంతర్జాలంలో వివరాలను నమోదు చేసుకున్న స్టాంపు వెండర్లు
పాలమూరు, న్యూస్టుడే: స్టాంపుల విక్రయాల్లో అక్రమాలకు చెక్ పడనుంది. బహిరంగ మార్కెట్లో స్టాంపు వెండర్లు ఇక నుంచి మాన్యువల్గా అమ్మడానికి వీలు లేదు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ 15 రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి అంతర్జాలంలో వివరాలను నమోదు చేసిన తర్వాతే వాటిని విక్రయించాల్సి ఉంటుంది. గతంలో పలు రకాల అక్రమాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో పాత విధానానికి స్వస్థి పలికి నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి 301 మంది స్టాంపు వెండర్లకు అనుమతి ఇచ్చింది. అంతర్జాలం ద్వారా స్టాంపులను, బాండ్లను విక్రయించడానికి ముందస్తుగా జిల్లా రిజిస్ట్రార్ నుంచి అనుమతి తీసుకోవాలి. అందుకోసం వాళ్లు అన్ని వివరాలతో అంతర్జాలంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు 200 మంది స్టాంపు వెండర్లు మాత్రమే దరఖాస్తులు పంపించారు. వీరిలో 130 మందికి అనుమతించగా, మరో 70 మంది వివరాల నమోదులో తప్పుగా ఉండటంతో వారి దరఖాస్తులను తిరస్కరించారు.
పాత తేదీలు వేసి మోసాలు..: స్టాంపులను మాన్యువల్గా విక్రయించే సమయంలో పలువురు పాత తేదీలు వేసి అక్రమాలకు పాల్పడేవారు. ఈ రోజు కొన్న స్టాంపు పేపర్పై పాత తేదీ వేసుకొని సెటిల్మెంట్ల కోసం అగ్రిమెంట్లు రాసుకున్నట్లుగా చేసుకునేవారు. వ్యవసాయ భూములు, స్థిరాస్తి వ్యాపార కార్యకలాపాలలో తలదూర్చి తామే ముందుగా ఒప్పందాలు చేసుకున్నట్లు చేసేవారు. వీలునామాలు, ఇతర వ్యవహారాలు కూడా నడిచేవి. ఈ మోసాలను నియంత్రించడానికే ప్రభుత్వం ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఉమ్మడి జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో 80 మంది, నాగర్కర్నూల్-85, వనపర్తి-56, జోగులాంబ గద్వాల-62, నారాయణపేట-18 మంది చొప్పున స్టాంపు వెండర్లు ఉన్నారు. వీరందరికీ పంపిణీ చేసే స్టాంపులు, బాండ్లపై ఉన్న నంబర్ల వివరాలను అంతర్జాలంలో నమోదు చేసి రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే వినియోగదారులకు విక్రయించాలి. వినియోగదారులకు విక్రయించేటప్పుడు అన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
మహబూబ్నగర్ కార్యాలయంలో అంతర్జాలం ద్వారా స్టాంపు బాండ్లను విక్రయిస్తున్న సిబ్బంది
* ఈ నూతన విధానం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రతి స్టాంపు వెండర్ తప్పనిసరిగా కంప్యూటర్తోపాటు, అంతర్జాల సదుపాయం కలిగి ఉండాలి. అంతర్జాలంలో వివరాలను నమోదు చేయకుండా వినియోగదారులకు స్టాంపులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
రవీందర్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?