అభివృద్ధిలో జిల్లాను అగ్రపథాన నిలుపుదాం
వనపర్తి జిల్లాను అభివృద్ధి పరంగా అగ్రపథాన నిలిపేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేసి సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు.
జిల్లా ప్రగతిని వివరిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి, న్యూస్టుడే : వనపర్తి జిల్లాను అభివృద్ధి పరంగా అగ్రపథాన నిలిపేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేసి సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు. జిల్లా సమీకృత కార్యాలయ భవన సముదాయం వద్ద మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్పీ కె.రక్షిత మూర్తి, జడ్పీ ఛైర్మన్ లోక్నాథ్రెడ్డి, ఏఎస్పీ షాకీర్ హుసేన్, పుర అధ్యక్ష, ఉపాధ్యక్షులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్ తదితరులు జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రగతిపై ఆయన చెప్పిన వివరాలు ఇలా..
పెరిగిన వ్యవసాయం : జిల్లాలో 2022-23లో సాగునీటి వనరులు, పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావం మొదట్లో వానాకాలంలో వివిధ రకాల పంటలు 1,95,872 ఎకరాల్లో సాగు చేస్తుండగా.. ఇప్పుడు 2,61,284 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. సాగునీరు 1,72,005 ఎకరాలకు ఒకపంటకు మాత్రమే అందేది. ఇప్పుడు వానాకాలం, యాసంగి పంటలకు కలిపి 4,44,811 ఎకరాలకు నీరందిస్తున్నాం. సాగునీటి వనరుల్లో 158.60 శాతం వృద్ధి జరిగింది. జిల్లాలో మిషన్ కాకతీయ కింద 911 చెరువుల పునరుద్ధరణ, కాల్వల మరమ్మతులు, నిర్మాణాలకు రూ.136.28 కోట్లు ఖర్చు చేశాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా రూ.700 కోట్లతో ఏదుల జలాశయం నిర్మించాం. రూ.205 కోట్లతో నిర్వాసితులకు పునరావాస గ్రామాలను నిర్మించాం. కేఎల్ఐ కింద 1,17,835 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు 2014 నుంచి ఇప్పటి వరకు రూ.148.21 కోట్లు ఖర్చు చేశాం. జూరాల ఎడమ కాల్వ మరమ్మతులు, నిర్వహణ కు రూ.27.83 కోట్లు ఖర్చు చేశాం.
నాణ్యమైన విద్యుత్తు సరఫరా..: జిల్లాలో పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. అందుకోసం 33/11 కేవీ ఉపకేంద్రాలు 12 నిర్మించాం, 11 నిర్మాణంలో ఉన్నాయి. మరో 13 ఉప కేంద్రాలు ఆదిత్య పథకంలో మంజూరు అయ్యాయి. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు కలిపి రూ.కోటితో గోదాము నిర్మించాం. మత్స్యశాఖలో నీలి విప్లవం తీసుకొచ్చాం. జిల్లాలో 38 మంది మత్స్యకారులకు చెరువుల నిర్మాణం కోసం రూ.1.85 కోట్ల రాయితీ ఇచ్చాం. రాష్ట్రంలో తొలి మత్స్య కళాశాలను పెబ్బేరులో ప్రారంభించాం.
వనపర్తిలో 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ వైద్య కళాశాల, అనుబంధంగా రూ.38.40 కోట్లతో నర్సింగ్ కళాశాలను నిర్మించామన్నారు. స్వరాష్ట్రం వచ్చాక శ్రీరంగాపూరు, వెల్టూరు, అమరచింతలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఏదుల, కర్నెతండా, చిన్నంబావి, కేతెపల్లిలో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. వయోవృద్ధుల సంరక్షణకు హెల్త్కేర్ కేంద్రాన్ని ప్రారంభించాం.
మిషన్ భగీరథ అద్భుతం..: ఇంటింటికి శుద్ధజలం అందించడానికి మిషన్ భగీరథ పథకం చేపట్టాం. జిల్లాకు రూ.260.50 కోట్లు మంజూరు కాగా.. రూ.206 కోట్ల వ్యయంతో 984.9 కి.మీ. పైపులైన్లు వేశాం. ఆరు ఉపరితల, రెండు భూగర్భ జల భాండాగారాలు, 16 సంపుల నిర్మాణం పూర్తి చేశాం. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన రూ.310.99 కోట్లకు గాను రూ.238.61 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేశాం.
* పురపాలక, పౌర సరఫరాలు, ఉద్యానం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిట© సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖలు, జిల్లా పరిషత్తులో సాధించిన ప్రగతిని మంత్రి నివేదికలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను సన్మానించారు.
స్వాతంత్య్ర సమరయోధుడు వేణాచారి కుటుంబ సభ్యురాలిని సన్మానిస్తున్న మంత్రి, కలెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం