కళతప్పిన ప్రకృతి సోయగం..అటకెక్కిన పర్యాటకం!
ఎటుచూసినా పచ్చదనం.. అందమైన గుట్టలు.. పక్షుల కిలకిలరావాలు.. ఇలా ఆహ్లాదాన్ని పంచింది ఆ కేంద్ర నర్సరీ. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఒకప్పుడు కళకళలాడిన నార్సింగి మండలం వల్లూరులోని కేంద్ర నర్సరీ అధ్వానంగా మారింది. 16 ఏళ్ల కిందటి వరకు నిత్యం విద్యార్థులు, అధికారులు ఇక్కడికి వచ్చేవారు.
వల్లూరు కేంద్ర నర్సరీ తీరు
న్యూస్టుడే, నార్సింగి (చేగుంట)
నర్సరీ ప్రధాన ద్వారం
ఎటుచూసినా పచ్చదనం.. అందమైన గుట్టలు.. పక్షుల కిలకిలరావాలు.. ఇలా ఆహ్లాదాన్ని పంచింది ఆ కేంద్ర నర్సరీ. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఒకప్పుడు కళకళలాడిన నార్సింగి మండలం వల్లూరులోని కేంద్ర నర్సరీ అధ్వానంగా మారింది. 16 ఏళ్ల కిందటి వరకు నిత్యం విద్యార్థులు, అధికారులు ఇక్కడికి వచ్చేవారు. అప్పట్లో రూ.6 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా నిర్వహణ లోపించి రూపుకోల్పోయింది. వల్లూరు మీదుగా వెళ్లే జాతీయ రహదారి పక్కనే 2001లో కేంద్ర నర్సరీని ఏర్పాటు చేశారు. మొక్కలు పెంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడంతో పాటు ఈ ప్రాంతానికి పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సకల హంగులతో తీర్చిదిద్దారు. దీంతో ఇక ఆదివారం, సెలవు దినాల్లో సందడే కనిపించేది. ఇక్కడ చెక్డ్యాంలు, నీటి కొలను నిర్మించారు. జింకలు, కొండగొర్రెలు, కుందేళ్లు, నెమళ్లు ఇతరత్రా జీవాలకు ఆవాసం కల్పించారు. 35 రకాల వివిధ ఔషధ మొక్కలను పెంచి వివిధ ప్రాంతాలకు తరలించేవారు. సమావేశం మందిరం నిర్మించారు. సౌకర్యాలు కల్పించడంతో నిత్యం పర్యాటకుల సందడి నెలకొనేది. క్రమేణా పర్యవేక్షణ తగ్గడంతో పచ్చదనం కాస్త మాయమైంది. అప్పుడప్పుడు కేంద్ర అటవీ అధికారులు సందర్శించి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పడమే తప్ప ఒక్క అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం..
- రవిప్రసాద్, డీఎఫ్వో, మెదక్
వల్లూరు నర్సరీలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. అర్బన్ పార్కు తరహాలో అభివృద్ధి చేసేలా చొరవ చూపుతాం. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం. నిధులు మంజూరవగానే రూపురేఖలు మారుస్తాం.
తర్ఫీదు బంద్..
నర్సరీలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలతో పాటు దూలపల్లి అటవీ అకాడమీకి చెందిన ఐఎఫ్ఎస్ అధికారులు, శిక్షణలో ఉండే ఎఫ్ఆర్వోలు, బీట్ అధికారులు వీఎస్ఎస్ సిబ్బందికి ఇక్కడ తర్ఫీదు ఇస్తుండేవారు. ఆ ప్రక్రియ బంద్ అయింది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు బొటానికల్ టూర్లో భాగంగా ఇక్కడికి వస్తుండేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది.
మొక్కల పెంపకానికి మాత్రమే..
ప్రస్తుతం నర్సరీలో 25 రకాల మొక్కలను పెంచుతున్నారు. ఇందుకు రూ.10 లక్షలు వెచ్చిస్తున్నారు. జిల్లాతో పాటు నిజామాబాద్, కామరెడ్డి, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి ఆదిలాబాద్, కరీంనగర్ అటవీ ప్రాంతాలకు వాటిని పంపిస్తున్నారు. మొక్కల పెంపకంలో వివిధ రకాల పద్ధతులు పాటిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం ఆదర్శంగా ఉండగా.. పర్యాటకాన్ని మాత్రం గాలికొదిలేశారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వెళ్లే మార్గంలో ఎక్కడా పర్యాటక స్థలాలు లేవు. ఈ తరుణంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే పూర్వవైభవం వచ్చే అవకాశం లేకపోలేదు. 2005 వరకు ప్రతి ఏటా నిధులు మంజూరయ్యాయి. తర్వాత వాటి ఊసే లేకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434