దుకాణదారులకు ఉపశమనం!
పట్టణ ప్రాంతాల్లో దుకాణదారులకు ఊరట కలిగించేలా పురపాలిక శాఖ నిర్ణయం తీసుకుంది. రహదారి వెడల్పు, దుకాణ విస్తీర్ణాన్ని బట్టి ట్రేడ్లైసెన్స్ రుసుం వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత వరకు దుకాణం ఎక్కడ ఉన్నా ఒకే రకమైన రుసుం ఉండేది.
ట్రేడ్ లైసెన్స్ రుసుం నిర్ణయానికి కొత్త విధానం
న్యూస్టుడే, మెదక్: పట్టణ ప్రాంతాల్లో దుకాణదారులకు ఊరట కలిగించేలా పురపాలిక శాఖ నిర్ణయం తీసుకుంది. రహదారి వెడల్పు, దుకాణ విస్తీర్ణాన్ని బట్టి ట్రేడ్లైసెన్స్ రుసుం వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత వరకు దుకాణం ఎక్కడ ఉన్నా ఒకే రకమైన రుసుం ఉండేది. కొత్త విధానంతో ప్రధాన రహదారుల పక్కన కాకుండా కాలనీల్లో దుకాణాలు నిర్వహించేవారికీ ఉపశమనం లభించినట్లయింది. రుసుం నిర్ణయించే బాధ్యతను ప్రభుత్వం పురపాలికలకే ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో వివిధ వ్యాపారాలు నిర్వహించే వారు తప్పకుండా మున్సిపల్ కార్యాలయం నుంచి అనుమతి పొందాలి. వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్కు దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి ధ్రువపత్రం అందజేస్తారు. ఏటా కొంత పన్నును బల్దియాకు చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది దుకాణాలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ ట్రేడ్ లైసెన్స్ పొందడంలో కొంత జాప్యం చేస్తున్నారు. అధికారులు తనిఖీల సమయంలోనే లైసెన్స్ లేని విషయం బయటపడుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న నాలుగు పురపాలికల్లో ట్రేడ్లైసెన్సుల ద్వారా రూ.27లక్షల ఆదాయం లభిస్తోంది. జిల్లాలోని ఆయా పురపాలికల్లో తొలుత ఒక వరుస, రెండు వరుసల రహదారులను గుర్తించనున్నారు. దుకాణాల వైశాల్యంలో చదరపు గజానికి రూ.4 నుంచి రూ.10 వరకు వసూలు చేస్తారు. ఒక్కో దానికి రూ.వేయి నుంచి రూ.10 వేల వరకు నిర్ణయించే అవకాశం ఉంది. పట్టణంలో ఒక వరుస రోడ్డు ఉన్న ప్రాంతంలోని దుకాణాలకు చదరపు గజానికి రూ.5 చొప్పున, రెండు వరుసలు ఉన్న ప్రాంతాల్లో చదరపు గజానికి రూ.20 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేటల్లో ఎక్కువ శాతం రెండు వరుసల రహదారులున్నాయి.
సమకూరనున్న ఆదాయం
పురపాలిక పరిధిలో ప్రధాన రహదారికి ఆనుకొని వందల్లో, వీధుల్లో పెద్దసంఖ్యలో దుకాణాలు ఉంటాయి. ప్రస్తుతం అన్ని పట్టణాల్లో ప్రధాన రహదారుల వెంట ఉన్న దుకాణాల ద్వారా రూ.500 నుంచి రూ.1500 వరకు రుసుం వసూలు చేస్తూ ట్రేడ్ లైసెన్సులను జారీ చేస్తున్నారు. కొత్త విధానంలో సమగ్ర సర్వే చేపట్టి ఫీజులు నిర్ణయిస్తే పురపాలక సంఘాలకు ఆదాయం పెరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం