ఇటుక బట్టీ.. నిబంధనలు కట్టిపెట్టి..!
దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాల్లో యథేచ్ఛగా ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం అక్రమార్కులకు కలిసి వస్తోంది. వాస్తవానికి ఇటుక బట్టీల నిర్వహణకు రెవెన్యూ, నీటి పారుదల, పంచాయతీరాజ్, భూగర్భ గనులు, అటవీ,
బీళ్లుగా మారుతున్న పచ్చని పొలాలు
న్యూస్టుడే, మిరుదొడ్డి
అల్వాలలో నడుస్తున్న ఇటుక బట్టీ
దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాల్లో యథేచ్ఛగా ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం అక్రమార్కులకు కలిసి వస్తోంది. వాస్తవానికి ఇటుక బట్టీల నిర్వహణకు రెవెన్యూ, నీటి పారుదల, పంచాయతీరాజ్, భూగర్భ గనులు, అటవీ, కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్తు శాఖల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటివి ఏమీ లేకుండానే వాటిని ఏర్పాటు చేస్తుండగా ఆయా శాఖల అధికారులు చూసీ చూడనట్లు వెళుతుండగా లాభసాటి వ్యాపారం కావడంతో ఎక్కడ పడితే అక్కడ ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. మిరుదొడ్డి, దుబ్బాక, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో దాదాపు 28 వరకు ఇటుక బట్టీలు నడుస్తుండగా ఏ ఒక్కదానికి కూడా అనుమతులు లేకపోవడం విశేషం. మిరుదొడ్డి మండల కేంద్రంతో పాటు అల్వాల, భూంపల్లి, అక్బర్పేట, పెద్ద చెప్యాల, దౌల్తాబాద్ మండలంలో కోనాపూర్, ముబారస్పూర్, దుబ్బాక పురపాలిక పరిధిలో చీకోడు, బల్వంతాపూర్, దుంపలపల్లి, తొగుట మండలంలో కాన్గల్, రాయపోల్ మండలంలోని వడ్డెపల్లి గ్రామాల్లో ఇటుక బట్టీలు నడుస్తున్నాయి.
ఇటుక బట్టీల నిర్వాహకులు అవలంబిస్తున్న విధానాలన్నీ అక్రమమే. బట్టీ ఏర్పాటుకు కనీసం రెండు నుంచి అయిదెకరాల వరకు భూమి అవసరం. ఆయా పంచాయతీల పరిధిలో రెవెన్యూ శాఖ అనుమతులు తప్పనిసరి. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కొంత డబ్బు ముట్టజెప్పి ఇటుక బట్టీలు నెలకొల్పుతున్నారు. వ్యవసాయేతర పనులకు భూమిని వినియోగిస్తున్నందున నాలా పన్ను చెల్లించాలి. భూగర్భ గనుల శాఖ నుంచి సైతం అనుమతులు పొందాలి. తహసీల్దారు కార్యాలయం, కాలుష్య నియంత్రణ అధికారి నుంచి అనుమతి పత్రం పొందాలి. ఇవేవి లేకపోగా...ప్రభుత్వ స్థలాలు, వాగులు, చెరువుల నుంచి వాల్టాను (నీరు, చెట్టు, భూమి చట్టం) ఉల్లంఘించి ఎక్కడ పడితే అక్కడ గోతులు తవ్వుతూ ఇటుకల తయారీకి మట్టిని తరలిస్తున్నారు.
ఉచిత విద్యుత్తు దుర్వినియోగం
అన్నదాతలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తుండగా వ్యాపారులు ఇటుకల తయారీ ప్రదేశంలో ప్రత్యేకంగా బోరు వేసుకుని మోటారు నడుపుకునేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకొని కనెక్షన్ పొందాలి. అందుకు మూడు నెలలకు రూ.11 వేల వరకు చెల్లించాల్సి ఉండగా నిబంధనలు తోసిరాజని సమీప వ్యవసాయ భూముల్లో ఉన్న బోరు మోటార్లను లీజుకు తీసుకొని ఉచిత విద్యుత్తును దుర్వినియోగం చేస్తున్నారు. ఈ విషయమై ఆయా మండలాల తహసీల్దార్లను వివరణ కోరగా.. అక్రమ ఇటుక బట్టీలపై ఆరా తీస్తామన్నారు. ఒక్కదానికి కూడా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. వాటిపై సమాచారం తెప్పించుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. మైనింగ్ అధికారుల అనుమతి లేకుండా బట్టీలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా