అభ్యసన సామర్థ్యం.. భవితకు మార్గం
విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు తగ్గాయి. గతంలో కరోనాతో ఏడాదిన్నర పాఠశాలలు మూసి ఉండడం.. గతేడాది తరగతులు నిర్వహించినా.. పాఠాలు పూర్తిస్థాయిలో చెప్పకపోవడంతో పిల్లలు చదువులో వెనుకబడ్డారు. ఇటీవల నిర్వహించిన
విద్యార్థులకు నేర్పించడంపై దృష్టి సారించాలని విద్యాశాఖ ఆదేశం
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు తగ్గాయి. గతంలో కరోనాతో ఏడాదిన్నర పాఠశాలలు మూసి ఉండడం.. గతేడాది తరగతులు నిర్వహించినా.. పాఠాలు పూర్తిస్థాయిలో చెప్పకపోవడంతో పిల్లలు చదువులో వెనుకబడ్డారు. ఇటీవల నిర్వహించిన న్యాస్ పరీక్షల్లోనూ ఇదే విషయం తేటతెల్లమైంది. జిల్లాలో కొన్ని పాఠశాలలు బేసిక్స్ పేరుతో విద్యార్థులకు గతేడాది తరగతి పాఠాలతో పాటు.. ప్రాథమిక అంశాలు నేర్పించడం ప్రారంభించారు. ఇది ఆయా పాఠశాలల్లో విజయవంతం కావడంతో.. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్ ఇటీవల ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కథనం.
ప్రత్యేక తరగతుల నిర్వహణ
జిల్లాలో 846 ప్రాథమిక, 199 ప్రాథమికోన్నత, 203 ఉన్నత, 5 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1.22 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులు విద్యా సామర్థ్యాల్లో వెనుకబడి ఉండడంతో రెగ్యులర్ పాఠాలతో.. వారికి బేసిక్స్ నేర్పించాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. ప్రతి రోజు రెగ్యులర్ పాఠాలతో పాటు.. ప్రత్యేక తరగతులు, తర్ఫీదు ఇవ్వాలని సూచించింది. మొదట విద్యార్థులకు పాఠ్యాంశాలపై ప్రత్యేక పరీక్ష నిర్వహించాలి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయాలి. పిల్లలు ఎందులో వెనుకబడ్డారో గుర్తించి.. ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆయా పాఠశాలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారం నెల రోజుల పాటు పిల్లలకు ప్రత్యేక బోధన చేయాలి. విద్యార్థులతో సాధన చేయించాలి. చివరి రోజు మళ్లీ పరీక్ష నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలు ఎంత వరకు మెరుగు పడ్డాయో తెలుసుకోవాలి. అప్పటికీ.. సత్ఫలితాలు రాకుంటే.. మళ్లీ కొన్ని రోజులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి.
చదువులో ముందుండాలన్నదే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చదువులో ముందుండాలన్నదే విద్యాశాఖ లక్షం. ప్రైవేట్ పాఠశాలల నుంచి ఈ ఏడాది వెయ్యి మందికిపైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రైవేట్ నుంచి వచ్చిన విద్యార్థులు చదువులో కొంచెం ముందున్నారు. మొదటి నుంచి ప్రభుత్వ బడుల్లో చదివిన పిల్లలు కూడా బేసిక్స్పై పట్టు సాధించి రెగ్యులర్ తరగతి పాఠాలు అర్థం చేసుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
పక్కాగా అమలు చేస్తాం..: రాజేశ్, జిల్లా విద్యాధికారి
పునాది, త్రీఆర్స్ పేరుతో విద్యార్థులకు బేసిక్స్ నేర్పించాలని ఆదేశాలు ఇచ్చాం. రెగ్యులర్ తరగతులో పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలి. అన్ని పాఠశాలల్లో పక్కాగా అమలు చేసేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం. మండల విద్యాధికారులు నిత్యం పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చాం. విద్యార్థులు బేసిక్స్పై పూర్తిగా పట్టు సాధిస్తేనే రెగ్యులర్ తరగతులు అర్థమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!