ఆర్టీసీకి కలిసొచ్చిన జూన్!
నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి జూన్లో ఆదాయం పెరగడం ఊరటనిచ్చింది. సంస్థ ఎండీగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదాయం రాబట్టేందుకు పలు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగానే వేసవి సెలవులు, వివాహాలకు ప్రత్యేక రాయితీలు, వి
మెదక్ డిపోకు రూ.4.79 కోట్ల ఆదాయం
న్యూస్టుడే, మెదక్ అర్బన్
నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి జూన్లో ఆదాయం పెరగడం ఊరటనిచ్చింది. సంస్థ ఎండీగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదాయం రాబట్టేందుకు పలు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగానే వేసవి సెలవులు, వివాహాలకు ప్రత్యేక రాయితీలు, వివిధ సందర్భాలలో ప్రత్యేక సర్వీసులు, కార్గో సేవలు వంటివి ప్రవేశపెట్టారు. జిల్లా కేంద్రం మెదక్ డిపోనకు ఆయా సేవల ద్వారా ఆదాయం సమకూరుతోంది. ఈ క్రమంలో గత జూన్లో రూ.4.79 కోట్ల ఆదాయం రావడం విశేషం. ఇటీవలి కాలంలో ఇదే అత్యధిక ఆదాయం కావడం గమనార్హం. మేలో రూ.4.24 కోట్లు వచ్చింది.
శుభకార్యాలతో పెరిగిన ప్రయాణాలు..
జూన్లో శుభ ముహూర్తాలు అధికంగా ఉండటం ఆర్టీసీకి కలిసొచ్చింది. జిల్లాలో వివాహాది శుభకార్యాలు అత్యధికంగా జరిగాయి. మరో నాలుగైదు నెలల వరకు ముహూర్తాలు లేకపోవడంతో ఎంతోమంది గత నెలలోనే పెళ్లిళ్లు జరిపించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ రాయితీ సదుపాయాన్ని కల్పించడంతో ఎంతోమంది సేవలు వినియోగించుకున్నారు. యాత్రలకు, వివాహాలకు వెళ్లిన వారి సంఖ్య పెరగడంతో ఆదాయానికి మార్గం ఏర్పడింది.
తిరుమలేశుడి దర్శనం..
తిరుపతికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులు ఆన్లైన్ ద్వారా వారం రోజుల ముందుగా బస్సు టికెట్ బుక్ చేసుకుంటే దాంతో పాటు స్వామి ప్రత్యేక దర్శనం టికెట్ పొందే సదుపాయాన్ని సైతం ప్రారంభించింది. దీనికి అదనంగా రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిత్యం మెదక్ నుంచి తిరుపతికి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు నడుపుతోంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఇక్కడి నుంచి బయల్దేరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం