ప్లాట్ల క్రమబద్ధీకరణపై ఆశలు..!
లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) మళ్లీ తెరపైకి రావడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. రెండేళ్ల కిందట నిలిపివేసిన అనధికార లేఅవుట్ స్థలాల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లతో పాటు భవన నిర్మాణాల ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
న్యూస్టుడే, మెదక్, నర్సాపూర్
జిల్లా కేంద్రంలో అనుమతి లేని లేఅవుట్
లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) మళ్లీ తెరపైకి రావడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. రెండేళ్ల కిందట నిలిపివేసిన అనధికార లేఅవుట్ స్థలాల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లతో పాటు భవన నిర్మాణాల ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అక్రమ లేఅవుట్లలో నిబంధనల మేరకు ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. తద్వారా బల్దియాలకు ఆదాయం సమకూరనుంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు జిల్లా అతి సమీపంలో ఉండటంతో పాటు జాతీయ రహదారులు జిల్లా మీదుగా వెళ్తుండటంతో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇదే క్రమంలో అక్రమ లేఅవుట్లు భారీగా వెలిశాయి. పురపాలిక, గ్రామపంచాయతీ, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో స్థిరాస్తి వ్యాపారంలో భారీ అక్రమాలు జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో అక్రమ/అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని 2020 జులైలో ఉత్తర్వులు ఇచ్చింది.
నర్సాపూర్లో అనుమతి లేని లేఅవుట్లో నిర్మాణాన్ని కూల్చివేస్తున్న అధికారులు
96 మేర అక్రమ లేఅవుట్లు
ఇదే క్రమంలో ఎల్ఆర్ఎస్ రూపంలో క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తూ అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు సర్వే చేపట్టి జిల్లాలో 96 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించారు. నాలుగు పురపాలికల్లో 84, గ్రామాల్లో 12 అనధికారికంగా ఉన్నాయని తేల్చారు. పురపాలిక, పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎలాంటి అనుమతులు లేకుండా, ఖాళీ స్థలాలు వదలకుండా పదుల సంఖ్యలో లేఅవుట్లను ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ప్లాట్లు కొన్న యజమానులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
18,100 దరఖాస్తులు
రెండేళ్ల కిందట జిల్లాలోని నాలుగు పురపాలికల పరిధిలో క్రమబద్ధీకరణకు వందలాది దరఖాస్తులు వచ్చాయి. ప్లాట్ల యజమానులు రూ.వేయి, లేఅవుట్ చేసిన వారు రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేశారు. వారి స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వచ్చిన 18,100 దరఖాస్తుల్లో నిబంధనల ప్రకారం ఉన్న వాటికి మోక్షం కలిగించనున్నారు. అధికారులు సమాయత్తం అవుతున్నారు.
నిబంధనల ప్రకారం..
తాజాగా ప్రభుత్వం జారీ చేసిన 131 జీవో ప్రకారం ప్రభుత్వ స్థలాలు, ఆలయ భూములు, పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం, మిగులు భూములు, చెరువు శిఖం భూముల్లో ఉన్న ప్లాట్ల లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ వర్తించదనే నిబంధన విధించారు. లేఅవుట్లలో పది శాతం ప్లాట్లు విధిగా రిజిస్ట్రేషన్ చేసి ఉండాలన్న నిబంధన అమలు చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం