రాష్ట్రంలో రాజన్న పాలన తీసుకొస్తా..
ఆరేళ్లు తెరాస ఎమ్మెల్యే దుబ్బాక ప్రజల చెవుల్లో పూలు పెట్టగా, ఉప ఎన్నికల్లో గెలుపొందిన భాజపా ఎమ్మెల్యే రఘునందన్రావు మరో అడుగు ముందుకేసి కాలీప్లవర్లు పెడుతున్నాడని వైతెపా అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
వైతెపా అధ్యక్షురాలు షర్మిల
చేగుంటలో ప్రజలతో షర్మిల
చేగుంట, చిన్నశంకరంపేట, న్యూస్టుడే: ఆరేళ్లు తెరాస ఎమ్మెల్యే దుబ్బాక ప్రజల చెవుల్లో పూలు పెట్టగా, ఉప ఎన్నికల్లో గెలుపొందిన భాజపా ఎమ్మెల్యే రఘునందన్రావు మరో అడుగు ముందుకేసి కాలీప్లవర్లు పెడుతున్నాడని వైతెపా అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. మంగళవారం షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర చిన్నశంకరంపేట మండలం రుద్రారం, చందంపేట గ్రామాల మీదుగా చేగుంట వరకు కొనసాగింది. పొలంపల్లి వద్ద దివ్యాంగుడితో మాట్లాడారు. చేగుంటలో జరిగిన సభలో మాట్లాడుతూ.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు నిరుద్యోగభృతి ఇస్తానని, దుబ్బాకకు రైలు తెస్తానని, పరిశ్రమలు తెస్తానని హామీ ఇచ్చారని, వీటిలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల సమయంలో దుబ్బాకలో కుటుంబీకులతో కలిసి ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి.. అమీర్పేటలో కార్పొరేట్ ఆసుపత్రి ఏర్పాటుచేశారని విమర్శించారు. ఎంతో మంది ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను బీర్ల రాష్ట్రంగా మార్చారాని ఆరోపించారు. కాంగ్రెస్, భాజపాలు తెరాసతో కుమ్మక్కయ్యాయని, అందుకే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో వైతెపా అధికారంలోకి రాగానే వైఎస్సార్ పథకాలను తిరిగి తెస్తానని హామీ ఇచ్చారు. రాజన్న పాలన తీసుకొస్తానని, తెరాస ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ ప్రతినిధి శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం, నాయకులు శ్రీనివాస్, విజయభాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* ప్రజాప్రస్థాన పాదయాత్రను అడ్డుకునేందుకు తెరాస నాయకులు ప్రయత్నించారు. షర్మిల చేగుంటకు చేరుతుందనగా తెరాస నాయకులు గాంధీ చౌరస్తా వద్ద నిర్వహించే సభ వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గోబ్యాక్ షర్మిల అంటూ నినదించారు. అక్కడే ఉన్న రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట ఎస్ఐలు నర్సింలు, రాజేష్, శ్రీనివాస్రెడ్డి వారించే ప్రయత్నం చేశారు. అయినా వెనక్కి తగ్గలేదు. వారిని బలవంతంగా వాహనంలో ఎక్కించుకొని ఠాణాకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం