నిర్భయంగా మాట్లాడి.. తానేంటో నిరూపించుకొని..
ఠక్కున స్పందించిన శ్రీవర్షిణి.. ‘నేను 8వ తరగతిలో ఉన్నపుడే బోస్ చరిత్ర చదివా. వారి వ్యక్తిత్వం ఎంతో గొప్పది.’
ప్రధానితో సిద్దిపేట విద్యార్థిని
న్యూస్టుడే, సిద్దిపేట
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శ్రీవర్షిణి (కుడివైపు రెండో వ్యక్తి)
ఠక్కున స్పందించిన శ్రీవర్షిణి.. ‘నేను 8వ తరగతిలో ఉన్నపుడే బోస్ చరిత్ర చదివా. వారి వ్యక్తిత్వం ఎంతో గొప్పది.’ అంటూ ఆంగ్లంలో రెండు నిమిషాలు మాట్లాడారు. ఈ సమాధానమే పార్లమెంట్కు తీసుకెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో నేరుగా మాట్లాడే అవకాశం దక్కించుకున్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ (హెచ్పీ ఎంసీజే) ప్రథమ సంవత్సర విద్యార్థిని శ్రీవర్షిణి సాధించిన ఘనత ఈనెల 23న నేతాజీ జయంతి పురస్కరించుకొని నెహ్రూ యువ కేంద్రం (ఎన్వైకే) తరఫున రాష్ట్రం నుంచి పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. దిల్లీలో ఐదు రోజుల యాత్ర పూర్తి చేసుకొని సిద్దిపేటకు తిరిగిరాగా ‘న్యూస్టుడే’ పలకరించింది. ఆమె మాటల్లోనే...
మాది సిద్దిపేట. నాన్న వేణుమాధవ్ ఎలక్ట్రిక్ వ్యాపారి. అమ్మ నాగలక్ష్మి కస్తూర్బా ఉపాధ్యాయురాలు. చెల్లి సౌధామిని. విద్యాభ్యాసమంతా ఇక్కడే సాగింది. ప్రస్తుతం ఆసక్తి ఉన్న జర్నలిజం అనుబంధ కోర్సు చదువుతున్నా. విభిన్న అంశాల్లో రాణించాలని ఉంటుంది. క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన, క్రీడా పోటీల్లో పాల్గొంటా. ఎనిమిదో తరగతి చదివే సమయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్నా. ఎన్వైకే తరఫున నిర్వహించిన వక్తృత్వ పోటీ.. కీలక మలుపుతిప్పింది. ఈనెల 9న జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రసంగించా. ప్రతిభ ఆధారంగా జాతీయస్థాయిలో పార్లమెంట్ సెంట్రల్హాల్కు వెళ్లే అవకాశం దక్కించుకున్నా. ఎన్వైకే తరఫున వివిధ రాష్ట్రాల నుంచి ఒకరు చొప్పున మొత్తం 27 మంది ఎంపికవగా.. అందులో తెలంగాణ నుంచి నేను ఒక్కరినే. ఈనెల 23న పార్లమెంట్ సెంట్రల్ హాల్కు వెళ్లాం. అక్కడికి చేరుకున్న ప్రధాని అభివాదం చేశారు. తరువాత పీఎం కార్యాలయంలో ‘మీ నాయకుడు తెలుసా’ అంశంపై ఇంటరాక్షన్ జరిగింది. 40 నిమిషాలు గడిపాం. ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చా. వారితో కలిసి గ్రూపు ఫొటో దిగాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అక్కడి వేడుకలు తిలకించా. అమ్మానాన్నలు చదువుతో పాటు నచ్చిన రంగాల్లో రాణించాలంటూ ప్రోత్సహిస్తున్నారు. నాకు ఉపన్యాసమంటే అమితాసక్తి. ఆడపిల్లలు నిర్భయంగా మాట్లాడాలి. సరైన నిర్ణయం తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్