ఆస్తి కోసం చిన్నమ్మనే కడతేర్చాడు
ఈనెల 21న టేక్మాల్ మండలం తంపులూరులో హత్యకు గురైన మహిళను ఆమెకు వరుసకు కొడుకయ్యే వ్యక్తే చంపినట్లు పోలీసులు గుర్తించారు. టేక్మాల్లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బుధవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు.
మహిళ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యేసు
టేక్మాల్, న్యూస్టుడే: ఈనెల 21న టేక్మాల్ మండలం తంపులూరులో హత్యకు గురైన మహిళను ఆమెకు వరుసకు కొడుకయ్యే వ్యక్తే చంపినట్లు పోలీసులు గుర్తించారు. టేక్మాల్లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బుధవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని తంపులూరు గ్రామానికి చెందిన దుబ్బగళ్ల సంగమ్మ(44) భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కుమారుడు హైదరాబాద్లో నివసిస్తుండడంతో సొంతింట్లోనే ఒంటరిగా ఉంటోంది. ఈనెల 21వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు చేపట్టారు. వట్పల్లి మండలం మరవెల్లి గ్రామానికి చెందిన మల్లగుల్ల యేసు(38)కు సంగమ్మ చిన్నమ్మ అవుతుంది. అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చిపోతుండేవాడు. ఈనెల 20వ తేదీన జోగిపేటలో పనిఉందని బైకుపై వెళ్లి వద్దామని యేసుని ఇంటికి పిలిచింది. ఇద్దరు కలిసి జోగిపేటకు వెళ్లి సాయంత్రం తిరిగొచ్చారు. రాత్రికి అతను చిన్నమ్మ ఇంట్లోనే నిద్రించాడు. ఆమెను చంపితే తమ బంధువులకు ఆస్తి దక్కుతుందని భావించి 21వ తేదీ తెల్లవారుజామున ఇంట్లోని సుత్తితో తలపై బాది హత్య చేశాడు. ఇంట్లోని బంగారు ఆభరణాలను తీసుకొని పరారయ్యాడు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె చరవాణి కాల్డేటా ఆధారంగా నిందితుణ్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
నీట మునిగి యువకుడి మృతి
సిద్ధిరాములు
పాపన్నపేట, న్యూస్టుడే: నీట మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయ సమీపంలోని మంజీరా చెక్డ్యాంలో చోటుచేసుకుంది. ఎస్సై నరేష్ తెలిపిన ప్రకారం.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన గుడ్ల సిద్ధిరాములు(28) హమాలీగా జీవనం సాగిస్తున్నాడు. దుర్గమ్మ దర్శనానికి మంగళవారం తోటి వారితో కలిసి ఏడుపాయలకు వచ్చాడు. అదే రోజు సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెక్డ్యామ్ వద్దకు వెళ్లి, ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. అక్కడే ఉన్నవారు గమనించి వెతికి, రాత్రి సమయంలో మృతదేహాన్ని వెలికితీసి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బుధవారం భార్య సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
మహమ్మద్ బందేలి
మనూరు, న్యూస్టుడే: ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచలో చోటుచేసుకుంది. మనూరు ఎస్సై అంబార్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బోరంచకు చెందిన మహమ్మద్ బందేలి(28) ఉపాధి నిమిత్తం కుటుంబంతోసహా కొన్నేళ్ల కిందట హైదరాబాద్కు వలస వెళ్లాడు. అప్పులు ఎక్కువ కావడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఇటీవల గ్రామానికి వచ్చాడు. అప్పులు పెరిగిపోవడంతో మానసిక ఒత్తిడికి లోనయిన బందేలి బుధవారం పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. బందేలి అన్న ఖాజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
మనస్తాపంతో యువకుడు..
శశికుమార్
చిన్నశంకరంపేట, న్యూస్టుడే: అనారోగ్యానికి గురైన యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించి, చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండల పరిధి అంబాజీపేటలో బుధవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై నారాయణ తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన శశికుమార్(26) ఉప్పరి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా, ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో మనస్తాపానికి గురై గత శనివారం పురుగుమందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. శశికుమార్ అన్న రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!