కొత్త రేషన్కార్డులకు.. కోడ్ అడ్డంకి
ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరికే ఇవి ఉండగా, చాలా మందికి లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కేవలం పథకాలే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం లేక ఆర్థికభారం పడుతోంది.
న్యూస్టుడే-మెదక్, శివ్వంపేట: ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరికే ఇవి ఉండగా, చాలా మందికి లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కేవలం పథకాలే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం లేక ఆర్థికభారం పడుతోంది. ఇలా పలు రకాలుగా ఇబ్బందులు ఉండడంతో చాలా మంది రేషన్ కార్డు కోసం అర్జీ పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో నిరాశతో ఉన్నారు. ఈ క్రమంలో ఐదు గ్యారంటీలను అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల జారీకి పచ్చజెండా ఊపింది. అయితే ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. దరఖాస్తుకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి ఉత్తర్వులు లేదా ఆన్లైన్ నమోదుకు అవకాశం లభించలేదు. దీంతో చాలా మంది ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 2.13 లక్షల కార్డులున్నాయి. అత్యధిక శాతం మందికి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు పొందేందుకు అడ్డంకిగా మారుతోంది. దీంతో అప్పులు చేసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
పదేళ్లలో రెండు సార్లు మాత్రమే...: రాష్ట్ర ఆవిర్భావ అనంతరం అప్పటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. దాని ప్రకారం ఒకసారి ఆహారభద్రత కార్డులు, పింఛన్లు జారీ చేశారు. ఆ తర్వాత కొత్తవాటి జోలికి వెళ్లలేదు. అనంతరం పలువురు నూతన కార్డులతో పాటు, కుటుంబ సభ్యుల నమోదుకోసం అర్జీ పెట్టుకున్నారు. దీంతో 2021 ఆగస్టులో నూతన కార్డులకు ఆమోదం తెలిపారు. జిల్లాలో 3,368 కార్డులను జారీ చేశారు. అనంతరం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో చాలా మందికి కార్డులు అందలేదు. ప్రస్తుతం చాలా కుటుంబాల్లో సోదరులు విడిపోయి వేరు కాపురాలు పెట్టడం, తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉండడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆ కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అర్జీలను స్వీకరించింది. ఆయా పథకాల్లో లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు రేషన్కార్డు జతపర్చాలని సూచించింది. చాలా మందికి కార్డులేక పథకాలకు దూరమయ్యారు. ఈ విషయాన్ని గమనించిన పభుత్వం కొత్త కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో 14,548 మంది దరఖాస్తులు సమర్పించారు.
మంజూరు ఇప్పట్లో లేనట్టే...: నూతన కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది .దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఫలితంగా కొత్తగా కార్డులు మంజూరుచేసే అవకాశం ఉండదు.
తొమ్మిదేళ్ల నుంచి అవకాశం రాలేదు
వెంకట్రెడ్డి, గోమారం, శివ్వంపేట
నాకు 2015లో వివాహం జరిగింది. అప్పటి నుంచి కార్డు కోసం ఎదురుచూస్తున్నా, ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా. కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆశలు చిగురించాయి. వెంటనే దరఖాస్తుకు అవకాశం కల్పించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM