హత్యలతో కలవరం
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు.
ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ రామ్మోహన్రెడ్డి
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. మరో ఘటనలో డబ్బు విషయమై మిత్రుల మధ్య జరిగిన గొడవ ఒకరి అంతానికి దారి తీసింది. హైదరాబాద్ దుండిగల్లో తల్లి ప్రవర్తన నచ్చని కుమారుడు ఆమెను అంతమొందిచాడు.
డబ్బుల విషయమై వివాదంతో..
కోహీర్: మిత్రుల మధ్య జరిగిన వివాదం హత్యకు దారి తీసింది. జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ రవి, ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాలు.. హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన షేక్అన్వర్అలీ(30), సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం గురుజువాడకు చెందిన మహ్మద్ఖైఫ్, కోహీర్కు చెందిన ముస్తాకిమ్లు మిత్రులు. వీరంతా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వారిద్దరికి హైదరాబాద్ నుంచి ఆటోలను అన్వర్ అద్దెకు ఇప్పిస్తుంటాడు. సోమవారం రాత్రి కోహీర్కు వచ్చాడు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత భవనం వెనుక ముగ్గురూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అద్దె డబ్బు విషయమై గొడవ జరిగి ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి గురైన మహ్మద్ఖైఫ్, ముస్తాకిమ్ కొడవలితో అన్వర్అలీపై దాడి చేసి హతమార్చారు. మంగళవారం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. హతుడు అన్వర్ అలీపై చోరీలు, హత్య కేసు, మహ్మద్ఖైఫ్పై దొంగతనం, ముస్తాకిమ్పై అక్రమ రేషన్ బియ్యం సరఫరా కేసు ఉన్నాయని వివరించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తల్లి ప్రవర్తన నచ్చక..
దుండిగల్: తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే ఆమెను అంతమొందించాడు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాలు.. నర్సాపూర్ ఎర్రకుంట తండాకు చెందిన గన్య, సక్కుబాయ్ (48) దంపతులకు ఇద్దరు కుమారులు. ఆరేళ్ల క్రితం గన్య మృతి చెందాడు. ఆరు నెలల క్రితం కుమారులతో కలిసి ఆమె డి.పోచంపల్లికి వలస వచ్చి కూలీ పనులు చేస్తూ అక్కడే నివాసం ఉంటోంది. పెద్ద కొడుకు అంజకు ఇటీవల వివాహం కాగా, అదే ప్రాంతంలో వేరుగా ఉంటున్నాడు. కొంతకాలంగా తల్లి ప్రవర్తన నచ్చక ఆమెను కడతేర్చాలని పెద్ద కొడుకు నిశ్చయించుకున్నాడు. తన మిత్రుడు, మరొకరితో కలిసి పథక రచన చేశాడు. ఈ నెల 20న రాత్రి క్యాటరింగ్ పని ఉందంటూ తల్లిని నమ్మించి.. తన వెంట బౌరంపేట పరిధి సతీష్ లేఅవుట్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. పదునైన ఆయుధంతో ఆమె గొంతుపై పొడవడంతో పాటు తల వెనుక భాగంలో రాయితో మోది దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని అదే ప్రాంతంలోని ఖాళీ స్థలంలో ఉన్న నీటి సంపులో పడేసి వెళ్లిపోయారు.
పట్టుబడింది ఇలా..
ఆ రోజు రాత్రి తల్లి ఇంటికి రాకపోవడంతో చిన్న కొడుకు అన్నకు విషయం చెప్పాడు. తానే అమ్మను గండిమైసమ్మ చౌరస్తాలో వదిలిపెట్టానని.. పని రద్దవడంతో ఇంటికి వెళ్లమన్నానని తమ్ముడికి చెప్పాడు. స్నేహితురాలిని కలుస్తానని చెప్పిందని నమ్మించాడు. ఆ తర్వాత తమ్ముడు, బంధువులతో కలిసి ఆమె కోసం గాలించినట్లు నటించాడు. ఈ నెల 21న సాయంత్రం బౌరంపేటలోని సతీష్ లేఅవుట్లోని నిర్మానుష్య ప్రాంతంలో అమ్మ పర్సు దొరికిందని తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాడు. తమ్ముడు అక్కడికి వెళ్లగా రక్తం మరకలను గమనించి సమీపంలోని నీటి సంపులో చూడగా తల్లి మృతదేహం కనిపించింది. హతురాలి చిన్న కొడుకు ఫిర్యాదుతో దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గండిమైసమ్మ చౌరస్తాలోని సీసీ ఫుటేజీల ఆధారంగా అంజను, అతడికి సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. నిందితుల అరెస్టును పోలీసులు ధ్రువీకరించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి ఓటు వేశారోచ్
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి సారిగా చేపట్టిన ఇంటి నుంచి ఓటు ప్రక్రియ సాఫీగా కొనసాగింది. -
ఈ రోజు ఇలా.. రేపు అలా..
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. -
ఆరు నూరైనా మెతుకు సీమలో గెలవాలి
[ 03-05-2024]
సిద్దిపేటలో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్షో శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. -
ఒకేలా కన్పిస్తూ.. గెలుపోటములు శాసిస్తూ..
[ 03-05-2024]
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. పోలింగ్కు తక్కువ రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే.. సీఎం అబద్ధాల్ని ఆమోదించినట్లే
[ 03-05-2024]
‘అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. గద్దెనెక్కాక ప్రజల్ని మోసం చేసింది. -
లోక్సభ పోరు.. మరింత హోరు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
భాజపాతోనే దేశాభివృద్ధి
[ 03-05-2024]
భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. -
ఓటరు చైతన్యంపై ఆడియో ఆవిష్కరణ
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్శాతం పెంచేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు. -
కల నెరవేరిస్తేనే.. విద్యాప్రగతి
[ 03-05-2024]
విద్యతోనే ప్రగతి సాధ్యం.. పేదరిక నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది.. డిగ్రీ వరకు విద్యాభ్యాసానికి ప్రభుత్వపరంగా వసతులు ఉన్నా ఆపై చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు.. ఎన్నికల సమయంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత వదిలేస్తున్నారు. -
రెండు కళ్లూ చాలవులే..
[ 03-05-2024]
కల్యాణ వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చిరుమందహాసం చేస్తోంది.. పక్కనే మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుడిని చూసిన పార్వతిదేవి సిగ్గులొలికిస్తోంది. -
విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపా
[ 03-05-2024]
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి విద్వేషాలను రెచ్చగొడుతూ అప్రజాస్వామిక రాజకీయాలు సాగిస్తున్న భాజపాను ఓడించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. -
లక్ష్యం.. సాకారం చేసుకొని..
[ 03-05-2024]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతోమంది ఈ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలు కంటుంటారు. -
కాంగ్రెస్ సర్కారుతోనే సంక్షేమం: మంత్రి పొన్నం
[ 03-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ అంటే బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు