స్వతంత్రులు నామమాత్రమేనా?
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీచేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. ఎక్కువ మంది డిపాజిట్లు కోల్పోతున్నారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ప్రస్తుతం నాలుగో ఎన్నిక జరుగుతోంది.
పెద్దసంఖ్యలో బరిలో దిగినా ఓట్లు తక్కువే
ఈనాడు, కామారెడ్డి, న్యూస్టుడే, జహీరాబాద్
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీచేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. ఎక్కువ మంది డిపాజిట్లు కోల్పోతున్నారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ప్రస్తుతం నాలుగో ఎన్నిక జరుగుతోంది. 19 మంది బరిలో ఉండగా.. స్వతంత్రులుగా పది మంది పోటీచేస్తున్నారు.
పార్టీల ఎత్తుగడలతోనే కొందరు పోటీ
కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేయడంతో పాటు అభ్యర్థులు చేస్తున్న వ్యయంపై నిఘా పెడుతోంది. ముఖ్యంగా నిబంధనలకు అనుగుణంగానే వాహనాలకు అనుమతులు మంజూరు చేస్తోంది. పోలింగ్ సమయంలో కేవలంలో అభ్యర్థుల ప్రధాన ఏజెంట్లకు మాత్రమే కేంద్రాల్లోకి వెళ్లే అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులను బరిలో దింపి వారిపేరు మీద తమ పార్టీకి చెందిన ముఖ్య అనుచరులకు పాస్లు ఇప్పించుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థుల ప్రధాన పోలింగ్ ఏజెంట్లుగా ప్రధాన పార్టీల అభ్యర్థుల అనుచరులే వ్యవహరించారు. ఇది వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇదే విధంగా ప్రస్తుతం సైతం కొందరు స్వతంత్రులు ప్రధాన పార్టీలకు మద్దతుగా నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చేందుకు..: కొందరు అభ్యర్థులు మాత్రం ప్రజాసమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. తమ ప్రాంతంతో ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారని, సమస్యను వెలుగులోకి తీసుకువచ్చేందుకే తాము పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు చెరకు కర్మాగారం తెరవాలని కోరుతూ బరిలోకి దిగారు. ఇలా క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు, నేతలు, సమాజం దృష్టికి తెచ్చేందుకు బరిలోకి దిగుతున్నా పోటీ ఇవ్వలేకపోతున్నారు. దీనికి పెరిగిన ప్రచార వ్యయమే ప్రధాన కారణమవుతోంది.
పెరిగిన ఖర్చులు తట్టుకోలేక..
కొందరు స్వతంత్రులుగా బరిలో నిలిచినా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పోటీపడేంత వనరులు సమకూర్చుకోవడం సాధ్యపడడం లేదు. మారిన ప్రచార సరళి, ఇతరత్రా వ్యయాల కారణంగా ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీచేయాలంటే రూ.కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పోటీచేయాలంటే రూ.లక్షల్లో వ్యయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న సాధారణ వ్యక్తులు స్వతంత్రులుగా పోటీచేసి తట్టుకోవడం కష్టంగా మారుతోంది. క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన, ప్రజలతో మమేకమవడం, పక్కా ప్రణాళికలతో స్వతంత్రులుగా పోటీచేసి గెలుపొంది తమదైన ముద్ర వేసిన నేతలు గతంలో ఎంతోమంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానాకాలం సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ..ఇబ్బంది పెడుతూ..
[ 19-05-2024]
అభివృద్ధికి మారుపేరుగా నిలిచే జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. మెదక్-ఎల్కతుర్తి 134 కి.మీ.ల 765డీజీ జాతీయ రహదారిని రూ.1,461 కోట్ల నిధులతో చేపట్టారు. -
చెరువు మట్టి.. పొలానికి పుష్టి
[ 19-05-2024]
రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకు పెరుగడంతో భూసారం తగ్గడమే కాకుండా చీడపీడల ఉద్ధృతితో పాటు పంట దిగుబడుల్లో తేడా ఏర్పడుతోంది. -
లెక్కలు తేలుస్తారు
[ 19-05-2024]
సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి. -
సీఎం ముఖచిత్రంతో..రాత పుస్తకాలు
[ 19-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచితంగా రెండు జతల ఏకరూప దుస్తులు, -
తొలకరికే తొందరొద్దు
[ 19-05-2024]
తొలకరి వర్షాలకే రైతులు తొందరపడి ఎలాంటి విత్తనాలు విత్తొద్దు.. భూమిలో 60 శాతానికి పైగా తేమ ఉన్నప్పుడే విత్తాలి.. ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం -
4 రోజులు.. రూ.4.29 కోట్లు
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధికులు స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. -
సైబర్ నేరస్థులకు ‘మ్యూల్’ ఖాతాలు
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్ఫోర్స్, సైబర్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి
[ 19-05-2024]
భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేత రఘునందన్రావు రాష్ట్ర డీజీపీని కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. -
అటు.. ఇటు ఓటేశారు!
[ 19-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే వజ్రాయుధం. దేశాన్ని పాలించేందుకు సమర్థ నేతలను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
పఠనాసక్తికి బాసట
[ 19-05-2024]
విద్యార్థులు సెలవులు రాగానే చరవాణులకు, టీవీలకు అతుక్కుపోతుంటారు. కేవలం పాఠశాలలు కొనసాగుతున్నప్పుడే చదువుపై దృష్టిపెడుతున్నారు. -
హామీలు అమలు చేయకుంటే రోడ్డెక్కుతాం: భారాస
[ 19-05-2024]
ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, లేదంటే రోడ్డెక్కుతామని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హెచ్చరించారు. -
అన్నదాతల ఆందోళన
[ 19-05-2024]
పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించిన రైతులు లారీల సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!