పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనని ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సోమవారం హవేలిఘనపూర్ నుంచి బూర్గుపల్లి వరకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్తో కలిసి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
బూర్గుపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, అభ్యర్థి నీలం మధు, తదితరులు
హవేలిఘనపూర్, న్యూస్టుడే: పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనని ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సోమవారం హవేలిఘనపూర్ నుంచి బూర్గుపల్లి వరకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్తో కలిసి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. బూర్గుపల్లిలో నీలం మధు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల పేదింటి బిడ్డకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. భారాస, భాజపాలు పదేళ్లుగా పేదలకు ఇళ్లు ఇవ్వలేదని అన్నారు. రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని భారాస ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత 5 గ్యారంటీలను అమలు చేసిందని అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్రావు మాట్లాడుతూ... పదేళ్లలో మన జీవితాలు ఆగమయ్యాయని, గెలిచిన మూడు నెలల్లో మెదక్లో కూడళ్లను అభివృద్ధి చేశామని, బూర్గుపల్లి ఉన్నత పాఠశాలకు రూ.57 లక్షలతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఎక్కడికి వెళ్లినా భారాస కనుమరుగైందని అన్నారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో భారాస పార్టీ దుకాణం బంద్ అయ్యిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మ్యాడం బాలకృష్ణ, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి సురేష్, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు మంజులు, మండలాధ్యక్షులు శ్రీనివాస్ నాయకులు పరశురాం, ఎంపీటీసీ అర్చన, నాయకులు పరశురాంగౌడ్, మహేందర్రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ ఉన్నారు.
రామాయంపేట: భారాస భూములు లాక్కుంటే 50 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ సీలింగ్ భూములకు పేదలకు పంచిందని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. రామాయంపేటలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. ఎమ్మెల్యే రోహిత్రావు మాట్లాడుతూ.. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానాకాలం సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ..ఇబ్బంది పెడుతూ..
[ 19-05-2024]
అభివృద్ధికి మారుపేరుగా నిలిచే జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. మెదక్-ఎల్కతుర్తి 134 కి.మీ.ల 765డీజీ జాతీయ రహదారిని రూ.1,461 కోట్ల నిధులతో చేపట్టారు. -
చెరువు మట్టి.. పొలానికి పుష్టి
[ 19-05-2024]
రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకు పెరుగడంతో భూసారం తగ్గడమే కాకుండా చీడపీడల ఉద్ధృతితో పాటు పంట దిగుబడుల్లో తేడా ఏర్పడుతోంది. -
లెక్కలు తేలుస్తారు
[ 19-05-2024]
సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి. -
సీఎం ముఖచిత్రంతో..రాత పుస్తకాలు
[ 19-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచితంగా రెండు జతల ఏకరూప దుస్తులు, -
తొలకరికే తొందరొద్దు
[ 19-05-2024]
తొలకరి వర్షాలకే రైతులు తొందరపడి ఎలాంటి విత్తనాలు విత్తొద్దు.. భూమిలో 60 శాతానికి పైగా తేమ ఉన్నప్పుడే విత్తాలి.. ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం -
4 రోజులు.. రూ.4.29 కోట్లు
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధికులు స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. -
సైబర్ నేరస్థులకు ‘మ్యూల్’ ఖాతాలు
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్ఫోర్స్, సైబర్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి
[ 19-05-2024]
భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేత రఘునందన్రావు రాష్ట్ర డీజీపీని కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. -
అటు.. ఇటు ఓటేశారు!
[ 19-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే వజ్రాయుధం. దేశాన్ని పాలించేందుకు సమర్థ నేతలను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
పఠనాసక్తికి బాసట
[ 19-05-2024]
విద్యార్థులు సెలవులు రాగానే చరవాణులకు, టీవీలకు అతుక్కుపోతుంటారు. కేవలం పాఠశాలలు కొనసాగుతున్నప్పుడే చదువుపై దృష్టిపెడుతున్నారు. -
హామీలు అమలు చేయకుంటే రోడ్డెక్కుతాం: భారాస
[ 19-05-2024]
ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, లేదంటే రోడ్డెక్కుతామని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హెచ్చరించారు. -
అన్నదాతల ఆందోళన
[ 19-05-2024]
పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించిన రైతులు లారీల సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM