సిబ్బంది అరకొర.. సేవలందక విలవిల
వ్యవసాయంతో సమాన ప్రాధాన్యం కలిగిన పాడిరంగంలో అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పశువైద్యులు లేనిచోట ఇన్ఛార్జిలతో నెట్టుకొస్తున్నారు. వైద్యంలో సహాయకులుగా వ్యవహరిస్తున్న అటెండర్లు, కాంపౌండర్ల
సకాలంలో పశువులకు అందని వైద్యం
సూర్యాపేట మండలం యండ్లపల్లిలో తెరచుకోని పశువైద్యశాల
సూర్యాపేట గ్రామీణం, న్యూస్టుడే: వ్యవసాయంతో సమాన ప్రాధాన్యం కలిగిన పాడిరంగంలో అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పశువైద్యులు లేనిచోట ఇన్ఛార్జిలతో నెట్టుకొస్తున్నారు. వైద్యంలో సహాయకులుగా వ్యవహరిస్తున్న అటెండర్లు, కాంపౌండర్ల కొరత అధికంగా ఉంది. కొన్నిచోట్ల పశువైద్యశాలలను తెరిచేందుకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది ఉన్నా మరికొన్నిచోట్ల ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వైద్యశాలల తలుపులు తెరచుకోవడం లేదు. సిబ్బంది కొరత వల్ల కొందరు గోపాలమిత్రలే గ్రామాల్లో కొద్దిపాటి వైద్యం అందిస్తూ రైతుల నుంచి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది లేకపోయినా భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. గుత్తేదారులు పనులు చేసి బిల్లులు తీసుకుంటున్నారు. వైద్యశాలలు మాత్రం వినియోగంలోకి రావడం లేదని తెలుస్తోంది.
తెరచుకోని పశువైద్యశాలలు..!
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పశుసంవర్ధక శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. పశువైద్య సిబ్బందిని ఇతర పనులకు వినియోగించినప్పుడు పూర్తి స్థాయిలో మూగజీవాలకు వైద్యం అందటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని పశువైద్యశాలలు వారానికి ఒకసారి మాత్రమే తెరచుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ రకాల వ్యాధులకు ఔషధాలు పంపిణీ చేస్తున్నామంటూ ఒకట్రెండు రోజులు మాత్రమే గ్రామాల్లో కనిపించి ఆ తర్వాత సిబ్బంది సొంత పనుల్లో నిమగ్నమవుతున్నారనే వాదనలు వ్యక్తమవుతున్నాయి.
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా..
హుజూర్నగర్ నియోజకవర్గంలో పశువైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో 16 మంది వెటర్నరీ వాలంటీర్లను సాగర్ సిమెంట్స్ పరిశ్రమ యాజమాన్యం నియమించింది. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చొరవతో పరిశ్రమ యాజమాన్యం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా వాలంటీర్లకు అక్టోబర్ నుంచి నెలకు రూ.10 వేల చొప్పున వేతనం చెల్లిస్తోంది. ఆ ప్రాంతంలో పాడిపశువులకు వైద్యసేవలందుతున్నాయి.
గోపాలమిత్రే దిక్కు
-వెంకటనాగిరెడ్డి, యండ్లపల్లి, సూర్యాపేట మండలం
యండ్లపల్లిలో పశువైద్యుడు, అటెండర్ లేరు. గోపాలమిత్ర మాత్రమే అప్పుడప్పుడు వస్తున్నారు. సిబ్బంది లేనప్పుడు మేం ఏమీ చేయలేమని అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. చాలారోజుల నుంచి యండ్లపల్లి పశువైద్య కేంద్రం తెరచుకోవడం లేదు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
-శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, సూర్యాపేట
పశువైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. హుజూర్నగర్ నియోజకవర్గంలో సీఎస్ఆర్లో భాగంగా సాగర్ సిమెంట్స్ పరిశ్రమ యాజమాన్యం 16 మంది వాలంటీర్లను నియమించింది. వాలంటీర్ల సహాయంతో అక్కడ వైద్యసేవలు అందిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలెక్టరేట్లో రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా భువనగిరిలో సాధారణ పరిశీలకుడు రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనమంతు కే.జెండగే సమక్షంలో సమావేశం నిర్వహించారు. -
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!