logo

నైపుణ్య శిక్షణ.. ఉపాధి రక్షణ

పారిశ్రామిక శిక్షణ సంస్ధ(ఐటీఐ) పూర్తి చేసిన వారికి అప్రెంటిషిప్‌ కోసం పరిశ్రమలలో చేరుతారు. దీంతో ఉపాధితో పాటు నేర్చుకున్నకోర్సులో నైపుణ్యం పెంపొందించుకుంటారు. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలలో ఉపాధి

Published : 15 Jan 2022 03:48 IST


నల్గొండ ఆర్టీసీ డిపోలో అప్రెంటిషిప్‌ చేస్తున్న ఐటీఐ పూర్తి చేసిన యువకులు

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పారిశ్రామిక శిక్షణ సంస్ధ(ఐటీఐ) పూర్తి చేసిన వారికి అప్రెంటిషిప్‌ కోసం పరిశ్రమలలో చేరుతారు. దీంతో ఉపాధితో పాటు నేర్చుకున్నకోర్సులో నైపుణ్యం పెంపొందించుకుంటారు. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐటీఐలో డీజిల్‌ మెకానిక్‌గా పూర్తి చేసిన యువకులకు జిల్లాలోని ఏడు ఆర్టీసీ డిపోలో అప్రెంటిషప్‌ పేరుతో 86 మందికి ఏడాది పాటు శిక్షణ ఇస్తున్నారు. గత ఏడాది జనవరిలో చేరిన వారికి ఈ నెలతో శిక్షణ పూర్తి అవుతుంది. ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త బ్యాచ్‌కి శిక్షణ ప్రారంభమవుతుంది. ఇప్పటికే వారికి ఇంటర్వ్యూలు పూర్తి చేశారు.

ఆర్టీసీ, యువకులకు ఉపయోగం.. ఆర్టీసీకి శ్రామిక్‌ సిబ్బంది కొరత ఉంది. చాలా రోజులుగా నియామకాలు లేవు. డిపోలో బస్సులు మరమ్మతు చేయడానికి ఇబ్బంది అవుతుంది. అప్రెంటిషిప్‌లో వీరిని తీసుకొని పనిచేయించడం వల్ల నైపుణ్యం పెరుగుతుంది. దీంతో పాటు ఆర్టీసీ సిబ్బంది కొరత అదిగమించవచ్చు. దీనిని పూర్తి చేసిన వారికి ఎన్‌సీటీవీ జారీ చేసే ధ్రువపత్రాలు ఇస్తారు. శిక్షణ పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.


స్టయిఫెండ్‌ పెంచాలి.. మనోహర్‌

శిక్షణకు వచ్చిన వారికి రూ.6931 మాత్రమే ఇస్తున్నారు. ఇది సరిపోవడం లేదని మొత్తాన్ని కనీసం రూ.10 వేలకు పెంచాలని కోరుతున్నాం. ఆర్టీసీలో ఉద్యోగాలు భర్తీ చేస్తే తమకు పాధాన్యత ఇవ్వాలి.


పని నేర్చుకుంటున్నాం.. మహేశ్‌

శిక్షణ బాగుంది. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యంతో బయటికి వెళ్లాక ఇతర సంస్థలో పనిచేస్తామనే భరోస కలిగింది. ఉపాధి దొరుకుతుందనే నమ్మకం ఉంది. ఏ ప్రయివేటు సంస్థలో నైనా పనిలో చేర్చుకుంటారనే విశ్వాసం ఏర్పడింది.


ద్వంద్వ శిక్షణ విధానాన్ని అమలు చేయాలి.. సప్న

డ్యూయల్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ (డీఎస్‌టీ) విధానం అమలు చేయాలి. ఐటీఐ చదువుతూనే ఆర్టీసీలో ప్రయోగాత్మక శిక్షణ(ప్రాక్టికల్‌) ఇస్తే బాగుంటుంది. నేర్చుకున్న పాఠ్యాంశాలపై అవగాహన పెరుగుతుంది. ట్రేడ్‌ పూర్తి చేసిన తర్వాతే అప్రెంటిషిప్‌ కోసం చేరితే ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి వస్తోంది. ఐటీఐ చేస్తూనే పరిశ్రమలలో శిక్షణ ఇస్తే అవగాహన పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని