logo

జిల్లా పోలీసు శాఖలో కరోనా కలకలం

సూర్యాపేట జిల్లా పోలీసులను కరోనా మహమ్మారి చుక్కలు చూపుతోంది. ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ సైతం కొద్దిరోజులుగా స్వీయ గృహ నిర్బంధంలో ఉండి బుధవారం పరీక్ష చేయించుకోగా నెగిటివ్‌ వచ్చింది. ఇప్పటికే

Published : 27 Jan 2022 03:50 IST

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా పోలీసులను కరోనా మహమ్మారి చుక్కలు చూపుతోంది. ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ సైతం కొద్దిరోజులుగా స్వీయ గృహ నిర్బంధంలో ఉండి బుధవారం పరీక్ష చేయించుకోగా నెగిటివ్‌ వచ్చింది. ఇప్పటికే సూర్యాపేట, కోదాడ డీఎస్పీలు మోహన్‌కుమార్‌, రఘు వైరస్‌ బారిన పడి తిరిగి కోలుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 70 మంది పోలీసులకు పాజిటివ్‌ సోకింది. ఇందులో ముగ్గురు ఎస్సైలు, 15 మంది ఏఆర్‌ కానిస్టేబుళ్లు, మిగిలిన వారు సివిల్‌ పోలీసులు ఉన్నారు. వారం రోజులుగా పోలీసు శాఖలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. కొవిడ్‌ బారిన పడినవారంతా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని