పోషక లోపాలకు చెక్..!
చిన్నారుల్లో పోషక లోపాలకు చెక్ పెట్టేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణ పోషకాలు అందడంలో లోటుపాట్లు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం.. అధికంగా పోషక గుణాలు ఉన్న అహారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. నూతనంగా
బాలామృతం ప్లస్తో మూడేళ్ల చిన్నారులకు మేలు
బాలామృతం ప్లస్ను లబ్ధిదారులకు అందజేస్తున్న అంగన్వాడీ ఉపాధ్యాయిని
మునగాల, తిరుమలగిరి, న్యూస్టుడే: చిన్నారుల్లో పోషక లోపాలకు చెక్ పెట్టేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణ పోషకాలు అందడంలో లోటుపాట్లు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం.. అధికంగా పోషక గుణాలు ఉన్న అహారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. నూతనంగా ‘బాలామృతం ప్లస్’ను ప్రవేశపెట్టింది. గతంలో 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్ను నెలకు ఒక్కోటి ఇవ్వగా, 1.25 కిలోల బాలామృతం ప్లస్ ప్యాకెట్లు రెండింటిని అందిస్తోంది.
అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారుల ఆరోగ్య స్థితిని మహిళా అభివృద్ధి శిశుసంక్షేమ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా వారి బరువు, ఎదుగుదలను క్రమం తప్పకుండా నమోదు చేస్తున్నారు. ఈ రికార్డుల ఆధారంగా కొందరు చిన్నారులు తీవ్ర పోషక లోపాల బారిన పడినట్లు గుర్తించారు. ఇలాంటి వారికి సాధారణ ఆహారంతో పాటు అధిక పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలని రాష్ట్ర మహిళ అభివృద్ధి శిశుసంక్షేమ శాఖ, టీఎస్ ఫుడ్స్, యూనిసెఫ్ అధికారులు ప్రత్యేకంగా ‘బాలామృతం ప్లస్’ను తయారుచేశారు.
బాలామృతం ప్లస్లో పోషకాలు ఇలా...
పాలపొడి, పల్లినూనె, రైస్, గోధుమ పిండి, శనగపప్పు, చెక్కరతోపాటు, కొవ్వు పదార్థాలు, విటమిన్స్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, లియాసిస్, జింక్ సమృద్ధిగా ఉండే మిశ్రమాలతో ‘బాలామృతం ప్లస్’ను తయారుచేశారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందజేసేందుకు వీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది.
పిల్లలు ఇష్టంగా తింటున్నారు
-అమరోజు సునీత, లబ్ధిదారు, మునగాల
ప్రభుత్వం నూతనంగా సరఫరా చేస్తున్న బాలామృతం ప్లస్ను చిన్నారులు ఇష్టంగా తింటున్నారు. గతంలో సరఫరా చేసిన బాలామృతం కంటే అధిక పోషకాలు ఉండటం వల్ల రుచికరంగా అనిపిస్తుంది.
అవగాహన కల్పిస్తున్నాం
-సంధ్యారాణి, అంగన్వాడీ ఉపాధ్యాయిని, మునగాల
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బాలామృతం ప్లస్తో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నాం. పుట్టిన పిల్లలు, తల్లులకు విలువైన పోషకాహారం. దీన్ని తీసుకోవడం వల్ల తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు.
చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యం
-జ్యోతిపద్మ, జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అధికారిణి
‘బాలామృతం ప్లస్’ అనేక పోషక విలువలు కలిగి ఉంటుంది. క్రమం తప్పకుండా చిన్నారులకు అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి. చిన్నారుల బరువు కొలతలను బట్టి ఏడు నెలలు నుంచి 36 నెలల వరకు అనుబంధ పౌష్టికాహారంగా రోజుకు 100 గ్రాముల చొప్పున ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్