బాల మేధావి.. అపర వాగ్దేవి
ఆరేళ్ల చిన్నారి.. ప్రపంచ పటంలోని 80 దేశాల రాజధానులు, జెండాలను గుర్తించడంతో పాటు గూగుల్, కంప్యూటర్, ఎన్సీఈఆర్టీ, ఎఫ్ఎస్ఎస్ఏటీ తదితర క్లిష్టమైన 100కు పైగా సంక్షిప్త
తల్లి చంద్రిక అడుగుతున్న గూగుల్, కంప్యూటర్ వంటి సంక్షిప్త నామాలకు
పూర్తి పదాలు చెబుతున్న చిన్నారి చేతన్రెడ్డి
మఠంపల్లి, న్యూస్టుడే: ఆరేళ్ల చిన్నారి.. ప్రపంచ పటంలోని 80 దేశాల రాజధానులు, జెండాలను గుర్తించడంతో పాటు గూగుల్, కంప్యూటర్, ఎన్సీఈఆర్టీ, ఎఫ్ఎస్ఎస్ఏటీ తదితర క్లిష్టమైన 100కు పైగా సంక్షిప్త నామాలకు పూర్తి పదాలు(అబ్రివేషన్లు) ఇట్టే చెప్పేస్తూ అబ్బుర పరుస్తున్నారు. 100 వరకు ఆవిష్కరణలు, వాటి ఆవిష్కర్తల పేర్లు అడిగిన క్షణాల్లోనే సమాధానమిస్తూ ఔరా అనిపిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు రాజధానులు.. జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు.. రాష్ట్ర, దేశ చిహ్నాలు, భూమి ఆవరణలు(పొరలు) అనర్గళంగా చెప్పడం మేధావులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆంగ్ల, గణిత, వైజ్ఞానిక అంశాలలో అపార జ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ఈ చిన్నారి ద్విమితీయ, త్రిమితీయ ఆకారాలు (2డి, 3డి షేప్స్) ఖండాలు, మహాసముద్రాలను పేర్కోవడం, ఆసియా, ఆఫ్రికా, నార్త్, సౌత్ అమెరికాలు, యూరోప్ ఖండాల పజిల్స్ 2 నిమిషాల్లో పూర్తిచేయడం విశేషం.
తల్లే గురువు: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామానికి చెందిన గాదె తిరుమలరెడ్డి, చంద్రిక దంపతుల ఆరేళ్ల కొడుకు చేతన్రెడ్డి ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమంలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఎంటెక్ పూర్తిచేసిన తల్లిదండ్రులలో తిరుమలరెడ్డి పాలకవీడు మండలం మహంకాళిగూడెంలోని డెక్కన్ సిమెంట్స్ పరిశ్రమలో ఏఈగా, చంద్రిక కోదాడలోని మిట్స్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. డీసీఎల్ (డెక్కన్ సిమెంట్స్) పాఠశాలలో చదువుకుంటున్న చేతన్రెడ్డి జ్ఞాపకశక్తి, చురుకుదనాన్ని గుర్తించిన అక్కడి ఉపాధ్యాయులు తల్లిదండ్రులను యూకేజీలో ఉండగానే విజ్ఞానదాయక అంశాలలో సాధన చేయించాలని సూచించారు. విద్యావంతురాలైన తల్లి కొవిడ్ సమయంలో జీకే, ఇతర అంశాలపై తర్ఫీదు ఇచ్చినట్లు చెప్పారు. వివిధ శ్లోకాలు, వేదాలు, ఇతిహాసాలు, షడ్రుచులు, తెలుగు నెలలు, 100 మంది కౌరవుల పేర్లు చెప్పగలగడం చేతన్ అపార జ్ఞాపకశక్తికి తార్కాణం. తన కొడుకును ఐఏఎస్ చేయించాలన్నదే ఆశయమని తల్లి చంద్రిక తెలిపారు. భర్త తిరుమలరెడ్డి సహకారంతో అంతర్జాతీయ సమాచారాన్ని సేకరించి శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్