logo

నేటికీ తెదేపా సంక్షేమ పథకాలే ప్రజలకు గుర్తు: బక్కని

ప్రజా సంక్షేమంలో తెదేపాను మించినది లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆలేరులో ఆయన పరిశీలించి మాట్లాడారు

Published : 22 May 2022 03:59 IST

ఆలేరులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులును సన్మానిస్తున్న స్థానిక నాయకులు

ఆలేరు, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమంలో తెదేపాను మించినది లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆలేరులో ఆయన పరిశీలించి మాట్లాడారు. తెరాస పాలనలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, అవినీతి తారస్థాయికి చేరిందన్నారు. తెదేపా పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నేటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈనెలాఖరు నాటికి నిర్దేశిత సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. త్వరలో యాదాద్రి భువనగిరి జిల్లాస్థాయి తెదేపా సమీక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నర్సింహులును స్థానిక నాయకులు సన్మానించారు. పార్టీ భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కుందారపు కృష్ణమాచారి, ఆలేరు మండల అధ్యక్షుడు మల్‌రెడ్డి సాంబిరెడ్డి, నాయకులు రాచర్ల నర్సింహులు, అనంతుల నర్సింహారెడ్డి, బోగ సవంతోష్‌, కొంతం సిద్ధార్థ పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని