వివాదాస్పద భూములే పెట్టుబడి!
నల్గొండ జిల్లాలోని ఓ తహసీల్దార్ కార్యాలయం అది. అక్కడ పోస్టింగ్ కోసం చాలా మంది అధికారులు పెద్ద స్థాయిలో పైరవీలు చేస్తుంటారు. ఇసుక రవాణాతో పాటు పట్టణానికి దగ్గరలో ఉన్న ప్రాంతం కావడంతో భూముల....
రూ.కోట్లకు పడగలెత్తుతున్న కొందరు తహసీల్దార్లు
* నల్గొండ జిల్లాలోని ఓ తహసీల్దార్ కార్యాలయం అది. అక్కడ పోస్టింగ్ కోసం చాలా మంది అధికారులు పెద్ద స్థాయిలో పైరవీలు చేస్తుంటారు. ఇసుక రవాణాతో పాటు పట్టణానికి దగ్గరలో ఉన్న ప్రాంతం కావడంతో భూముల విలువ రూ.కోట్లలో ఉంటుంది. ఇటీవల ఆ మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు తన తండ్రి చనిపోతే ఫౌతి (వారసత్వ మార్పు) చేయాలని సదరు అధికారి దగ్గరకు వెళితే రూ.2 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఓ ప్రజాప్రతినిధిని ఆశ్రయించి గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది.
* ఇదే మండలంలో ఓ రైతుకు 50 ఎకరాల వరకు భూమి ఉండగా.. అందులో 20 ఎకరాలు నిషేధిత జాబితాలో చేరింది. ఫలితంగా రైతుబంధు వంటి ప్రయోజనాలు నిలిచిపోయాయి. ఆ భూమి తనకు పూర్వికుల నుంచి వచ్చిందేనని, ఇందుకు అన్ని ధ్రువపత్రాలు ఉన్నందున దాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని తహసీల్దార్ను సంప్రదించారు. ఆ పని చేయాలంటే హైదరాబాద్లో విలాసవంతమైన భవంతిని కానుకగా ఇవ్వాలని కోరడంతో సదరు రైతు నివ్వెరపోయారు.
* జిల్లాలోని మరో మండలంలో తహసీల్దార్గా పనిచేస్తున్న ఓ అధికారికి రెవెన్యూలో వ్యవహారాలన్నీ కొట్టిన పిండి. యూనియన్కు సంబంధించిన కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. ఆయన ఎక్కడ పనిచేసినా ఆ మండలంలోని వివాదాస్పద భూముల వివరాలు తెలుసుకుంటారు. కలెక్టరేట్లోని ఇద్దరు అధికారుల ద్వారా వాటి వివరాలను ఉన్నతాధికారులకు చెప్పి వాటి క్రయవిక్రయాలకు ఎన్వోసీ తీసుకొస్తారు. ఇటీవలే సుమారు రూ.3 కోట్ల విలువైన రెండెకరాల భూమికి సైతం ఎన్వోసీ తీసుకొచ్చి తన అనుయాయులకు రిజిస్త్ట్రేషన్ చేయించినట్లు సమాచారం.
ఈనాడు, నల్గొండ: నల్గొండ జిల్లాలోని కొంత మంది తహసీల్దార్ల అవినీతి అక్రమాల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రతి పనికీ రేటు కట్టి, విచ్చలవిడి అవినీతికి పాల్పడుతుండటంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా నల్గొండ, దేవరకొండ రెవెన్యూ డివిజన్లో పనిచేస్తున్న నలుగురు తహసీల్దార్లు అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నా జిల్లా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. నల్గొండ నియోజకవర్గంలో పనిచేస్తున్న ఓ తహసీల్దార్ రెండున్నరేళ్లలో ఇసుక అక్రమ రవాణాతో పాటు వివాదాస్పద భూములకు ఎన్వోసీ ఇప్పిస్తూ రూ.కోట్లు కూడబెట్టుకున్నట్లు సంబంధిత రెవెన్యూ వర్గాల ద్వారానే తెలిసింది. సదరు తహసీల్దార్ గతంలో జిల్లా ఉన్నతాధికారుల వద్ద పనిచేయడంతో ఆ చనువునే పెట్టుబడిగా శాఖలో తనకున్న పరిచయాలతో అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న మునుగోడుతో పాటు దేవరకొండ నియోజకవర్గంలోని ముగ్గురు తహసీల్దార్లు యూనియన్ నేతలుగా చలామణి అవుతూ వివాదాస్పద భూములను ‘ధరణి’ వెబ్సైట్లోని లోపాలను ఆసరాగా చేసుకొని వాటికి ఎన్వోసీలు ఇప్పిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ అక్రమాలన్నింటికీ ఓ నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. ఇటీవల చింతపల్లి మండలంలో భూదాన్ భూములను కబ్జా చేయడంలోనూ ప్రజాప్రతినిధులు పాత్ర ఉందనేది ఇప్పటికే నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరించగా....జిల్లా వ్యాప్తంగా కొంత మంది తహసీల్దార్లు ముఖ్య ప్రజాప్రతినిధులతో సఖ్యతగా ఉంటూ పెద్దఎత్తున అక్రమాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఇటువైపు చూడకపోవడంతో ఇందులో వారి పాత్ర ఎంతన్నది తేలాల్సి ఉందని జిల్లా స్థాయి అధికారి ఒకరు ‘ఈనాడు’తో అభిప్రాయపడ్డారు. దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్మిస్తున్న చర్లగూడెం, కిష్టరాయినిపల్లి జలాశయాల పరిధిలో నిర్వాసితులకు పరిహారం పంపిణీలోనూ అనేక అక్రమాలు జరిగాయని కొంత మంది ఇటీవలే హైదరాబాద్లోని రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలెక్టరేట్లో రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా భువనగిరిలో సాధారణ పరిశీలకుడు రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనమంతు కే.జెండగే సమక్షంలో సమావేశం నిర్వహించారు. -
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం