logo

దత్తత పేరుతో సీఎం దగా: భాజపా

నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ది చేయడం తన బాధ్యత అని కంచర్లభూపాల్‌రెడ్డిని గెలిపించాలని గత ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ఇచ్చిన అమలు చేయకుండా  దగాచేశారని భాజపా రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు.

Published : 05 Dec 2022 06:10 IST

నల్గొండ: మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌

నీలగిరి, న్యూస్‌టుడే: నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ది చేయడం తన బాధ్యత అని కంచర్లభూపాల్‌రెడ్డిని గెలిపించాలని గత ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ఇచ్చిన అమలు చేయకుండా  దగాచేశారని భాజపా రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  తెరాస అధికారంలోకి వచ్చాక అభివృద్ధి జరగలేదన్నారు. భాజపా నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదన్నారు. రెండు పడక గదుల ఇళ్లు  ఇవ్వలేదని..పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. ఉద్యోగాల భర్తీ చేయలేదన్నారు. ప్రజల పక్షాన పోరాటం కోసం ఈనెల 9 నుంచి 15 వరకు నల్గొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బైక్‌ యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్‌, నల్గొండ పార్లమెంటు కన్వీనర్‌ బండారు ప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, నాయం భూపాల్‌రెడ్డి, పాలకూరి రవిగౌడ్‌, మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, నూకల వెంకట్‌నారాయణరెడ్డి, చర్లపల్లి గణేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని