ఉప్పొంగిన భక్తిభావం
భగభగ మండే ఎర్రటి నిప్పుకణికలు, లయబద్ధంగా మోగుతున్న డోలు వాయిద్యాలు...శివసత్తుల నృత్యాలు..వేద మంత్రోచ్చారణలు...పర్వత వాహనంలో ఆశీనులైన పార్వతీ పరమేశ్వరుల సమక్షంలో భక్తులు అగ్నిగుండాల్లో నడిచి భక్తిని చాటుకున్నారు.
అగ్నిగుండంలో నడిచిన భక్తులు
పర్వత వాహనంలో ఆశీనులైన పార్వతీ పరమేశ్వరులు
నార్కట్పల్లి గ్రామీణం, న్యూస్టుడే: భగభగ మండే ఎర్రటి నిప్పుకణికలు, లయబద్ధంగా మోగుతున్న డోలు వాయిద్యాలు...శివసత్తుల నృత్యాలు..వేద మంత్రోచ్చారణలు...పర్వత వాహనంలో ఆశీనులైన పార్వతీ పరమేశ్వరుల సమక్షంలో భక్తులు అగ్నిగుండాల్లో నడిచి భక్తిని చాటుకున్నారు. అదే సమయంలో చెర్వుగట్టు క్షేత్రంలో హరహర.. మహాదేవ.. శంభోశంకర నామస్మరణతో పరిసరాలు మార్మోగాయి. నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వేకువజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు, శివసత్తులు రావడంతో క్షేత్రపరిసరాలు జన సందోహంగా మారాయి. పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు నిప్పుకణికల్లో నడిచి భక్తిభావాన్ని చాటుకున్నారు. అగ్నిగుండాల్లో నడిచేందుకు శివసత్తులు, భక్తులు పోటీపడ్డారు. దీంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అంతకు ముందే ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆది దంపతులను పర్వత వాహనంపై భక్తుల జయజయ ధ్వానాల నడుమ దేవస్థానం వీధుల్లో ఊరేగిస్తూ అగ్నిగుండాల వద్దకు తీసుకొచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఎస్పీ నర్సింహారెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ మహేంద్రకుమార్, ఈవో నవీన్కుమార్, అర్చకులు సురేశ్, సతీశ్, నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అగ్నిగుండంలో నడుస్తున్న వీరముష్టి వంశస్థుడు, ఆలయ ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ
సంప్రదాయం ప్రకారం...
బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పాడిపంటలు బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తారు. ఈ సందర్భంగా వీరముష్టి వంశస్థులు ప్రత్యేకంగా పర్వత వాహనాన్ని తయారు చేసుకుని స్వామి అమ్మవార్ల ముందు నృత్యాలతో సందడి చేస్తారు. తొలుత వీరు అగ్నిగుండాల్లో నడుస్తారు. తదుపరి భక్తులు నడుస్తారు. ఈ వంశస్థుల్లోనూ వీరభద్రస్వామి పూనకం వచ్చినవారు ఇలా చేయడం ఆనవాయితీ. అగ్నిగుండాల్లో నడిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయనేది భక్తులు విశ్వసిస్తారు.
నేడు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు
బుధవారం తెల్లవారుజామున దోపోత్సవం, అశ్వవాహన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అష్టోత్తర శత కలశాలతో అభిషేకం, సూర్యనమస్కారాలు, దీక్షాహోమం, బలిహరణ, త్రిశూల స్నానం, క్షేత్రపాలక, కాలభైరపులకు విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం పుష్పోత్సవం, ఏకాంత సేవ పూజలు జరుపుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్