మిషన్ 8
సూర్యాపేట పుర పరిధిలోని దురాజ్పల్లిలో రెండేళ్లకోసారి జరిగే శ్రీ లింగమంతుల స్వామి జాతరను విజయవంతం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సూర్యాపేట కలెక్టరేట్, చివ్వెంల, న్యూస్టుడే
సూర్యాపేట పుర పరిధిలోని దురాజ్పల్లిలో రెండేళ్లకోసారి జరిగే శ్రీ లింగమంతుల స్వామి జాతరను విజయవంతం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి 9 వరకు జరిగే జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వివిధ శాఖల సమన్వయంతో జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర జరిగే పెద్దగట్టు చుట్టూ ఎనిమిది జోన్లుగా విభజించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీ, పుర కమిషనర్లకు సంబంధించి శాఖల అధికారులు, సిబ్బంది సదరు జోన్లలో విధులు నిర్వర్తించేలా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమిది జోన్లకు సంబంధించి మూడు షిఫ్టుల్లో 188 చొప్పున 564 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించేలా సన్నాహాలు చేశారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి పది గంటల వరకు, రాత్రి పది నుంచి ఉదయం 6 గంటల వరకు విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
జోన్-1
దురాజ్పల్లి జంక్షన్ వద్ద నుంచి కో-ఆపరేటివ్ కార్యాలయం వరకు ఒకటో జోన్గా విభజించారు. భక్తులు లోపలికి వచ్చే మార్గం కావడంతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరిధిలో ఒక పంచాయతీరాజ్ అధికారి, హెల్త్ అసిస్టెంట్, సూపర్ వైజర్, పారిశుద్ధ్య జవాన్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ్యానికి సంబంధించి, భక్తులకు తాగునీటి, ఇతర ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నారు.
జోన్-2
కో-ఆపరేటివ్ కార్యాలయం నుంచి కట్ట మైసమ్మ వరకు జోన్-2గా కేటాయించారు. ఈ జోన్లో నుంచి భక్తులు లోపలికి వస్తారు. ఈ ప్రాంతంలో భక్తులకు తాగునీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు సిబ్బంది నిర్వర్తించే విధులను పంచాయతీ అధికారులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు.
జోన్-3
చెరువు కట్ట మైసమ్మ దగ్గరి నుంచి ఎగ్జిబిషన్ వరకు జోన్-3గా నిర్ణయించారు. ఈ జోన్లో భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని అధికారులు సూచనలు జారీ చేశారు. సమీపంలో వైద్య, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
జోన్-4
ఎగ్జిబిషన్ ప్రాంతం నుంచి కోనేటి వరకు జోన్- 4గా అధికారులు కేటాయించారు. ఈ ప్రాంతంలోనూ భక్తులకు స్నానపు వాటికలు, మరుగుదొడ్లు ఉండటంలో ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య సిబ్బంది సక్రమంగా పనులు చేసేలా జవాన్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు అందుబాటులో ఉండనున్నారు.
జోన్-5
కోనేటి నుంచి ప్రభుత్వ బోర్ల వరకు జోన్- 5గా విభజించారు. ఈ ప్రాంతంలో భక్తులు, సమీప గ్రామాల ప్రజలు, వాహనాల పార్కింగ్ ఉండటంతో ఇక్కడ అధికంగా తాకిడి ఉండనుంది. దీంతో సదరు ప్రాంతంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. వాహనాల రాకపోకలకు సంబంధించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోనున్నారు.
జోన్-6
ప్రభుత్వ బోర్ల నుంచి సింహద్వారం వరకు జోన్- 6గా నిర్ణయించారు. వీఐపీల సందర్శనార్ధం ఈ ద్వారం కేటాయించడంతో ఎప్పటికప్పడు ట్రాఫిక్ వాహనాల మళ్లింపు, వాహనాలు నిలుపకుండా, భక్తులు రాకపోకలు సైతం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.
జోన్-7
సింహద్వారం నుంచి ఖాసింపేట జంక్షన్ వద్దకు జోన్- 7గా నిర్ణయించారు. ఈ ప్రాంతంలో జాతీయ ప్రధానదారి ఉండటంతో భక్తులు రాకపోకలు అధికంగా సాగిస్తుంటారు. ద్విచక్ర వాహనాలు, కార్లు రహదారిపైకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. వీఐపీల రాకపోకలు ఉండటంతో పోలీసులు అధికారులు ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
జోన్-8
ఖాసీంపేట నుంచి మళ్లీ దురాజ్పల్లి జంక్షన్ వరకు జోన్- 8గా విభజించారు. ఈ ప్రాంతంలో నేరేడుచర్ల రహదారి మీదుగా భక్తులు, ఇతర ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. జాతరకు వచ్చే భక్తులు ద్విచక్ర వాహనాలు ఇక్కడే నిలిపేలా చర్యలు తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్