రమ్మంటోంది.. పెద్దగట్టు
దురాజ్పల్లి పెద్దగట్టు వద్ద జరిగే శ్రీ లింగమంతుల స్వామి జాతర ఆదివారం ప్రారంభం కానుంది. జాతరకు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సూర్యాపేట కలెక్టరేట్, చివ్వెంల, న్యూస్టుడే
జాతర జరిగే పెద్దగట్టు
దురాజ్పల్లి పెద్దగట్టు వద్ద జరిగే శ్రీ లింగమంతుల స్వామి జాతర ఆదివారం ప్రారంభం కానుంది. జాతరకు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యలను పర్యవేక్షిస్తూ.. దగ్గర ఉండి వెంటనే పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించారు.
ఎక్కడికక్కడ పార్కింగ్..
వాహనాలు నిలిపేందుకు గట్టు సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం
జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. గట్టు నలుమూలల నుంచి అవకాశం ఉండటంతో వారి కోసం గట్టు నలుమూలల్లో వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు చేశారు. కార్లు, ద్విచక్ర వాహనాలు వేర్వేరుగా నిలిపేలా చర్యలు తీసుకున్నారు. సూర్యాపేట మీదుగా జాతరకు వచ్చే భక్తుల వాహనాలకు జాతీయ రహదారి వద్ద గల హెచ్పీ పెట్రోల్ బంక్ నుంచి రామకోటి తండాకు వెళ్లేమార్గంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు.
* గరిడేపల్లి, పెన్పహాడ్ వైపు నుంచి వాహనాల కోసం కలెక్టరేట్ వెనుక భాగంలో, కోదాడ, మునగాల గుంపుల వైపు వచ్చే భక్తులకు ఖాసీంపేట మార్గంలో, మోతె, చివ్వెంల మీదుగా జాతరకు వచ్చే భక్తుల వాహనాలను చివ్వెంల మీదుగా మళ్లించి మున్యానాయక్ తండా, వీఐపీల కోసం పెద్దగట్టు తూర్పుమెట్లకు ఎదురుగా కేటాయించారు.
పిల్లలు తప్పిపోతే..
సమాచారం తెలిపేందుకు అధికారులు ఉండే ప్రాంతం
జాతరకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. తల్లిదండ్రులతోపాటు చిన్నారులు కూడా జాతరకు వస్తారు. భక్తులు అధికంగా ఉండటంతో చిన్నారులు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. తప్పిపోయిన చిన్నారుల కోసం సమాచారం ఇచ్చేందుకు మర్రిచెట్టు కింద అధికారులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. తప్పిపోయిన పిల్లల సమాచారం ఇవ్వగానే చిన్నారుల గుర్తులతో మైకులో తెలిపేలా ఏర్పాట్లు చేశారు. పిల్లల సమాచారం తెలిస్తే పాయింట్ వద్దకు తీసుకు రావాలని సూచించేలా ఏర్పాట్లు చేశారు.
ఘర్షణలు చోటు చేసుకోకుండా..
పోలీస్ కంట్రోల్ రూం
జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. 1850 మంది పోలీసు సిబ్బంది, 500 మంది వాలంటీర్లు 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. జాతరలో చోరీలు జరిగే ప్రమాదం ఉండటంతో దొంగలను గుర్తించేందుకు 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రతి నిమిషం నిఘా ఉండేలా గట్టు కింద మర్రిచెట్లు సమీపంలో పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను దారి మళ్లింపు ప్రక్రియ ఇప్పటికే చేపట్టారు.
అందుబాటులో వైద్య శిబిరం
మర్రిచెట్టు సమీపంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం
జాతరకు వచ్చే భక్తులకు ప్రమాదం జరిగినా, అనారోగ్యానికి గురైన ఇబ్బందులు లేకుండా ఐదు రోజుల పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గట్టు కింద మర్రిచెట్టు సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అత్యవసర మందులు సైతం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం