logo

లారీ క్లీనర్‌ హత్య

లారీ క్లీనర్‌ను డ్రైవర్‌ హత్య చేసిన ఘటన బొమ్మలరామారంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....

Published : 09 Feb 2023 03:22 IST

ఓం ప్రకాశ్‌ సోదియా

బొమ్మలరామారం, న్యూస్‌టుడే: లారీ క్లీనర్‌ను డ్రైవర్‌ హత్య చేసిన ఘటన బొమ్మలరామారంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని ఓ పరిశ్రమలో బిహార్‌ రాష్ట్రానికి చెందిన రాజేందర్‌ సింగ్‌ లారీ డ్రైవర్‌గా, మహారాష్ట్రకు చెందిన ఓం ప్రకాశ్‌ సోదియా (20) క్లీనర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల రాజేందర్‌ సింగ్‌, సోదియా స్నేహితుడిని లారీ క్లీనర్‌గా తీసుకెళ్లి అక్కడే వదిలేసి వచ్చారు. ఈ విషయమై వీరిద్దరి మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని రాజేందర్‌ సింగ్‌, ఓం ప్రకాశ్‌ సోదియాను కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి డ్రైవర్లు చికిత్స నిమిత్తం ఘట్కేసర్‌లో ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా మృతి చెందారు. మరో డ్రైవర్‌ నరేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకన్న వెల్లడించారు. ఘటనా స్థలాన్ని భువనగిరి ఏసీపీ వెంకటరెడ్డి, భువనగిరి రూరల్‌ సీఐ వెంకటయ్య పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని