శోభకృత్ వచ్చేసింది.. ఆరు రుచులు తెచ్చేసింది
శుభకృత్ నామ సంవత్సరం మంగళవారంతో కాలగమనంలో కలిసిపోయింది. కొత్త ఆలోచనలు, కొంగొత్త రుచులు, శోభాయమానమైన రీతిలో ‘శోభకృత్’ పేరుతో తెలుగువారికి ప్రత్యేకమైన, ఇష్టమైన మరో కొత్త సంవత్సరం బుధవారం మనల్ని పలకరించింది
షడ్రుచుల సమ్మిళితమే జీవితం
శుభకృత్ నామ సంవత్సరం మంగళవారంతో కాలగమనంలో కలిసిపోయింది. కొత్త ఆలోచనలు, కొంగొత్త రుచులు, శోభాయమానమైన రీతిలో ‘శోభకృత్’ పేరుతో తెలుగువారికి ప్రత్యేకమైన, ఇష్టమైన మరో కొత్త సంవత్సరం బుధవారం మనల్ని పలకరించింది. ఏ పండగైనా సంబరాన్నే తెస్తుంది. ఉగాది రోజున వేకువజామునే లేచి నువ్వుల పిండిని శరీరానికి పూసుకుని అభ్యంగన స్నానం ఆచరించడం సంప్రదాయం. తొలుత ఉగాది పచ్చడిని సేవించి, భక్ష్యాలు తినడం, సాయంత్రం వేళ ఆలయంలోనో, గ్రామ కూడలిలోనో పురోహితుడు నిర్వహించే పంచాంగ పఠనానికి హాజరై కాల, మాన పరిస్థితులను బేరీజు వేసుకోవడం, వీలున్న ప్రాంతాల్లో కవిసమ్మేళనాలకు వెళ్లి కవులు వినిపించే కవితలను విని ఇంటికి చేరుకోవడం ఉగాది ప్రత్యేకత.
* చేదు: ప్రకృతి ప్రకోపం రైతులకు చేదు అనుభవాలనే మిగుల్చుతోంది. చెమటోడ్చి ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అకాల వర్షాలకు, వడగళ్ల వంటి కడగండ్లకు బలవుతుంటే రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. వీటి బారిన పడకుండా మిగిలిన పంటలు చీడ,పీడలు, దళారులనుంచి తప్పించుకోలేకపోతున్నాయి.
* వగరు: తినడానికి కొంత ఇబ్బందికరంగా అనిపించినా, ఎలాగోలా మనసు చేసుకుని చక్కగా తినగలిగితే వగరు శరీరానికి మంచే చేస్తుంది. ప్రస్తుతం పరీక్షల సీజన్. విద్యార్థులకు కొంత ఇబ్బందికరం అనిపించినా, శ్రమించి సన్నద్ధమై ఎదుర్కొంటే భవితకు చక్కని మార్గాన్ని ఇస్తాయి.
* కారం: కారం కటువుగానే ఉంటుంది. మోతాదును మించితే దుష్ప్రభావాన్ని చూపుతుంది. రాజకీయ నాయకులకు ఓ వైపు కార్యకర్తలనుంచి ఒత్తిడి, అధిష్ఠానం నుంచి ఒత్తిడి, సొంత పార్టీలలో ప్రత్యర్థుల నుంచి ఒత్తిడి.. ఇలా నిత్యం ఒంటిపై కారం పూసుకున్న చందమే వారి పరిస్థితి. ఇప్పటికే కొన్ని పార్టీలు పాదయాత్రలను చేపట్టగా, మరికొన్ని పార్టీలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని క్షేత్రస్థాయి నాయకత్వాలకు ఆల్టిమేటం ఇచ్చాయి.
* ఉప్పు: ఉప్పు..ముప్పు అంటారు. ఇది కూడా మోతాదులోనే ఉండాలి. లేదంటే ‘పంటికింద ఉప్పురాయిలా..’ అనే సామెత గుర్తుకు వస్తుంది. ఎంతో కాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి..ఈ సంతోషంతో వాటి సాధనలో నిమగ్నమయ్యారు వారంతా. పరీక్షలు రాసే సమయానికి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం నిరుద్యోగులకు నిజంగా మింగుడుపడని విషయమే.
* పులుపు: కొద్దిమోతాదు అటూ, ఇటు అయినా భరించకతప్పని పరిస్థితి ఇది. ధరల పెరుగుదల నిజంగా పులుపునకు వర్తిస్తుంది. బంగారం, వెండి, పెట్రో ఉత్పత్తులు, గ్యాస్, విద్యుత్తు, సిమెంటు, ఐరన్ తదితర ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. అయినా ఏదో విధంగా ఎంతోకొంత వెసులుబాటు చేసుకుని కొనుగోలు చేయకతప్పని పరిస్థితి. వివాహాది శుభకార్యాలు చేసేవారు బంగారం, వెండి కొనాల్సిందే. ఇల్లులేని వారు చిన్నపాటి ఇంటి నిర్మాణం అయినా చేపట్టాల్సిందే. భారం అయినా మోయక జనానికి తప్పడంలేదు.
* తీపి: ఇప్పటికే కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు దళితబంధు, రుణమాఫీ, రెండు పడకగదుల ఇళ్ల పంపిణీకి చర్యలు, గృహలక్ష్మి వంటి కొత్త పథకాలు ప్రజలకు కొంత తీపిని పంచేవే. సీఎం ప్రకటనలను బట్టి చూస్తే ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరికొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశాలు కూడా ప్రజలకు తీపికబురును అందించేవే.
ప్రస్తుత పరిస్థితుల్లో షడ్రుచుల తీరు ఇదీ..
మనిషి జీవితం కష్ట, సుఖాల సమ్మిళితం అని చెప్పడానికి షడ్రుచులతో కూడిన ‘ఉగాది పచ్చడి’తో మొదలవుతుంది. ఈ ఆరు రుచులు, వాటి లక్షణాలు ఇలా.. పులుపు- ఆమ్లం, తీపి-మధురం, వగరు- కషాయం, చేదు-పిత్తం, కారం- కటువు, ఉప్పు- లవణం ఉంటాయి. అందుకే ఉగాది పచ్చడిలో ఆరు రుచుల ఆస్వాదన కోసం వేపపువ్వు, లేత మామిడికాయ, బెల్లం, కొత్తగా వచ్చిన చింతపండు, ఉప్పు, కారం వినియోగిస్తారు.
కవి సమ్మేళనం
ఉగాదికి, మాతృభాషకు, కవి సమ్మేళనానికి సంబంధం ఉంది. ఉగాది సమయంలో కొత్త చివుళ్లు తిని శ్రావ్యంగా కూసే కోకిల పాటలు కవుల మనసుల్లో కొత్త ఆలోచనలను కలిగిస్తుంటాయి. తెలుగుభాష మాధుర్యాన్ని చాటడానికి కవి సమ్మేళనాలు ఒక చక్కటి వేదిక. దేశ, జనం హితం కోరుతూ వారు కవితలను అల్లి ఉగాది సందర్భంగా ఏర్పాటుచేసే కవి సమ్మేళనాల్లో వినిపిస్తుంటారు. ఇలాంటి సమ్మేళనాలకు చిన్నారులను తీసుకెళ్లడం ద్వారా వారిలో తెలుగుభాష పట్ల మమకారాన్ని, కవిత్వ రచనపట్ల ఆసక్తిని పెంచడానికి వీలుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలెక్టరేట్లో రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా భువనగిరిలో సాధారణ పరిశీలకుడు రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనమంతు కే.జెండగే సమక్షంలో సమావేశం నిర్వహించారు. -
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?